Showing posts with label picture. Show all posts
Showing posts with label picture. Show all posts

అందరిని పరుగు పెట్టిస్తాం

Friday, January 31, 2014

డిల్లీలో పార్లమెంటు సబ్యులను పరుగు పెట్టించడానికి విశాఖపట్నం లో సమైక్యపరుగు నిర్వహించామని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు డిల్లీలో జరిగే ఛలో డిల్లీ ఆందోళనకు అందరూ కలిసిరావాలని ఆయనపిలుపు ఇచ్చారు. పిబ్రవరి ఇరవై ఒక్కటిన పార్లమెంటు సమావేశాల చివరి రోజు అని ,ఈలోగా సమైక్య రాష్ట్రం కోసం మనం అప్రమత్తంగా ఉండి, ఆ రోజు విజయోత్సవం జరుపుకోవచ్చని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Continue Reading | comments

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
కొప్పవరం (అనపర్తి), న్యూస్‌లైన్ :భర్త, ఇద్దరు పిల్లల ఎదుటే ప్రయాణికురాలిని వికృత చేష్టలతో వేధించి, లైంగికదాడికి యత్నించిన ఆటోడ్రైవర్లను గ్రామస్తులు చెప్పులతో కొట్టి గుణపాఠం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు గత 26న క్రైస్తవ సభలకు గుంటూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం విజయవాడలో కాకినాడ పాస్ట్ పాసింజర్ ఎక్కి రాత్రి  10.30కి అనపర్తి వచ్చారు. 
 
 అక్కడినుంచి కొప్పవరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద దుప్పలపూడికి చెందిన ఆటోడ్రైవర్ కర్రి గంగిరెడ్డితో బేరం కుదుర్చుకున్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాకి చెందిన మరో డ్రైవర్ చిట్టూరి శివాజీని వెంటబెట్టుకుని గంగిరెడ్డి తన ఆటోలో వీరిని తీసుకుని బయలుదేరాడు. ఆటోను వారు నేరుగా కాకుండా అనపర్తి శివారు కొత్తూరు శ్మశాన వాటిక మీదుగా తీసుకువెళ్లారు. ఆటోను శివాజీ నడుపుతూ ఉండగా, గంగిరెడ్డి పక్కనే కూర్చుని వెనుకనున్న మహిళతో వికృతచేష్టలు ప్రారంభించాడు. ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. శ్మశానవాటిక వద్ద ఆటో ఆపిన డ్రైవర్లు ఆమె చేయి పట్టుకుని లాగబోయారు.
 
 దీంతో భార్యాభర్తలు భయంతో బిక్కుమంటూ ఆటోలోనే కూర్చునిపోయారు. పరిస్థితి దిగజారుతున్నా అర్ధరాత్రి కావడం, పక్కనే బిడ్డలు ఉండడంతో భర్త వారిని ఎదిరించలేదు. డ్రైవర్లకు అనుమానం రాకుండా సెల్ ఫోన్‌లో బంధు మిత్రులకు కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈలోగా శ్మశానవాటికకు దాపునే ఉన్న కెనాల్ రోడ్లో వాహన సంచారం కనిపించడంతో అక్కడ అనుకూలంగా లేదనుకున్న డ్రైవర్లు ఆటోను ముం దుకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గంగిరెడ్డి, శివాజీ బాధితురాలి భర్తను దారి గురించి అడిగారు. లక్ష్మీనర్సాపురంలో తాను పనిచేసే రైసుమిల్లు ఉండడంతో అటువైపు ఆటోను తరలించాలని భావించిన భర్త అటు జనసంచారం ఉండదని వారితో చెప్పాడు. దీంతో డ్రైవర్లు ఆటోను అటే మళ్లించారు. 
 
 రైసుమిల్లు దాటిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్లు కిందికి దిగి తమ ప్లాన్ అమలుపై మాట్లాడుకుంటుండగా, భర్త ఫోన్ ద్వారా తన స్నేహితునికి పరిస్థితి తెలిపాడు. ఈలోగా మరో ఇద్దరు అతడికి ఫోన్ చేశారు. వారికి చోటు చెప్పి వెంటనే రమ్మన్నాడు. దీంతో వారందరూ హుటాహుటిన బయలుదేరి ఆటో ఉన్న ప్రాంతానికి వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ వారు కొప్పవరం లాక్కెళ్లి బాధితుల ఇంటికి చేరువలో స్తంభాలకు కట్టేశారు. వారి బట్టలు ఊడదీయించి గోచీలు పెట్టించారు. అర్ధరాత్రి ఈ సంగతి గ్రా మంలో దావానంలా వ్యాపించడంతో అంద రూ అక్కడకు చేరుకున్నారు. సాటి మహిళకు జరిగిన అవమానంపై కోపోద్రిక్తులైన మహిళలు గంగిరెడ్డి, శివాజీలను చెప్పులతో చావగొట్టారు. సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు గురువారం ఉదయం వారిద్దరినీ పోలీసు స్టే షన్‌కు
 తరలించారు.

Sakshi
Continue Reading | comments

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు
సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు.
 
 
ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు.
 
 కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు.
Continue Reading | comments

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
బెంగళూరు : దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు.  అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్ కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్ మెంట్ లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు.

తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు.

ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.
Continue Reading | comments

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం తప్పదా!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదా?ఎఐసిసి ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి(ని విలీనం చేయాల్సిందేనని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం విశేషం. తెలంగాణ బి్ల్లుపై శాసనసభ లో చర్చ పూర్తి అయ్యాక ఆయన ఈ విషయం చెప్పడం విశేషం.ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నూటికి నూరుశాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
Continue Reading | comments

రఘురాజు విభజన వాద బిజెపిలో ఎలా చేరతారో

Thursday, January 30, 2014

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని బావిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంటికి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు వెళ్లడం చర్చనీయాంశం అయింది. రాజు బిజెపిలో చేరి నరసాపురంలో పోటీచేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. కొందరు శాసనసభ అభ్యర్దుల విషయంలో వచ్చిన విబేదాలతో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దూరం అవుతున్నారని అంటున్నారు.అయితే వీర సమైక్యవాదనని, సుప్రింకోర్టులో కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాడతానని చెబుతున్న రాజు విభజనవాద పార్టీ అయిన బిజెపిలో ఎలా చేరతారబ్బా!ఇదే రాజకీయ విచిత్రం అంటే
Continue Reading | comments

గాంధీ 'హేరాం' అనలేదు

గాంధీ 'హేరాం' అనలేదు
 తలవని తలంపుగా 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగిన గాంధీ హత్యకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఆయన ‘సాక్షితో పంచుకున్నారు. నేటికీ కల్యాణం తానుండే వీధులను ఆయన తెల్లవారుజామున లేచి శుభ్రం చేసుకుంటూ గాంధేయవాదాన్ని చాటుతున్నారు. 90 ఏళ్ల కల్యాణం కేజ్రీవాల్ గాంధీపైన రెండు ప్రత్యేకమైన వెబ్‌సైట్లను రూపొందించి నెటిజన్లకూ గాంధేయవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే...
 
1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది.  కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.

కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారుు. అక్కడే కుప్ప కూలిన గాంధీమహాత్ముని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లించే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ ఆయనను బిర్లా హౌస్‌లోకే తరలించారు.  
 
పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీ హత్యకు 48 గంటల ముందు ఆయన అభిమాని ఒకరు జాగ్రత్తగా ఉండాలని బాపూజీని కోరారు.
అప్పుడు ఆయన నవ్వుతూ ‘‘ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. ఆ ఉన్మాదిపై నాకు ఎటువంటి కోపమూ రాదు. పరమాత్మ నా హృదయంలోనూ, పెదాలపైనా నర్తిస్తున్నప్పుడు నేను చావుకు ఎందుకు భయపడాలి’’ అని అన్నారు.
 
గాంధీ హత్య గురించిన ఎన్నో విషయాలను వెల్లడించిన వి.కల్యాణం ప్రస్తుతం చెన్నై తేనాంపేటలో నివశిస్తున్నారు. 90 ఏళ్ల ముదిమి వయసులోనే ఆయన గాంధేయవాదాన్ని, గాంధీ సిద్ధాంతాలను తుచ తప్పక ఆచరిస్తు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి వెంకిట కల్యాణం అలియాస్ వి.కల్యాణం ఆగస్టు 15, 1922న జన్మించారు.  తమిళుడే అయినా పుట్టింది, పెరిగింది ఉత్తరభారతంలోనే.
24 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, 26వ ఏట గాంధీ సబర్మతీ ఆశ్రమంలో చేరారు కల్యాణం. గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసే మహదేవ్ దేశాయ్ మృతి చెందడంతో అనుకోకుండా గాంధీ 1944లో కల్యాణంను వ్యక్తిగత సెక్రటరీగా నియమించుకున్నారు. అయిదు భాషలు రాయడం, చదవడం వచ్చిన కల్యాణం అనతి కాలంలోనే గాంధీకి అత్యంత ఆప్తులయ్యారు.

sakshi
Continue Reading | comments

విభజన బిల్లు తిరస్కారానికి ఆమోదం-స్పీకర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లు ను తిరస్కరించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటు గా ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనసభ ను నిరవధిక వాయిదా వేయడానికి ముందుగా ఆయన సభలో ఎందరు మాట్లాడారు? తదితర విషయాలు వివరిస్తూ ,చివరన ఆయన కిరణ్ నోటీసు ప్రబుత్వ తీర్మానం కనుక ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు.ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మనోహర్ చాలా ఉద్వేగంగా కనిపించారు.చాలా వేగంగా తన ప్రకటనను చదివి వినిపించి సభను ముగించారు. సవరణలన్నీ, అఫిడవిట్లు అన్నీ కూడా చర్చలో భాగమని ఆయన ప్రకటించారు.
Continue Reading | comments

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Continue Reading | comments

అశ్లీల మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని బెదిరించినట్టు షెర్లీన్ కేసు

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!
'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేశ్ పాల్ పై ఆరోపణలతో  శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు. కామసూత్ర 3డి చిత్రంలో నటించినందుకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని,  తనను లైంగిక వేధించడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ జప్తు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రూపేశ్ పై షెర్లీన్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
 
దర్శకుడితో విబేధాలు తలెత్తడంతో  'కామసూత్ర 3డి' చిత్రం నిర్మాతలతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటోంది. తన అశ్లీల చిత్రాల, వీడియోలను కామసూత్ర చిత్రంలో వినియోగించకుండా.. గ్లోబల్ కమర్షియల్ అశ్లీల (పోర్న్) మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని రూపేశ్ బెదిరించినట్టు షెర్లీన్ ఆరోపించారని పోలీసు అధికారి తెలిపారు. కామసూత్ర చిత్రంలో తన స్థానంలో మరొకరిని తీసుకుంటానని కూడా దర్శకుడు బ్లాక్ మెయిల్ చేశారని, గతంలో తనకు అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ తో రూపేశ్ విసిగించారని షెర్లీన్ ఫిర్యాదులో తెలిపారని  పోలీసులు వెల్లడించారు. 
 
అయితే షెర్లీన్ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని రూపేశ్ ఖండించారు. షెర్లీన్ ఆరోపణలకు భిన్నంగా రూపేశ్ తన కథనాన్ని మీడియాకు వివరించారు. తనను అప్పా, కెప్టెన్ అంటూ సంబోధించేవారని.. ఆమె కోసం గంటల కొద్ది అందరం షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసే వారం.  ఆమె తనను మానసికంగా చిత్రవధకు గురి చేసింది. షెర్లిన్ మాకు నరకం చూపించిందని రూపేశ్ ప్రతి ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన అశ్లీల వీడియోను షెర్లీన్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకుందని రూపేశ్ తెలిపారు. 
 
షెర్లీన్ ఫిర్యాదు ఆధారంగా రూపేశ్ పై ప్రాథమిక విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి రావాలని పలుమార్లు కోరినా షెర్లీన్ అందుబాటులోకి రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తాను బిజీగా ఉన్నందున పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని షెర్లీన్ తెలిపింది.
 http://www.sakshi.com/news/movies/sherlyn-chopra-files-a-case-on-kamasutra-3d-director-rupesh-paul-101437?pfrom=home-top-story
Continue Reading | comments

స్టాలిన్ కు భద్రత పెంచండి

Wednesday, January 29, 2014

ప్రధాని గారూ.. స్టాలిన్ కు భద్రత పెంచండి
చెన్నై: తమిళనాట డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తన కుమారుడు స్టాలిన్ కు భద్రత పెంచాల్సిందిగా డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. కరుణానిధి ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు అంటూ మరో కుమారుడు అళగిరి తనతో అన్నాడంటూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అందుకే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అనడం విపరీతార్థాలకు దారితీసింది. అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు.
Continue Reading | comments

కంటతడి పెట్టిన మోత్కుపల్లి

కంటతడి పెట్టిన మోత్కుపల్లి
హైదరాబాద్ : రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అసెంబ్లీ లాబీలో కంటతడి పెట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాజ్యసభ సీటు ఖాయమని అందరు అనుకున్నారని మోత్కుపల్లి అన్నారు.
రాజ్యసభ సీటు విషయంలో తాను అవమానానికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తలదించుకోకూడదనే కష్టపడి పనిచేశానని అన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లిని మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బుజ్జగించారు. కాగా ఈరోజు ఉదయం మోత్కుపల్లిని ...పార్టీ నేతలు  చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించిన విషయం తెలిసిందే.
Continue Reading | comments

2013.. ఓ ప్రేమ కథ

2013 జనవరి, అమెరికాలోని కాలిఫోర్నియా..
 ఆడ్రియానా పెరాల్. ఆమె లైఫ్ స్టైలే వేరు. బికినీలు, హైహీల్స్..
 రోజూ పార్టీలు, వైన్, విస్కీ.. తాగి తూగడం.. పొద్దున్నే జిమ్.. అంతా హైఫై.
 సీన్.. కట్ చేస్తే...

 
 2014 జనవరి, హర్యానాలోని పాప్‌రాన్ గ్రామం..
 ఆడ్రియానా పెరాల్. చుడీదార్, నెత్తిన కొంగు, నుదుటన సింధూరం.. పిడకల పొయ్యి మీద వంట వండుతోంది.. గేదెలను పీచుతో తోముతోంది.. అంట్లు తోముతోంది.. ఇళ్లూడుస్తోంది.. ఇక్కడ పార్టీలు లేవు. టాయిలెట్‌కు పోవాలన్నా బయటకు వెళ్లాల్సిందే.. షవర్ సంగతి సరేసరి.. స్నానానికి గేదెలకు, మనుషులకు ఒకటే బకెట్!
 
 ఏమిటీ మాయ.. అవును. ప్రేమ చేసిన మాయ. ఆడ్రియానా ప్రేమలో పడింది. అన్నీ వదిలొచ్చేసింది.. సంతోషంగా.. చిత్రంలో కనిపిస్తున్న ఆడ్రియానా, ముకేష్‌కుమార్‌ల ప్రేమ కథలోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఆడ్రియానా(40)కు ముకేష్(24) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు చాట్ చేసుకున్నారు. ఒక్కరోజు హఠాత్తుగా ముకేష్ ఆడ్రియానాకు ఫోన్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆడ్రియానా నవ్వేసింది. ఏమిటీ పిచ్చిమాటలు నీ వయసెంత.. నా వయసెంత అంది. నాకు నీ వయసు కూతురుందని చెప్పింది. ముకేష్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా ఇదే తీరు. ఆడ్రియానా ఆలోచనలో పడింది. తర్వాత ఇద్దరూ ఇన్ లవ్. ఆడ్రియానా ముకేష్ కోసం కాలిఫోర్నియాను వదిలి భారత్‌కు వచ్చేద్దామని గతేడాది ఆగస్టులో డిసైడైంది. ఇంట్లో వాళ్లు వారించారు.
 
  కూతురైతే.. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని చెప్పింది. ముకేష్ ఆన్‌లైన్ మోసగాడని వారించింది. ఆడ్రియానా ముకేష్‌ను నమ్మింది. వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో దిగగానే ముకేష్. నేరుగా పాప్‌రాన్ గ్రామానికి.. నవంబర్‌లో సంప్రదాయరీతిలో వివాహం. అమెరికా లైఫ్‌స్టైల్‌కి.. ఇక్కడి జీవనశైలికి ఎంతో తేడా. అయితేనేం.. అలవాటుపడిపోయింది.. హిందీ మాట్లాడటం నేర్చుకుంటోంది. బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడే భర్తకు ఇంగ్లిష్ నేర్పిస్తోంది.  సాగులో సాయమూ చేస్తోంది. ఇక ఆడ్రియానా అత్తగారైతే.. ఆమెపై ప్రశంసలే ప్రశంసలు.
Continue Reading | comments

బుజ్జగింపులు, బెదిరింపులు: రంగంలోకి కెవిపి, ఫోర్జరీ..!

కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ పోరు రసవత్తరంగా మారింది. రెబల్ అభ్యర్థులను బరిలో నుండి తప్పించేందుకు కెవిపి రామచంద్ర రావు రంగంలోకి దిగారు. రెబల్స్‌కు మద్దతిచ్చిన శాసన సభ్యులు, మంత్రులతో కెవిపి, ఆయన వర్గం చర్చలు జరుపుతోంది. మంత్రి గంటా శ్రీనివాస రావును కెవిపి బుధవారం అసెంబ్లీ లాబీల్లో కలిశారు. చైతన్య రాజును బరిలో నుండి తప్పించాలని కోరారు. మంత్రి దానం కూడా ఈ విషయమై అడిగారు. దానికి గంటా స్పందిస్తూ... పార్టీ నాలుగో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవకాశాలున్నా ఎందుకు నిలబెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాంబర్లోను కెవిపి పలువురు నేతలతో భేటీ అయి సంప్రదింపులు జరుపుతు
న్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా బుజ్జగిస్తున్నారు. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళిలు రెబల్స్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెబల్స్ పైన, వారికి మద్దతిచ్చే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైతన్య రాజుకు మద్దతు పలికిన వారు వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. అధిష్టానం కూడా దీనిపై ఆరా తీస్తోంది. కెవిపి ముఖ్యమంత్రిని కూడా కలిశారు. కాగా, రాజ్యసభకు నామినేషన్ వేసిన చైతన్య రాజుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారట. అయితే అందుకు చైతన్య రాజు అంగీకరించలేదని తెలుస్తోంది. ఫోర్జరీ.. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. రెబల్ అభ్యర్థులకు మద్దతిచ్చిన సంతకాలు ఫోర్జరీ అయ్యాయనే అనుమానాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సంతకాలు పెట్టారని భావిస్తున్న వారితో నేరుగా మాట్లాడాలని కోరారు.

Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/kvp-is-wooing-rebels-129445.html
Continue Reading | comments

దగ్గుబాటిని సొంతగూటికి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు


టీడీపీలో ఫ్లెక్సీల ‘మంట’
దగ్గుబాటిని సొంతగూటికి  ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు
 కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావును తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిని చూసి టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఫ్లెక్సీలను చింపివేసి, తగులబెట్టారు. ఈ బ్యానర్లు పర్చూరులో మూడు, మార్టూరులో మూడు, పెనమదలలో ఒకటి ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు తమకు సంబంధం లేదని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏవీ కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని తెలుసుకున్న దగ్గుబాటి, తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
 
  దగ్గుబాటి దొంగచాటు వ్యవహారాలు చేస్తారని, ఆయన సహచరులే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి ఉంటారని మరికొందరు ఆరోపించారు. నారా లోకేష్‌తో కూడా ఇటీవల దగ్గుబాటి మంతనాలు సాగించినట్లు తెలిసిందని, ఆయన పార్టీలోకి వస్తే తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కాగా, పర్చూరు నియోజకవర్గం ‘దేశం’ ఇన్‌చార్జి ఏలూరు సాంబశివరావు ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై దగ్గుబాటిని వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

సాక్షి
Continue Reading | comments

వైసీపీలోకి వెళ్లిన నేతల పరిస్థితి కూడా అంతే!

వైసీపీకి నేతల గుడ్‌బై
జెట్ స్పీడుతో బయటకొసత్తున్న అభ్యర్థులు
ఆత్మగౌరవాన్ని చంపుకోలేమి వ్యాఖ్యలు
బీజేపీపైపు చూస్తున్న రఘరామ కృష్ణరాజు!
ఇమడలేక బయటపడుతున్న పొట్లూరి,తోట ,బొడ్డు
ఉత్సుకత చూపి వెనక్కుపోయిన ఐఏఎస్‌లు

ఆహా ఓహో అనుకున్నారు. పార్టీలో చేరి, టికెట్ కొడితే ఇక తిరుగేలేదనుకున్నారు. ముందుగా పార్టీలో చేరారు. ఆ తర్వాత 'తత్వం' బోధపడి లబోదిబోమంటున్నారు. 'దూరపు కొండలు నునుపు' సామెతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్‌లు, పారిశ్రామిక వేత్తలు... ఇలా ఎందరో! జగన్ పార్టీ నుంచి 'మిడిల్ డ్రాప్!' అవుతున్నారు. ఎందుకు? ఏమిటి?
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెళుతుందో.. అంతే వేగంగా వెనక్కి వస్తుంది! ఇప్పుడు.. వైసీపీలోకి వెళ్లిన నేతల పరిస్థితి కూడా అంతే! మొదట్లో ఆ పార్టీలోకి వలసలే వలసలు! వివిధ పార్టీల నేతలు క్యూ కట్టారు! ఇప్పుడు ఆ పార్టీలోకి కొత్తగా ఎవరూ వెళ్లడం లేదు! సరికదా.. మొదట్లో వెళ్లిన వాళ్లలో చాలామంది ఎప్పుడో బయటకు వచ్చేశారు! మిగిలిన వాళ్లు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని జెడ్ స్పీడుతో వచ్చేస్తున్నారు! అప్పట్లో.. వైఎస్ మీద అభిమానంతోనో.. భవిష్యత్తు అంతా 'బంగారం'లా ఉంటుందనో ఉత్సాహంగా వెళ్లారు! కోట్లు సమర్పించుకున్నారు! మరికొన్ని కోట్లు ఖర్చు చేశారు! కానీ, పార్టీ అధినేత జగన్‌ను దగ్గర నుంచి చూసిన తర్వాత.. ఆయన 'తత్వం' బోధపడిన తర్వాత వ్యక్తిగత గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడడం లేదు! డబ్బులు పోయినా పర్లేదు. ఆత్మ గౌరవాన్ని నిలుపుకొంటే చాలంటూ జగన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఆత్మీయులు, సన్నిహితుల వరకూ.. అత్యధికులు జగన్‌కు దూరంగా జరుగుతున్నవారే! ఇందుకు జగన్ అహంభావం ఒక కారణమైతే.. రోజు రోజుకు ఆయన గ్రాఫ్ పడిపోతుండడం మరో కారణం! తొలుత సీటు హామీ ఇచ్చి.. ఆ తర్వాత నాలుక మడతేయడం మరో కారణం! 'అహం బ్రహ్మస్మి' అంటూ వ్యవహరిస్తున్న జగన్ పార్టీ నేతలని కూడా చూడకుండా చులకనగా చూస్తున్నారని వారంతా వాపోతున్నారు.
నిజానికి, వారంతా కూడా నేతలే. కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలే! అందుకే.. ఆత్మ గౌరవాన్ని చంపుకొనే కంటే వైసీపీని వీడడమే మంచిదని మిడిల్ డ్రాప్ అవుతున్నారు. కుటుంబ సభ్యులూ ఇందుకు మినహాయింపు కాదు. వైసీపీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని కంటికి రెప్పలా కాపాడిన జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు తన దారి తాను చూసుకున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వివరిస్తున్నాయి. ఇక, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో మనో ధైర్యాన్ని నింపిన ఆయన సోదరి షర్మిల కూడా అన్నపై అలిగి బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. మీడియాలో కథనాలు రావడంతో తమ మధ్య ఎలాంటి వైషమ్యాలూ లేవంటూ ముక్తసరిగా చెప్పేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత కూడా ఆమె దూరంగానే ఉంటున్నారు. ఇక, మరో కీలక వ్యక్తి రఘురామ కృష్ణరాజు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆయన కుటుంబానికి ఆత్మీయుడిగా వ్యవహరించారు. జగన్‌పై సీబీఐ దర్యాప్తు జరిగిన సమయంలో ఏకంగా జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టును తీసుకుని వివాదాస్పదుడయ్యారు. వైఎస్ ఆత్మబంధువు కేవీపీకి ఆయన వియ్యంకుడు కూడా. ఆయన నరసాపురం లోక్‌సభ సీటు ఆశించారు. ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారని ఆ పార్టీలోని వారే చెబుతున్నారు. ఆయనను నిలువరించేందుకు జగన్ దగ్గరి బంధువు వైఎస్ అనిల్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయని, బీజేపీలో చేరి నరసాపురం సీటు కోరాలని ఆయన భావిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మరో పారిశ్రామికవేత్త పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్. ఆయన విజయవాడ లోక్‌సభ సీటు ఆశించారు. అచిర కాలంలోనే తత్వం బోధపడి.. జగన్ వద్ద తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారు. జగన్ మరో బాధితుడు తోట చంద్రశేఖర్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ ఖర్చులన్నీ భరించారు.
గుంటూరు లోక్‌సభ నుంచి బరిలోకి దిగారు. ఓడిపోయి ఐదేళ్లపాటు కనుమరుగయ్యారు. చివరికి, నాలుగు నెలల కిందటే ఆయన వైసీపీలో చేరారు. ఏలూరు లోక్‌సభ సీటు తనకేనని భావించారు. దీంతో, నియోజకవర్గంలో పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల్లో గెలుపునకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన కూడా.. వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చేస్తున్నారని తెలిసింది. తన కుమారుడి కోసం రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని ఆశించిన బొడ్డు భాస్కర రామారావు కూడా ఇప్పుడు 'బై జగన్' అంటున్నారని తెలిసింది. ఇప్పటికే నష్టపోయింది చాలని.. మరింత నష్టపోకూడదనే ఆయన మిడిల్ డ్రాప్ అవుతున్నట్లు తెలిసింది. అలాగే, గుజరాత్‌లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న కిశోర్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని భావించారు. బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తే వస్తానని డిమాండ్ చేసిన ఆయన.. తాజాగా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. మరోవైపు బాపట్ల లోక్‌సభ సీటును చెన్నైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గూడూరు సునీల్ ఆశిస్తున్నారు. దీంతో, టికెట్ విషయంలో ఆయన పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డికి వివాదరహితుడిగా పేరు. జగన్ జైలు నుంచి రాగానే పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు వైసీపీ కండువా కప్పుతారని భావించారు. పార్టీలోకి జగన్ ఆహ్వానించారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత జగన్ వ్యవహార శైలిని తెలుసుకున్న ఆయన.. వైసీపీలోకి వెళ్లేందుకు సాహసించలేదు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలిసేందుకు జగన్ ఇటీవల బీహార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. బీహార్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని చెందిన కేపీ రామయ్య జగన్‌కు కాస్త దగ్గరయ్యారు. వైసీపీలో చేరదామని భావించారు. సన్నిహితుల ద్వారా జగన్, వైసీపీ వ్యవహార శైలిని తెలుసుకుని.. బాబోయ్ అనవసరమైన తంటాలు ఎందుకని విరమించుకున్నారు. నితీశ్ పార్టీలోనే చేరి అక్కడి నుంచే లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నారు.

- See more at: http://www.andhrajyothy.com/node/59524#sthash.uCev8gzG.dpuf
Continue Reading | comments

బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు

బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు
 అవాక్కయ్యారా!
 
 అది బీహార్‌లోని ఓ గ్రామం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా వివరాల సేకరణకు సీసీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇంకేముంది.. కేసు కొలిక్కి వచ్చేసినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఖాతాదారుడిని విచారిద్దామనుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అతనో బిచ్చగాడు. ఈ వ్యవహారాన్ని లోతుగా ఆరా తీస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథాకమామీషు ఏమిటంటే...    
 

 ‘‘+92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లాటరీ తగిలిందని చెప్పడంతో నమ్మి నగదు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి మోసపోయా’’... పోలీసులకు ఇటీవల వరుసగా వస్తున్న ఫిర్యాదులివి. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి సీసీఎస్ అధికారుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ల ద్వారా లాటరీ తగిలిందంటూ, తక్కువ ధరకే వస్తువులంటూ సౌతాఫ్రికా దేశాలు కేంద్రంగా ప్రజలను మోసగిస్తున్న నైజీరియన్లు.. ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్నారు. ఈ ఏజెంట్లు చేయాల్సిందల్లా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరవడమే.
 
 ‘గుర్తింపు’న్న భిక్షగాళ్లతోనే..
 ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఈ ఏజెంట్లు అక్కడి గ్రామాల్లో సంచరిస్తూ ఆధార్ వంటి ధ్రువీకరణలు కలిగిన భిక్షగాళ్లు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఒక రోజు కోసం ఆ గుర్తింపు పత్రాలతోపాటు వారి ఫొటోలు ఇస్తే రూ.2500 చెల్లిస్తామంటూ ఎర వేస్తున్నారు. ఇలా తీసుకున్న పత్రాలతో స్థానిక బ్యాంకుల్లో వారి పేర్లతోనే ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం గుర్తింపు పత్రాల్ని బిక్షగాళ్లు/పేదలకే ఇచ్చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డును మాత్రం సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. ఈ ఖాతాల ఆధారంతో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అనేకమందికి లాటరీలు, బహుమతుల పేరుతో ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎర వేస్తున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో తీసుకున్న ఇంటర్నేషనల్ రోమింగ్ కలిగిన సిమ్‌కార్డులు (+92 సిరీస్‌తో ఉంటాయి) ఉపయోగిస్తున్నారు.  
 
 ఎవరికీ చిక్కకుండా..
 నమ్మినవారికి భిక్షగాళ్ల బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇచ్చి అందులో నగదు వేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మోసపోయిన వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించినా... దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్ నుంచి సెల్ నెంబర్ల వివరాలు తెలుసుకోలేరు. ఖాతా ఆధారంగా దర్యాప్తు చేసినా... అది భిక్షగాళ్లు/పేదల వరకు వెళ్లి ఆగిపోతుంది. ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు సైబర్ నేరగాళ్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
 
 ‘+92’తో బహుపరాక్
 ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నగర ప్రజలకు సూచించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితుల్ని పట్టుకోవడం, రికవరీలు చేయడం అంతకష్టమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ‘+92’ సిరీస్‌తో వచ్చే ఫోన్లు/ఎస్సెమ్మెస్‌ల విషయంలో ప్రమత్తంగా ఉండాలని కోరారు.

 సాక్షి, సిటీబ్యూరో :
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger