Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

సినిమా రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌

Friday, January 31, 2014

రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
తారాగణం: నితిన్‌, అదా శర్మ, అజాజ్‌ ఖాన్‌, నికోల్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌
కథ, మాటలు, కథనం, నిర్మాత దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: జనవరి 31, 2014
- See more at: http://telugu.greatandhra.com/movies/reviews/review-heart-attack-50063.html#sthash.3DI4ZsWi.dpuf
Continue Reading | comments

అందరిని పరుగు పెట్టిస్తాం

డిల్లీలో పార్లమెంటు సబ్యులను పరుగు పెట్టించడానికి విశాఖపట్నం లో సమైక్యపరుగు నిర్వహించామని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు డిల్లీలో జరిగే ఛలో డిల్లీ ఆందోళనకు అందరూ కలిసిరావాలని ఆయనపిలుపు ఇచ్చారు. పిబ్రవరి ఇరవై ఒక్కటిన పార్లమెంటు సమావేశాల చివరి రోజు అని ,ఈలోగా సమైక్య రాష్ట్రం కోసం మనం అప్రమత్తంగా ఉండి, ఆ రోజు విజయోత్సవం జరుపుకోవచ్చని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Continue Reading | comments

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
కొప్పవరం (అనపర్తి), న్యూస్‌లైన్ :భర్త, ఇద్దరు పిల్లల ఎదుటే ప్రయాణికురాలిని వికృత చేష్టలతో వేధించి, లైంగికదాడికి యత్నించిన ఆటోడ్రైవర్లను గ్రామస్తులు చెప్పులతో కొట్టి గుణపాఠం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు గత 26న క్రైస్తవ సభలకు గుంటూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం విజయవాడలో కాకినాడ పాస్ట్ పాసింజర్ ఎక్కి రాత్రి  10.30కి అనపర్తి వచ్చారు. 
 
 అక్కడినుంచి కొప్పవరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద దుప్పలపూడికి చెందిన ఆటోడ్రైవర్ కర్రి గంగిరెడ్డితో బేరం కుదుర్చుకున్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాకి చెందిన మరో డ్రైవర్ చిట్టూరి శివాజీని వెంటబెట్టుకుని గంగిరెడ్డి తన ఆటోలో వీరిని తీసుకుని బయలుదేరాడు. ఆటోను వారు నేరుగా కాకుండా అనపర్తి శివారు కొత్తూరు శ్మశాన వాటిక మీదుగా తీసుకువెళ్లారు. ఆటోను శివాజీ నడుపుతూ ఉండగా, గంగిరెడ్డి పక్కనే కూర్చుని వెనుకనున్న మహిళతో వికృతచేష్టలు ప్రారంభించాడు. ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. శ్మశానవాటిక వద్ద ఆటో ఆపిన డ్రైవర్లు ఆమె చేయి పట్టుకుని లాగబోయారు.
 
 దీంతో భార్యాభర్తలు భయంతో బిక్కుమంటూ ఆటోలోనే కూర్చునిపోయారు. పరిస్థితి దిగజారుతున్నా అర్ధరాత్రి కావడం, పక్కనే బిడ్డలు ఉండడంతో భర్త వారిని ఎదిరించలేదు. డ్రైవర్లకు అనుమానం రాకుండా సెల్ ఫోన్‌లో బంధు మిత్రులకు కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈలోగా శ్మశానవాటికకు దాపునే ఉన్న కెనాల్ రోడ్లో వాహన సంచారం కనిపించడంతో అక్కడ అనుకూలంగా లేదనుకున్న డ్రైవర్లు ఆటోను ముం దుకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గంగిరెడ్డి, శివాజీ బాధితురాలి భర్తను దారి గురించి అడిగారు. లక్ష్మీనర్సాపురంలో తాను పనిచేసే రైసుమిల్లు ఉండడంతో అటువైపు ఆటోను తరలించాలని భావించిన భర్త అటు జనసంచారం ఉండదని వారితో చెప్పాడు. దీంతో డ్రైవర్లు ఆటోను అటే మళ్లించారు. 
 
 రైసుమిల్లు దాటిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్లు కిందికి దిగి తమ ప్లాన్ అమలుపై మాట్లాడుకుంటుండగా, భర్త ఫోన్ ద్వారా తన స్నేహితునికి పరిస్థితి తెలిపాడు. ఈలోగా మరో ఇద్దరు అతడికి ఫోన్ చేశారు. వారికి చోటు చెప్పి వెంటనే రమ్మన్నాడు. దీంతో వారందరూ హుటాహుటిన బయలుదేరి ఆటో ఉన్న ప్రాంతానికి వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ వారు కొప్పవరం లాక్కెళ్లి బాధితుల ఇంటికి చేరువలో స్తంభాలకు కట్టేశారు. వారి బట్టలు ఊడదీయించి గోచీలు పెట్టించారు. అర్ధరాత్రి ఈ సంగతి గ్రా మంలో దావానంలా వ్యాపించడంతో అంద రూ అక్కడకు చేరుకున్నారు. సాటి మహిళకు జరిగిన అవమానంపై కోపోద్రిక్తులైన మహిళలు గంగిరెడ్డి, శివాజీలను చెప్పులతో చావగొట్టారు. సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు గురువారం ఉదయం వారిద్దరినీ పోలీసు స్టే షన్‌కు
 తరలించారు.

Sakshi
Continue Reading | comments

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు
సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు.
 
 
ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు.
 
 కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు.
Continue Reading | comments

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
బెంగళూరు : దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు.  అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్ కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్ మెంట్ లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు.

తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు.

ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.
Continue Reading | comments

సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక

‘కోడ్స్’తో కొడతారు!
  • మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్ డ్రైవర్ల ప్లానింగ్   
  •  సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక
  •  గుర్తించకుంటే దుండగుల బారిన పడ్డట్టే!  
  •  అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి
  •   ఒంటరిగా, తొలిసారి వెళ్లేవాళ్లు జాగ్రత్త: పోలీసుల సూచన
  సాక్షి, సిటీబ్యూరో: కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఒక విధమైన బెరుకు. అక్కడి భాష, యాస ఇతరత్రా అన్నీ కొత్తగానే ఉంటాయి. ఒకవేళ మీరు మహారాష్ట్రలోని పట్టణాలకు తొలిసారి వెళ్తున్నా, అక్కడి క్యాబ్/ఆటోల్లో ఎక్కాలన్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ‘అక్కడి బస్సు, రైల్వే స్టేషన్లలో దిగగానే మీ చుట్టూ మూగిన డ్రైవర్ల నోటి వెంట ‘బెటర్’, ‘మాంగ్లో’, ‘జీపీఎల్’ వంటి కొత్త పదాలు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వాహనాల్లోకి ఒంటరిగా ఎక్కకండి. సదరు డ్రైవర్లు నిలువు దోపిడీకో, మోసగించడానికో పథకం పన్నారని గుర్తుంచుకోండి. మహిళలు, యువతులు మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఒంటరిగా మహారాష్ట్రలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలీ ‘కోడ్స్’ ఏమిటి? అవి ఎందుకు?.. చదవండి మీకే తెలుస్తుంది.

అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి..

 ముంబైలోని టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మచిలీపట్నం వాసి అనూహ్య అక్కడి కుందూర్ మార్గ్-భాందూప్ మధ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 5న, ఉదయం 4.55 గంటలకు కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్‌టీటీ) స్టేషన్‌లో రైలు దిగిన ఆమె ఆ తరవాత అదృశ్యమైంది. కొన్ని రోజుల తరవాత ఆమె మృతదేహం బయటపడింది.
 
ఈ ఘాతుకం ఎల్‌టీటీ పరిసరాల్లో ఉండే ఆటో/క్యాబ్ డ్రైవర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై క్రైమ్‌బ్రాంచ్ అధికారుల దర్యాప్తులో ‘కోడింగ్’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంకేత పదాల ద్వారా ప్రయాణికులకు అర్థం కాకుండా ఒకరితో మరొకరు సంప్రదించుకుంటున్న డ్రైవర్లు టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుని పంజా విసురుతున్నారని గుర్తించామని అధికారులు చెబుతున్నారు.
 
 ఇలా చేయడం ఉత్తమం
 ఈ తరహా పదాలు, ముఠాలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సందర్భంలో వారికి ఎదురు తిరిగినా, ప్రతిఘటించినా దాడులకు వెనుకాడరు. ఒంటరిగా, తొలిసారి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
 
 కొత్తగా, ఒంటరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు వాహనాలను అద్దెకు తీసుకోరాదు. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి
 
 వీలున్నంత వరకు ప్రీపెయిడ్ సర్వీస్‌ను వినియోగించుకోవాలి. ఎక్కే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలను బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేసి చెప్పాలి. ఇది డ్రైవర్‌కు తెలిసేలా చేయాలి
 
 ప్రీపెయిడ్ సేవలు అందుబాటులో లేకుంటే తోటి ప్రయాణికుల్ని సంప్రదించి, వారితో కలిసే వాహనంలో ప్రయాణించాలి. అలాకాని పక్షంలో వాహనాన్ని మాట్లాడుకునేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలి
 
 అక్కడకు వెళ్లగానే రిసీవ్ చేసుకునేందుకు అక్కడ నివసిస్తున్న బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల్ని రమ్మని కోరాలి. మహిళలు/యువతులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
 
 బెటర్
 ప్లాట్‌ఫామ్ వద్ద రైలు ఆగగానే అప్పటికే అక్కడకు చేరుకునే ‘డ్రైవర్ ముఠా’ సభ్యుడు ఒంటరిగా రైలు దిగుతున్న, ముఖ్యంగా మహిళలు, యువతుల్ని గుర్తిస్తాడు. వారు బయటకొచ్చి ఆటో/క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, వారు ఒంటరిగా వచ్చారని తెలిపేందుకు ముఠా సభ్యుడు మిగిలిన వారికి ‘బెటర్’ అంటూ సమాచారమిచ్చి టార్గెట్ చేయాలని సూచిస్తాడు.
 
 మాంగ్‌లో
 ప్రయాణికుల ఆహార్యం, ప్రవర్తనను బట్టి వారికి మహారాష్ట్రతో పరిచయం ఉందా? లేదా? అనేది ఇట్టే గుర్తుపట్టేస్తారు. తొలిసారి వచ్చిన వారైతే మోసం చేయడం తేలిక కావడంతో ఆ విషయాన్ని ఇతర ముఠా సభ్యులకు తెలిపేందుకు వారికి వినిపించేలా ‘మాంగ్‌లో’ పదాన్ని ప్రయోగిస్తాడు.
 
 జీపీఎల్
 మార్గమధ్యంలో మోసం చేయడానికి అనువుగా తయారు చేసుకున్న పదం ‘జీపీఎల్’. ప్రయాణికుడు ప్రీపెయిడ్ వాహనం తీసుకున్నా, ముందే కిరాయి చెల్లించినా అతడిని ఎక్కించుకునే ముఠా సభ్యుడు మరొకరితో ‘జీపీఎల్’ అంటాడు. అంటే తన వాహనాన్ని అనుసరించాలని అర్థం. మధ్యలో బ్రేక్‌డౌన్ పేరుతో ప్రయాణికుడిని దించేసిన తరువాత ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తూ ఎక్కించుకోమని అర్థం.
 
Continue Reading | comments

12 యేళ్లకు అవకాశమొస్తే దాన్నీ తన్నుకుపోయాడు!

Thursday, January 30, 2014

తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మధ్య పుష్కర వేడుకలను పూర్తి చేసుకొంది. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే టైమ్ కాస్తంత కలిసి వస్తోంది. కాంగ్రెస్ రాజకీయాల పుణ్యామా అని తెలంగాణ రాష్ట్ర సమితి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ సమయంలో టీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని ఫాంటసీలు కూడా వాస్తవంలో నిజం అవుతున్నాయి. 
అలాంటి ఫాంటసీల్లో ముఖ్యమైనది రాజ్యసభ సభ్యత్వం. ఇప్పుడు తొలిసారి రాజ్యసభలో టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వ్యక్తి తన్నుకుపోతున్నాడని గులాబీ కండువాలు ఫీలవుతున్నాయి. తెరాస తరపున కే కేశవరావు రాజ్యసభకు నామినేషన్ వేశాడు. ఈయన కు తెరాస సభ్యత్వం ఉంది కదా, ఈయన కాంగ్రెస్ వాడు ఎలా అవుతాడు? అని అంటే.. ఆయన నిన్నలా మొన్న టీఆర్ఎస్ లో చేరాడని, దశాబ్ధకాలంగా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ ను  అనేక మాటలు అని ఇప్పుడు టీఆర్ఎస్ చేరిన ఆరు నెలల్లోనే రాజ్యసభకు వెళ్తున్నాడనేది గులాబీ దళ నాయకుల భావన. 
అది కూడా ఇది ఊరికే లభిస్తున్న అవకాశం కాదు. 12 సంవత్సరాల కు దక్కుతున్న అవకాశం. ఇలాంటి అవకాశాన్ని పార్టీ సిద్ధాంత కర్తల్లో ఎవరో ఒకరికి ఇస్తే బావుంటుండేది కానీ, ఇలా నిన్నలా మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చేస్తే ఎలా? అని టీఆర్ఎస్ నాయకులు గొణుక్కొంటున్నారు. అయితే ఇది అధినేత స్థాయిలో జరిగిపోయిన నిర్ణయం కాబట్టి ఇక చేయగలిగిందేమీ లేదన్న నిరాసక్తత కూడా కనిపిస్తోంది వారిలో. అయితే వాస్తవానికి ఇప్పుడు కూడా టీఆర్ఎస్   రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకొనేది  సొంత శక్తితో కాదు కదా... కాంగ్రెస్ సభ్యుల సహకారం అందిస్తేనే కేకే గెలవగలడు. ఈ లెక్కన సగం కాంగ్రెస్ బలం, సగం టీఆర్ ఎస్ బలం.. అభ్యర్థి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి న్యాయం జరుగుతున్నట్టే! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/12-samvatsaralaku-avakasam-vasthe-danni-50048.html#sthash.wL3f2IXs.dpuf
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. కాగా బిజెపి నేత వెంకయ్య నాయుడు ను రఘురామరాజు తన ఇంటికి ఆహ్వానించి, బిజెపిలో చేరే విషయమై చర్చించారని కదనాలు రావడంతో పార్టీ ఈ చర్య తీసుకుంది
Continue Reading | comments

కెవిపి కూడా విలపించారా

శాసనసభ ఆవరణలో ఇద్దరు పెద్ద నేతలు విలపించారంటూ వచ్చిన కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ,సిట్టింగ్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ఉన్నారన్న కధనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.టిడిపి లో రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు శాసనసభ ప్రాంగణంలో కంటతడిపెట్టి రోదించారని ఇప్పటికే కధనం రాగా,తాజాగా కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావు కూడా విలపించారని వార్త రావడం విస్మయం కలిగిస్తుంది.మంత్రి గంటా చాంబర్ లో తిరుగుబాటు అభ్యర్ధులు చైతన్య రాజు, గంటా శ్రీనివాసరావులను తప్పించడం కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని మంత్రి గంటాను ప్రశ్నిస్తూ కేవీపీ బిగ్గరగా రోదించారని మీడియాలో కధనం వచ్చింది.దీంతో అక్కడ ఉన్న నేతలంతా విస్తుపోయారు.తాను విభజనవాదినా అని ఆయన ప్రశ్నించారట. ఎన్నో డక్కామక్కీలు తిన్న కెవిపి కూడా నిజంగా అలా చేసి ఉంటారా..

తాను రోదించానంటూ ఒక పత్రికలో వచ్చిన కధనాలపై సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. తనకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ శాసనసబలో ముప్పైఏడు మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోలేకపోతే ఇక రాజకీయాలలో ఉండి లాభం ఏమిటి అని ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే.అనేకమదికి టిక్కెట్లు ఇప్పించడంలో, ప్రభుత్వం నడపడంలో కీలక పాత్ర పోషించిన కెవిపి రాజ్యసభ ఎన్నికలలో కొందరు తిరుగుబాటుదార్లు పోటీచేస్తున్న సందర్భంలో చర్చలలో కెవిపి రోదించారని కదనం వచ్చింది. అది నిజమా అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానిపై కెవిపి వివరణ ఇవ్వడం సరిగానే ఉంది.
Kommineni
Continue Reading | comments

రఘురాజు విభజన వాద బిజెపిలో ఎలా చేరతారో

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని బావిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంటికి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు వెళ్లడం చర్చనీయాంశం అయింది. రాజు బిజెపిలో చేరి నరసాపురంలో పోటీచేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. కొందరు శాసనసభ అభ్యర్దుల విషయంలో వచ్చిన విబేదాలతో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దూరం అవుతున్నారని అంటున్నారు.అయితే వీర సమైక్యవాదనని, సుప్రింకోర్టులో కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాడతానని చెబుతున్న రాజు విభజనవాద పార్టీ అయిన బిజెపిలో ఎలా చేరతారబ్బా!ఇదే రాజకీయ విచిత్రం అంటే
Continue Reading | comments

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
న్యూఢిల్లీ : గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది.
Sakshi
Continue Reading | comments

గాంధీ 'హేరాం' అనలేదు

గాంధీ 'హేరాం' అనలేదు
 తలవని తలంపుగా 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగిన గాంధీ హత్యకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఆయన ‘సాక్షితో పంచుకున్నారు. నేటికీ కల్యాణం తానుండే వీధులను ఆయన తెల్లవారుజామున లేచి శుభ్రం చేసుకుంటూ గాంధేయవాదాన్ని చాటుతున్నారు. 90 ఏళ్ల కల్యాణం కేజ్రీవాల్ గాంధీపైన రెండు ప్రత్యేకమైన వెబ్‌సైట్లను రూపొందించి నెటిజన్లకూ గాంధేయవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే...
 
1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది.  కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.

కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారుు. అక్కడే కుప్ప కూలిన గాంధీమహాత్ముని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లించే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ ఆయనను బిర్లా హౌస్‌లోకే తరలించారు.  
 
పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీ హత్యకు 48 గంటల ముందు ఆయన అభిమాని ఒకరు జాగ్రత్తగా ఉండాలని బాపూజీని కోరారు.
అప్పుడు ఆయన నవ్వుతూ ‘‘ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. ఆ ఉన్మాదిపై నాకు ఎటువంటి కోపమూ రాదు. పరమాత్మ నా హృదయంలోనూ, పెదాలపైనా నర్తిస్తున్నప్పుడు నేను చావుకు ఎందుకు భయపడాలి’’ అని అన్నారు.
 
గాంధీ హత్య గురించిన ఎన్నో విషయాలను వెల్లడించిన వి.కల్యాణం ప్రస్తుతం చెన్నై తేనాంపేటలో నివశిస్తున్నారు. 90 ఏళ్ల ముదిమి వయసులోనే ఆయన గాంధేయవాదాన్ని, గాంధీ సిద్ధాంతాలను తుచ తప్పక ఆచరిస్తు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి వెంకిట కల్యాణం అలియాస్ వి.కల్యాణం ఆగస్టు 15, 1922న జన్మించారు.  తమిళుడే అయినా పుట్టింది, పెరిగింది ఉత్తరభారతంలోనే.
24 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, 26వ ఏట గాంధీ సబర్మతీ ఆశ్రమంలో చేరారు కల్యాణం. గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసే మహదేవ్ దేశాయ్ మృతి చెందడంతో అనుకోకుండా గాంధీ 1944లో కల్యాణంను వ్యక్తిగత సెక్రటరీగా నియమించుకున్నారు. అయిదు భాషలు రాయడం, చదవడం వచ్చిన కల్యాణం అనతి కాలంలోనే గాంధీకి అత్యంత ఆప్తులయ్యారు.

sakshi
Continue Reading | comments

తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఓడిపోలేదు

తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఓడిపోలేదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగలేదని...బిల్లు ఓడిపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని... దాన్ని అందరూ గమనించాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. విభజన బిల్లుపై ఫైటింగ్ జరగలేదని... సభ అభిప్రాయం కోసమే బిల్లు పంపామన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని అన్నారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ అన్నారు. కేంద్ర కేబినెట్ లో చర్చ అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 ప్రకారమే ముందుకు వెళతామన్నారు. అసెంబ్లీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందన్నారు.
ఇరు ప్రాంతాల కాంగ్రెస్ సభ్యుల్లో పరస్పర అభిప్రాయాలు ఉన్నందున... సభలో వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలువరించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వచ్చిన సవరణల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటిని బిల్లులో చేర్చే విషయాన్ని కేబినెట్ చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తామన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ ఆశాభావం వక్యతం చేశారు

sakshi
Continue Reading | comments

విభజన బిల్లు తిరస్కారానికి ఆమోదం-స్పీకర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లు ను తిరస్కరించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటు గా ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనసభ ను నిరవధిక వాయిదా వేయడానికి ముందుగా ఆయన సభలో ఎందరు మాట్లాడారు? తదితర విషయాలు వివరిస్తూ ,చివరన ఆయన కిరణ్ నోటీసు ప్రబుత్వ తీర్మానం కనుక ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు.ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మనోహర్ చాలా ఉద్వేగంగా కనిపించారు.చాలా వేగంగా తన ప్రకటనను చదివి వినిపించి సభను ముగించారు. సవరణలన్నీ, అఫిడవిట్లు అన్నీ కూడా చర్చలో భాగమని ఆయన ప్రకటించారు.
Continue Reading | comments

800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటరు (1000 ఎం.ఎల్.) పోసినట్లు

గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు
‘చోరీ’ సాఫ్ట్‌వేర్‌తో రూ. 30 కోట్లకు చిల్లు
  మూడేళ్లుగా వాహనదారుల నిలువు దోపిడీ
  ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్‌వోటీ 
  ఐదుగురి అరెస్టు... ముగ్గురు పరారీ
 అసలే ధర పెంచేస్తూ చమురు సంస్థలు వేస్తున్న వరుస వాతలతో వాహనదారులు ఒకపక్క విలవిలలాడుతుంటే... వారినింకా నిలువు దోపిడీ చేసేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ కొందరు పెట్రోల్ బంకు నిర్వాహకులు వదలట్లేదు... ఇదే అదనుగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ముందుకొచ్చింది ఓ ముఠా... 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటరు (1000 ఎం.ఎల్.) పోసినట్లు తెర (డిస్‌ప్లే)పై చూపించడం దీని ప్రత్యేకత... ఇంకేం మూడేళ్ల క్రితమే ఈ తరహా దోపిడీకి తెర లేచింది. వాహనదారుల జేబుకు చిల్లు పెట్టడం మొదలెట్టారు. ఇలా మన రాష్ట్రంలోనే దాదాపు రూ. 30 కోట్ల వరకు చల్లగా నొక్కేశారని అంచనా. ఈ నయా మోసానికి తెరలేపిన ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ మోసానికి పాల్పడ్డ పెట్రోల్ బంకు యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 
 రాష్ట్రంలో మూడేళ్లుగా దగా: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అఫ్జల్ బారీ (35), ఫైజల్ బారీ (38) సోదరుల కుటుంబం దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడింది. వారిద్దరూ ఐటీఐలో ఫిట్టర్ ఒకరు, ఎలక్ట్రానిక్స్ కోర్సును మరొకరు చదివారు. పెట్రోల్ బంక్‌లో మెకానిక్ అయిన తండ్రి మసూద్ వద్ద పంప్ మెకానిక్ నైపుణ్యాన్నీ సంపాదించారు.  ఆ సోదరులిద్దరూ హైదరాబాద్, విజయవాడల్లో పలు పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. విజయవాడలో పనిచేస్తున్నప్పుడే పెట్రోల్ పంప్ మెషిన్లను తయారు చేసే తోకీమ్ కంపెనీలో టెక్నిషియన్ కల్యాణ్ వారికి పరిచయమయ్యాడు. 
 
 - అఫ్జల్, ఫైజల్, కల్యాణ్ ముగ్గురూ కలసి రూ. 6 లక్షల చొప్పున ముట్టజెప్పి ఆరు కంపెనీలకు చెందిన మెషిన్ సాఫ్ట్‌వేర్‌లను దక్కించుకున్నారు. వాటి ఆధారంగా ప్రత్యేక చిప్‌లను తయారు చేశారు. 
 
 - ఆ చిప్‌లతో పెట్రోల్ వినియోగదారుల జేబులకు ఎలా చిల్లు పెట్టి భారీగా ఎలా డబ్బు సంపాదించవచ్చో వివరించి బంకు యజమానులను ఈ కుంభకోణంలోకి లాగారు. చిప్‌కు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకొనేవారు. 
 
 - ఆ చిప్‌తో పాటు, దాని రిమోట్‌నూ బంకు నిర్వాహకులకు ఇచ్చేవారు. ఈ ‘రిమోట్’తోనే వాహనదారులకు కుచ్చుటోపి వేస్తున్నారు. 
 
 - బంకులోని పెట్రోల్ మెషిన్‌లో దాని అసలు చిప్‌తో పాటు ఈ నకిలీ చిప్ కూడా ఉంటుంది. ఒకవేళ అధికారులు తనిఖీకొస్తే రిమోట్‌తో నకిలీ చిప్‌ను ఆఫ్ చేస్తారు. దీంతో ‘మోసం’ గుట్టు కనిపెట్టడం దాదాపు అసాధ్యం. 
 
 - గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడుగా కాకుండా కొనసాగుతోంది. మన రాష్ర్టంలో 75 పెట్రోల్ బంకుల్లో ఈ చిప్‌లు అమర్చారు. మరో 600 పెట్రోల్ బంకుల్లో అమర్చేందుకు నిందితులు రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
 - ఈ వ్యవహారంలో రాజమండ్రి నెహ్రూనగర్‌కు చెందిన షేక్ ముస్తాఫా, విజయవాడకు చె ందిన పెట్రోల్ బంక్ మెకానిక్ షేక్ సకికేందర్, బోయిన్‌పల్లికి చెందిన సందీప్ కూడా పాలు పంచుకున్నారు.
 
 గుట్టు రట్టు ఇలా....
 విశ్వసనీయ సమాచారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ ఓఎస్‌డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, పుష్పన్‌కుమార్, అంజయ్య, బస్వారెడ్డి, ఎస్సైలు రమేష్, శివకుమార్, మహేశ్, నాగరాజు కూకట్‌పల్లిలోని అఫ్జల్ బారీ ఇంటిపై దాడి చేశారు. నిందితులు అఫ్జల్ బారీ, షేక్ ముస్తాఫా, షేక్ సకికేందర్, కల్యాణ్, శిబులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసం కేసులో మరో ముగ్గురు నిందితులు ఫైజల్ బారీ, సందీప్, వివేక్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, 600 చిప్‌లు, 100 రిమోట్‌లు, 100 రిసీవర్లు, నాలుగు ఎడాప్టర్లు, ఒక లగ్జరీకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రకాంత్‌కు అప్పగించారు.
 
 బంకుల్లో చౌర్యం వెలుగులోకి...
 ఎస్‌వోటీ పోలీసులు శివార్లలోని 11 పెట్రోల్ బంకుల్లో బుధవారం రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో పది బంకుల్లో పెట్రోల్‌ను చౌర్యం చేస్తున్న సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్, నాగోల్, ఉప్పల్, తుక్కుకూడ, కూకట్‌పల్లి, మియాపూర్, ఆర్సీపురం, శంషాబాద్ లోని పెట్రోల్ బంకుల నుంచి చిప్ కార్డులతో పాటు రిమోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులను అప్పగించారు. ఆయా బంకులను సీజ్ చేసే అవకాశం ఉందని ఎస్‌వోటీ వర్గాలు తెలిపాయి. ఈ చోరీ సాఫ్ట్‌వేర్, చిప్‌లతో ఇతర రాష్ట్రాల్లోనూ పెట్రోల్ చౌర్యం జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
 
 రిమోట్ ఆపరేషన్...
 ముంబైలోని హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలో సర్వీస్ మెకానిక్, కేరళకు చెందిన శిబు కె.థామస్ ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించాడు. దాంతో తయారు చేసిన చిప్ 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటర్‌గానే చూపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్ విషయాల్లో పరిజ్ఞానం ఉన్న ముంబై వాసి వివేక్ ఇతనికి సహకరించాడు.
 
 సాధారణంగా ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు రూపొందించిన ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్లతోనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారుల వాహనాల్లో పోస్తుంటారు. ఆ మెషిన్లలో ఆయా కంపెనీల సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన చిప్‌లనే అమరుస్తారు.  వాటితో పాటు ఈ నకిలీ చిప్‌లనూ పెడతారు. అధికారులు తనిఖీలకు వచ్చినపుడు రిమోట్ కంట్రోల్ సాయంతో చిప్‌ను ఆఫ్ చేస్తారు
 
సాక్షి
Continue Reading | comments

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Continue Reading | comments

తెలంగాణకు 5 లక్షల కోట్లు ....


తెలంగాణకు 5 లక్షల కోట్లు ఇవ్వాలి: హరీష్‌రావు
 విభజన తరువాత తెలంగాణ పునర్మిర్మాణానికి కేంద్రం రూ. 5 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు.  బిల్లుపై తన అభిప్రాయం చెబుతూ 65 పేజీల లేఖను స్పీకర్‌కు అందజేశారు. తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపి, బిల్లును వెంటనే పార్లమెం ట్‌కు పంపాలని కోరారు. తెలంగాణ అమరవీరులు మరణ వాంగ్మూలాల్లో రాసిన అభిప్రాయాలను లేఖలో పేర్కొన్నారు.
  వైఎస్,  కిరణ్, బాబు, జగన్, విజయమ్మ, షర్మిల, చిరంజీవి వివిధ సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మాటలతో కూడిన సీడీల ను సమర్పించారు. సింగరేణి బొగ్గు ఎంత సీమాం ధ్రకు సరఫరా అయిందో తెలిపే డాక్యుమెంట్లు, సచి వాలయం, హైకోర్టులో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కు సంబంధించిన పత్రాలను జతపరిచారు. స్వాతంత్య్రం తర్వాత 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, ఏ రాష్ట్రానికీ లేని విధంగా తెలంగాణకు షరతులు, ఆంక్షలు, అధికారాల్లో కోతలు విధించడం సరికాదన్నారు.
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger