Showing posts with label article. Show all posts
Showing posts with label article. Show all posts

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు

Friday, January 31, 2014


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

Thursday, January 30, 2014

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. కాగా బిజెపి నేత వెంకయ్య నాయుడు ను రఘురామరాజు తన ఇంటికి ఆహ్వానించి, బిజెపిలో చేరే విషయమై చర్చించారని కదనాలు రావడంతో పార్టీ ఈ చర్య తీసుకుంది
Continue Reading | comments

విభజన బిల్లు తిరస్కారానికి ఆమోదం-స్పీకర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లు ను తిరస్కరించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటు గా ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనసభ ను నిరవధిక వాయిదా వేయడానికి ముందుగా ఆయన సభలో ఎందరు మాట్లాడారు? తదితర విషయాలు వివరిస్తూ ,చివరన ఆయన కిరణ్ నోటీసు ప్రబుత్వ తీర్మానం కనుక ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు.ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మనోహర్ చాలా ఉద్వేగంగా కనిపించారు.చాలా వేగంగా తన ప్రకటనను చదివి వినిపించి సభను ముగించారు. సవరణలన్నీ, అఫిడవిట్లు అన్నీ కూడా చర్చలో భాగమని ఆయన ప్రకటించారు.
Continue Reading | comments

వైసీపీ నుండి వెళ్లిపోవట్లేదు ...

Wednesday, January 29, 2014

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్‌, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
Continue Reading | comments

రాజకీయాల్లోకి రానున్న వారసురాలు

Sunday, January 26, 2014

రాజకీయాల్లోకి రానున్న వారసురాలుదీప
నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం ఈసారి వారసులతోనే నడిచేట్లుగా ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడు  గౌతంరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇక ఎన్నికలలో పోటీ చేయడమే ఆలస్యం.  మరో పక్క మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచనలతో పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇంకోపక్క బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె దీప కూడా 2014 ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ నిజమైతే నెల్లూరు జిల్లాలో ఈసారి వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతాయి.

వెంకయ్య నాయుడు -  జాతీయ స్థాయిలో ఓ పెద్ద నేత - నిత్యం జాతీయ నేతలో బిజీగా ఉంటారు - ఓ మాటల మాత్రికుడు - మీడియా ముందుకు వచ్చారంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏ భాషలోనైనా  ప్రాస తన్నుకొస్తుంది. ఆయన మాటల్లో విషయంతోపాటు ప్రాసకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన ఈ సారి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బిజెపి తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా నుంచి బిజెపి జాతీయ నేతగా ఎదిగిన  వెంకయ్యనాయుడు  1978లో, 1983లో రెండుసార్లు ఉదయగిరి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఆత్మకూరు నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి  ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అచ్చిరాలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా  ప్రజల ఆశీస్సులు  లభించలేదు. బాపట్ల, ఆ తరువాత హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.  వెంకయ్యకు బిజెపి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం.  జాతీయ నేతగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు. దాంతో అద్వానీని ప్రసన్నం చేసుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.  ప్రధాని వాజ్ పేయిని, ఉప ప్రధాని అద్వానీని, పాతిక మంది కేంద్ర  మంత్రులను జిల్లాకు తీసుకువచ్చారు. 2004లో  ఎన్నికలలో  తెలుగుదేశం పొత్తుతో బిజెపి  నెల్లూరు లోక్ సభ స్థానంలో,  అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది. రాజకీయ వారసులుగా  తన పిల్లలను తీసుకురానని  వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పేవారు. అయితే ఆయన మనసులో మాత్రం తన  కూతురును ప్రజా ప్రతినిధిగా చూడాలనే బలమైన కోరిక ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో తన కుమార్తె దీపను నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి  పోటీ చేయించాలని వెంకయ్య నాయుడు భావించారు. ఇందు కోసం సర్వే కూడా చేయించారు. టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తే  విజయం  సాధించే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో  చివరి దశలో  ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు.  అయితే ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తె దీపను తప్పనిసరిగా ఎన్నికల బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సారి కూడా  బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు  ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి తన  కూతురిని ఎన్నికల బరిలో దింపేందుకు వెంకయ్య నాయుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీప ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వివిధ  కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  అక్షర విద్యాలయ పేరుతో స్కూలు కూడా  నిర్వహిస్తున్నారు. ఎన్నికల  బరిలో దిగేందుకు ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

source:sakshi
Continue Reading | comments

జగన్ అపోజిట్ మీడియా అవాక్కయిందా!

Thursday, January 23, 2014

తెలుగు మీడియాకు ఒక జాడ్యం ఉంది. తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే సత్యం అని అనుకోవడమే ఆ జాడ్యం. బహుశా దశాబ్దాలుగా తెలుగులో ఒక వార్తా సంస్థదే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నందు వల్ల వచ్చిన జాడ్యమేమో అది. సామాన్యులను రాజకీయనాయకులుగా తయారు చేసేదీ మేమే, ప్రభుత్వాలను కూలగొట్టగలిదేదీ మేమే అని భావించే తెలుగు మీడియా వర్గాలు ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని భావిస్తున్నట్టుగా ఉన్నాయి. 
తమ కులదైవమైన వ్యక్తి దూసుకుపోతున్నాడని రాస్తే అతడు నిజంగానే దూసుకుపోతాడని, తమకు నచ్చని వ్యక్తి గురించి తాము గీస్తున్న గ్రాఫులన్నీ పడిపోతున్నాయని రాస్తే నిజంగానే పడిపోతాయని మన మీడియా భావిస్తోంది. అయితే ఇవన్నీ 80ల నాటి రాజకీయాలు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక రోజులోనే మీడియా అంచనాలు తలకిందుల అవుతున్నాయి. 
అందుకు తాజా వ్యవహారమే ఉదాహరణ.. జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గిపోతోందని, ఆయన ఆదరణ విషయంలో తాము లెక్కలేసి గ్రాఫులు గీస్తే అవన్నీ పాతాళం దిశగా పరిగెడుతున్నాయని ఒక వర్గం మీడియా వరస కథనాలు రాస్తూ వస్తోంది. అయితే ఆ సర్వేలు ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్లకముందే... జాతీయ మీడియా జోక్యం చేసుకొంది. కౌంటర్ సర్వేలు కాదు కానీ.. మన తెలుగు మీడియా వెలువరిచిన సర్వేలకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది జాతీయ మీడియా. 
రాష్ట్రంలో జగన్ పరిస్థితి అయిపోయిందని ఏపీ మీడియా అంటుంటే.. ఓవరాల్ గా పాతిక శాతం మంత్రి తెలుగు వాళ్లు జగన్ కే ఓటు వేసే పరిస్థితి ఉందని, సీమాంధ్రలో అయితే ఈ శాతం 48 గా ఉందని జాతీయ మీడియా లెక్కలేస్తోంది. ఫలితంగా జగన్ పార్టీ కి 19 ఎంపీసీట్లు లభించే అవకాశం ఉందని నేషనల్ మీడియా అభిప్రాయపడుతోంది. ఈ సర్వేలు చూసి తెలుగు మీడియా చాలా ఆశ్చర్యపోతోంది, అవాక్కవుతోంది. కచ్చితంగా తాము తమ మార్కు సర్వేలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే జాతీయ మీడియా తన పరిశీలనల గురించి వెల్లడించడంతో తమ అస్త్రాలు ఫెయిలయ్యాయని బాధపడుతోంది
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-opposite-media-shocks-49851.html#sthash.yCBUb3ZH.dpuf
Continue Reading | comments

ఆ పార్టీ తీవ్ర సంక్షోంభంలో పడిందా?

Sunday, January 19, 2014

వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ తీవ్ర సంక్షోంభంలో పడిందా? జగన్‌ నియంతలా వ్యవహరిస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి దిశగా పయనించే అవకాశముందా? కుటుంబ సభ్యల మధ్యనే తీవ్ర విభేదాలున్నాయా? రాజకీయంగా వైఎస్‌ జగన్‌ పతనం వైపు ప్రయాణిస్తునాడా?...ఇలాంటి అనేకానేక ప్రశ్నలు  చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం జగన్‌ వ్యతిరేక మీడియాలో ప్రతిరోజూ వస్తున్న కథనాలే. జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ఆ రెండు పత్రికల్లో ఒకటి కొన్ని రోజులుగా జగన్‌ పని అయిపోయిందంటూ కథనాలు ప్రచురిస్తోంది. జగన్‌ గ్రాఫ్‌ పడిపోయిందని ఘంటాపథంగా చెబుతోంది. రాష్ట్ర విభజనకు మీరు కారణమంటే మీరు కారణమని మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌  ఒకరినొకరు అణగదొక్కుకోవడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారు.  కాంగ్రెసు-వైకాపా కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంటే, కాంగ్రెసు-టీడీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని వైకాపా శాపనార్థాలు పెడుతోంది. జోరుగా మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా జగన్‌ పార్టీ పని అయిపోయిందని ఆయన వ్యతిరేక మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. 
వ్యతిరేక ప్రచారం తీవ్రం
సాక్షిలోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు, టీడీపీలపై సాక్షిలో వస్తున్న కథనాలకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో వస్తున్న కథనాలు చాలా వాడిగా వేడిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమనే భావన కలిగిస్తున్నాయి. జగన్‌ వ్యతిరేక మీడియాలో వస్తున్న కథనాల్లో ఒక ప్రధానాంశం అతను నియంతలా వ్యవహరిస్తుండటంతో అనేకమంది నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్‌ చేస్తున్నారని, మరోటి జగన్‌కు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతోనే తీవ్ర విభేదాలున్నాయని. షర్మిలకు, జగన్‌కు పడటంలేదని, జగన్‌ ఆమెను పక్కకు పెట్టాడని తీవ్రంగా ప్రచారం జరిగింది. తాజాగా విజయమ్మకు, జగన్‌కు మధ్య కూడా విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా విజయమ్మ సరిగా మాట్లాడలేదని, అది పార్టీకి మైనస్‌ అయిందంటూ జగన్‌ మండిపడినట్లు, దీంతో విజయమ్మ తీవ్రంగా బాధపడి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రేగిందనే ప్రచారం మాత్రం తీవ్రంగా ఉంది. జగన్‌కు, షర్మిలకు పడటంలేదనే ప్రచారం చాలా కాలం సాగినా దాన్ని తల్లీ కూతుళ్లు ఖండించే ప్రయత్నం చేయలేదు. 
షర్మిలతో బెడిసిందా?
సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన షర్మిల తన అన్నయ్య బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగానే కనుమరుగైపోయింది. అప్పటి నుంచి ఇప్పటివవరకు ఏమీ మాట్లాడటంలేదు. ఇదంతా కడప లోక్‌సభ సీటుపై రగిలిన చిచ్చు అని, షర్మిల ఆ సీటు కోరుకుంటే జగన్‌ కాదన్నాడని, దాన్ని తన బాబాయి కుమారుడైన అవినాష్‌కు ఇచ్చాడని కథనాలు వచ్చాయి. ఈ ‘చిచ్చు’ ప్రచారం తీవ్రం కావడంతో కొన్ని రోజుల క్రితం ‘సాక్షి’ టీవీ షర్మిలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని, అన్న  జైల్లో ఉండటంతో పార్టీ మనుగడ కోసం తాను పాదయాత్ర చేశానని, అదీ జగన్‌ సూచన మేరకే జరిగిందని, అతను జైలు నుంచి రావడంతో అక్కడితో తన పాత్ర ముగిసిపోయిందని షర్మిల చెప్పింది. పార్టీని జగన్‌ చూసుకుంటున్నప్పడు తాను ఇన్‌వాల్వ్‌ అయితే అది అనవసర జోక్యం అవుతుందని చెప్పింది. పార్టీకి అవసరమైనప్పుడు మళ్లీ తాను రంగంలోకి వస్తానని, తాను ఎప్పటికీ జగనన్న బాణాన్నే అని స్పష్టం చేసింది. కడప సీటుపై వివాదం లేదని, వ్యక్తిగతంగా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని వివరించింది. 
జగన్‌ సర్వేలోనే తగ్గిన బలం!
ఇక తాజాగా వైకాపా దళిత నేత, మాజీ మంత్రి మారెప్ప జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడటంతో ‘జగన్‌ పార్టీలో చిచ్చు’ ప్రచారానికి మరింత ఊతం లభించింది. ఒకప్పుడు జగన్‌కు అండగా ఉన్నవారంతా తప్పుకుంటున్నారని, కొందరు ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారని, వైకాపా తరపున నిలబడితే ఓటమి తప్పదనే భావనలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో జగన్‌ బలం సగానికి పడిపోయిందని, ఇది ఆయన చేయించిన సర్వేలోనే తేలిందని ‘ఆంధ్రజ్యోతి’ తాజాగా కథనం ప్రచురించింది. జగన్‌ సమన్యాయం నుంచి సమైక్య టర్న్‌ తీసుకున్న తరువాత తెలంగాణలో పార్టీ అధోగతి పాలైన విషయం వాస్తవమే. అయితే ఇప్పుడు సీమాంధ్రలో సైతం వైకాపాకు బలం లేదని సర్వేలో తేలినట్లు ఆ కథనం వివరించింది. జిల్లాలవారీగా, సంవత్సరాలవారీగా వైకాపా బలం ఎలా తగ్గిపోయిందో శాతాలతో సహా వివరించింది. ఈ టేబుల్‌ చూసినవారెవరికైనా వైకాపా పని అయిపోయిందనే అభిప్రాయం కలుగుతుంది.
బంధువులే కాకుండా, వైకాపా ఏర్పాటు సమయం నుంచి తోడుగా ఉన్న అనేకమంది నాయకులు జగన్‌ నియంతృత్వాన్ని తట్టుకోలేకపోతున్నారని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడనే ప్రచారం ఉంది. చివరకు సీనియర్‌ నాయకుడు, ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితుడైన ఎంవి మైసూరారెడ్డి సైతం జగన్‌ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిరావడంతో తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడని ఆంధ్రజ్యోతి రాసింది. టిక్కెట్ల కోసం భారీగా వసూలు చేస్తున్నాడని, ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఒకప్పుడు కోట్లు ఇచ్చినవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని, అవకాశం దొరికితే బయటకు వెళ్లిపోదామనే ప్రయత్నాల్లో ఉన్నారని రాసింది. జగన్‌ మీడియా ప్రచారాన్ని ముఖ్య నాయకులు పెద్దగా ఖండించడంలేదు. అదీగాక ఒకప్పుడు కీలకంగా కనిపించిన నాయకులు కొంతకాలంగా మీడియాలో కనబడకపోవడం కూడా వ్యతిరేక ప్రచారానికి తావిస్తోంది. ఏది ఏమైనా వైకాపా బలం పెరిగిందా? తగ్గిందా? తెలియాలంటే అందుకు ఎన్నికలే గీటురాయి. 
-అమృత
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/what-happen-in-ycp-49764.html#sthash.nuxhU8TM.dpuf
Continue Reading | comments

గ్రేట్ ఆంధ్ర : జగన్‌... ఒక్క అడుగు!

Sunday, November 3, 2013

ఒక్క అడుగు కీలకం.. మడమ తిప్పకుండా ముందుకెళ్లి ఆయన ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాలి!
ఒక్క అడుగు కీలకం.. అదేదో ప్రజలనే అడిగి ఆయన తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి!!
ఒక్క అడుగు కీలకం.. ప్రస్థానం చెల్లిపోయిందని ప్రపంచం గేలిచేస్తున్న వేళ.. తెలంగాణ బరిలో తన విధానంలోని నిజాయితీని చాటుకోవడానికి వేసే ప్రతి ఒక్క అడుగూ కీలకం!!!
తొలి అడుగులు ఎలా పడతాయో అదే కీలకం అని అదే ముచ్చట అని అనుకుంటాం మనం. కానీ మలి అడుగులు కీలకం అవుతున్నాయిప్పుడు. ఇంతకాలం పార్టీని నడిపిన తర్వాత.. జగన్మోహనరెడ్డి ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ‘తెలంగాణ కూడా నాక్కావాలి..’ అని జగన్‌ అంటుండవచ్చు గాక కానీ తెలంగాణ వారు కూడా ‘జగన్‌ మాక్కావాలి’ అనుకోవాలి. అలాంటి వారు అనల్పంగా ఉన్నారని జగన్‌ నమ్మిక. తన తండ్రి వైఎస్సార్‌ వేసిన ప్రగతి పునాదులు ప్రజలప్రేమను పటిష్టంగా నిర్మించాయని ఆయన విశ్వాసం.
అయితే.. విజయమ్మ కారు మీదకు విసరబడిన కోడిగుడ్లు జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేవి కాదు! అల్లరిని ఉద్యమం అనుకుని జడిసే స్థితిలో జగన్‌ ఉండకపోతే గనుక.. ఆయన తాను కూడా తన సమైక్య సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో తాను స్వయంగా ఆయన పర్యటనకు పూనుకోవచ్చు. జగన్‌ తెలంగాణలో అడుగుపెట్టడానికి యాత్రకు సిద్ధమవుతున్నాడంటేనే.. జడుస్తున్న వారో.. పోరాడుతున్న వారో... ఆయనకు పదేపదే ‘మానుకోట’ను గుర్తుచేస్తుండవచ్చు! భయపెట్టగలమని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ వేచిచూడాలి... ఆయన రాళ్లకు వెరచి ఆగుతారో.. ఎదురు నిలిచి పోరుతారో.. ఒడుపుగా వాటిని పట్టుకుని.. తనకంటూ ఓ దుర్గం నిర్మించుకుంటారో...!!
==============================
తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలనే వాంఛ  ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైన అభివృద్ధి కలలు వారి కనుల ముందు సాక్షాత్కరిస్తాయనే విషయంలో ‘కోరుకుంటున్న ప్రజల్లో’ ఎందరికి స్పష్టమైన అవగాహన ఉన్నదనే సంగతి లెక్కవెయ్యలేం. ఏం జరుగుతుందో తెలియదు గానీ, అందరూ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని అంటున్నారు గనుక.. ఆ మాటలు నమ్ముతూ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారు అనేకులు. ‘అందరూ’ కొందరిని విలన్లుగా చిత్రీకరిస్తూ పదేపదే ప్రచారం చేస్తున్నారు గనుక.. తాము కూడా విలన్లుగా భావిస్తున్న వారు అనేకులు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, దోపిడీలు, కబ్జాలు ఇత్యాది విషయాలలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం అవుతుండవచ్చు గాక.. కానీ, పైన చెప్పుకున్న వీరందరిలోనూ నిజంగానే తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరిక ఉన్నది. కానీ యావత్తు తెలంగాణ ప్రాంతంలో ‘వీరు’ ఎందరున్నారు? అదే ఇప్పుడు పెద్ద చిక్కుముడి. తెలంగాణలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ‘వీరి’ వాటా ఎంత? మిగిలిన వాటా ఎంత? ఆ మిగిలిన వాటాలో ఎందరున్నారు? వారు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? తమ ఆశలను తీర్చగల చుక్కానిగా ఎవరిని ఎంచుకుంటున్నారు? వేరే ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? సమైక్యాంధ్ర ఉద్యమానికి, సమైక్యాంధ్ర భావజాలానికి బయటకు కనపడని మూలాలు అనేకం తెలంగాణలోనే ఉన్నాయనడానికి వారికి తమ అవ్యక్త ఆశలను నెరవేర్చగల రాజకీయ ఆశాదీపంగా సమైక్య శంఖారావం పూరించి.. సోనియాను హెచ్చరించిన జగన్మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారని వాస్తవమూలాల్ని వివరించేందుకు గ్రేట్‌ఆంధ్ర ప్రయత్నం.. ఈ వ్యాసం.
అవ్యక్త బాధాసర్పదష్టులు అనేకులు
‘తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వచ్చి ఒదిగిపోయారు. కానీ తెలుగువాళ్లు కలవడం లేదు. అందుకే ఇప్పుడీ విభజన తగాదాలు వస్తున్నాయి’ అని ఈ మధ్య కొందరు పెద్దలు వాక్రుచ్చారు. కానీ వారు అయితే మూలాలు తెలియకుండా మాట్లాడి ఉండాలి. లేదా, ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను ప్రచారంచేసేందుకు అలా మాట్లాడి ఉండాలి. తెలంగాణలో ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలైన వచ్చి కలిసిపోయి ఉండవచ్చు గాక.. కానీ వారి మాటల్లో ‘తెలుగువారు’ వాస్తవానికి సీమాంధ్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి జనజీవితంలో మిళితం అయినట్లుగా మరొకరు మనకు కనిపించరు. సోకాల్డ్‌ తె-వాదపు పెద్దలు  చెబుతున్న మాటల్లో ‘ఇక్కడ కలిసిపోయిన ఇతర రాష్ట్రాల వారు’ ప్రధానంగా హైదరాబాదు నగరంలో కేంద్రీకృతం అయిన వారు. అంటే వ్యాపార అవకాశాలు ఎక్కడ విస్తారంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వారు వచ్చి స్థిరపడ్డారు.. కలిశారు. కానీ సీమాంధ్రులు అలా కాదు. వారు తాము మరో ప్రాంతానికి వెళుతున్నాం అనే భావన లేకుండానే ఇది మనదే అనే ఉద్దేశంతోనే ఇక్కడి సామాన్య జనజీవితంలో తామూ ఒక భాగంగా కలిశారు. వీరు కేవలం హైదరాబాదు నగరం మీది మోజుతో వచ్చి స్థిరపడిన వారు కాదు. ఇరుగుపొరుగు భావనలతో యావత్తు తెలంగాణ ప్రాంతంలోని అనేక కుగ్రామాలలో సైతం సేద్యం పనులు చేసుకుంటూ సొంతానికి కొంత  వ్యవసాయం ఏర్పాటు చేసుకుని స్థిరపడిన వారు. వారికి సీమాంధ్ర తెలంగాణ పేరుకు రెండు ప్రాంతాలే తప్ప వేరువేరు అనే భావన ఉండదు. ఆ మాటకొస్తే సీమాంధ్ర ప్రాంతంనుంచి వచ్చి స్థిరపడిన రైతు, వృత్తిపనివాడు లేని పల్లె మనకు యావత్తు తెలంగాణలో దుర్భిణి వేసి వెతికినా దొరకదన్నది వాస్తవం. 
ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ బాగా కలిసిపోయారంటూ చిలకపలుకులు పలికే మేధావులు గమనించాల్సిన మరో వాస్తవం కూడా ఉంది. హైదరాబాదులో వారి దామాషా ఎంత? తెలంగాణ పల్లెపట్టుల్లో స్థిరపడిన సీమాంధ్రుల దామాషా ఎంత? చూస్తే తెలిసిపోతుంది. సీమాంధ్ర ప్రాంతీయులు కేవలం ఇక్కడి వ్యాపారపరమైన ఆకర్షణకు ఎగిరి వచ్చారో.. లేదా, తెలంగాణ ప్రాంతపు జనజీవన మూలాల్లో తాము కూడా ఒక భాగంగా బతకడానికి వచ్చారో తేలిపోతుంది. 
వారికి తమ జన్మమూలాలు ఎక్కడున్నాయో తెలుసు. సదరు సీమాంధ్ర ప్రాంతంతో తమ అనుబంధం ఏమిటో తెలుసు. శ్రీకాకుళంనుంచి వలస వచ్చిన కుటుంబ వారసుడు కేసీఆర్‌కు ఆ మూలాల మీది అనుబంధం లేదని అనలేం. ఆ అనుబంధాన్ని తోసిరాజని.. సీమాంధ్రులందరినీ దోపిడీ దొంగలుగా చిత్రించేయడానికి, కేసీఆర్‌కు కనిపించినట్లుగా కనులముందు ఈ ప్రజలందరికీ అధికార పీఠాలు కనిపిస్తూ ఉండకపోవచ్చు. అందుకే వారు తమ మూలాలున్న ప్రాంతంతో బంధం తెగిపోవడం అంటే.. మనస్సు ఎక్కడో చివుక్కు మంటున్నదని బాధపడుతున్నారు. తల్లిపేగు కత్తిరించినట్లుగా ఉన్నదని వేదన చెందుతున్నారు. 
అలాంటి జనం యావత్‌ తెలంగాణలో ఏ కులం కంటె, ఏ మతం కంటె, ఏ వర్గం కంటె కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్న మాట ఇవాళ కఠోరమైన వాస్తవం. పెద్దసమస్య తలెత్తినప్పుడు, ఉన్న సమస్య చిన్నదైపోయినట్లుగా.. విభజన అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా వారంతా ఇప్పుడు ఒక్కటే జాతి అనుకుంటున్నారు. మరి వారి వేదన పరిమార్చే ప్రత్యామ్నాయం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో స్థిరపడి బతుకుతున్నందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వాంఛను వ్యక్తం చేయలేని బతుకులు ఈ ప్రాంతంలో కొన్ని లక్షలున్నాయి. వారి చుక్కాని ఎవ్వరు? 
ఉద్యమవేళల్లో తమ కోరికను చెప్పలేకపోవచ్చు గానీ.. ఓటు పర్వం అంటూ వస్తే.. రహస్యబ్యాలెట్‌ రాజ్యం చేసే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సమైక్యవాదానికి దన్నుగా నిలవగలమని వారు భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రస్తుతానికి సమైక్య వాదాన్ని వినిపిస్తున్న ఏకైక నాయకుడిగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల పర్వం వరకు ఈ రాష్ట్రం ముక్కలైపోకుండా ఉంటే గనుక.. జగన్‌ దిశగా తామంతా కలసి కట్టుగా ఒక్క అడుగు వేయాలనే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న నిర్దిష్టమైన జనవాహిని ఉన్నది. సరిగ్గా వారి ఆశ ఆలోచినస్తున్న దిశగానే.. వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నం కూడా నడుస్తున్నది.
తెలంగాణలో అస్తిత్వం అవశ్యం...
వైఎస్‌ జగన్మోహనరెడ్డి తను సమైక్యవాదాన్ని స్పష్టంగా స్వీకరించిన రోజున దాని నిర్వచనాన్ని కూడా వివరించారు. అవకాశవాద మీడియాల విశృంఖల రూపాల్లో అది మరుగున పడిపోయి ఉండొచ్చు గానీ.. ‘సమైక్యాంధ్ర అంటే కేవలం రాయలసీమ, కోస్తాంధ్ర కాదు. తెలంగాణ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను రాష్ట్రం కలిసిఉండాలని కోరుతున్నాను’ అంటూ ఆయన స్పష్టీకరించారు. కానీ వైకాపా తన ధోరణిని నిర్ణయించుకున్న రోజున క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది నాయకులు కంగారు పడ్డారు. వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. కానీ జగన్మోహనరెడ్డి మాత్రం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు. తాము సంకల్పించిన విధానానికే కట్టుబడ్డారు. 
తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వం అవశ్యం ఉండాల్సిందేనంటూ ఆయన పట్టుపట్టారు. ఈ వ్యాసం తొలిభాగంలో చెప్పుకున్న లక్షలాది మంది జనానికి కనీసం తమలోని కోరికను ఓటు రూపంలో వ్యక్తం చేయాలనుకున్నా కూడా వారికి ఒక మార్గం లేకుండా పోతున్నదని జగన్‌ గుర్తించారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా.. ప్రజల్ని ఓట్లుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప.. వారిలోని అసలైన ఆకాంక్షలను గుర్తించి వాటికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేయడంలేదనే.. వైఖరిని కూడా జగన్‌ అర్థం చేసుకున్నారు.  ఆ శూన్యాన్ని తాను భర్తీ చేయాలని అనుకున్నారు. 
‘పోగా మిగిలింది ఆస్తి’ అనే సామెత తరహాలో.. పోయినవారు పోగా మిగిలిందే పార్టీ అనే సిద్ధాంతానికి కట్టుబడ్డారు జగన్‌. ఎవరు మిగిలారో వారే ఎన్నికల్లో తలపడతారు. ప్రజల ఆశలకు దన్నుగా నిలుస్తారు అనే వాదనతో ఆయన పార్టీ నిర్మాణానికి సిద్ధ పడ్డారు. ఇవాళ మళ్లీ తెలంగాణ ప్రాంతంలో కూడా వైకాపా రాజకీయ పునాదులు నేల పొరల్లోంచి పొడుచుకు వస్తున్నాయి. అవి తె-వాదులకు కంటినలుసులా తయారవుతున్నాయి. వాటిని వారు చూడలేకపోతున్నారు. ఎలా ‘డీల్‌’ చేయాలో బోధపడని కంగారులో తప్పుడు దారులు తొక్కుతున్నారు. 
అల్లరి అభాసుపాలు కావాల్సిందే.. 
వైఎస్‌ విజయమ్మ వరద బాధిత రైతుల పరామర్శకు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు జరిగిన అల్లరి ద్వారా ఏం సాధించామని తె-ఉద్యమకారులు సంతసిస్తూ ఉంటారో గానీ.. నిజానికి మనం తొలుత చెప్పుకున్న వర్గానికి చెందిన ప్రజల్లో ఈ అల్లరి ఐక్య భావనను హెచ్చించి ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి రైతుల కన్నీటిని తుడవడానికి ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాకను వ్యతిరేకించడాన్ని వారు ఎలా సమర్థించుకుంటారు. వైకాపా తెలంగాణ రాష్ట్రం కావాలనే రాజకీయ డిమాండును వ్యతిరేకిస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతాన్ని కాదు. ప్రజల్ని కాదు. తెలంగాణ ప్రజల్లో విజయమ్మ పట్ల వ్యతిరేకత ఉన్నదనడానికి వీల్లేదు. తె-నాయకులు టముకు  వేస్తున్నట్లుగా ‘మీ సమైక్యవాదుల సానుభూతి మాకు అక్కర్లేదు’ అంటోంది ఎవరు? రాజకీయ ముసుగులో పోరుతున్న వారు మాత్రమే. ప్రజల్లోనే నిజమైన భావన అదే అయితే గనుక.. విజయమ్మ యాత్ర కోడిగుడ్లు విసిరిన వారి అల్లరి వలన కాదు... జనస్పందన లేక అర్థంతరంగా వెనుతిరిగి ఉండాలి. ఆర్తిలో ఉన్న జనంలో నిజమైన వైకాపా వ్యతిరేకత ఉంటే.. విజయమ్మ తమ పల్లెకు వచ్చినప్పుడు.. ఆమె చెంతకు రావడానికి వారు విముఖత ప్రదర్శించి ఉండాలి. అలాంటిది ప్రజల్లో ఉండే భావనను చెబుతుంది. అలాకాకుండా.. మధ్యలో కార్లను అడ్డుకుని కొంత అల్లరి చేస్తే ఏం జరుగుతుంది. అంతా  ఉత్తిదే. 
ఐక్యంగా ఉండే జాతిలో సమైక్యవాదం ఆవశ్యకత మరింత స్పష్టంగా అర్థం కావడానికి ఇలాంటి అల్లరి ఉపకరిస్తుంది. 
మరింత జాగ్రత్తగా మలి అడుగులు
తెలంగాణ ప్రాంతంలో కూడా దూసుకెళ్లడానికి అక్కడి జనస్పందనను- ధిక్కార తిరస్కారాదులను బేరీజు వేయడానికి విజయమ్మ యాత్ర రూపంలో జగన్‌ చేసిన ట్రయల్‌ రన్‌ ఇది అని పలువురు విమర్శించవచ్చు గాక! దాన్ని కాదనడానికి వీల్లేదు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆమాత్రం అప్రమత్తత ఉండదనలేం. 
సమైక్యవాదానికి కట్టుబడిన తర్వాత.. తెలంగాణ ప్రాంతంలో తొలి అడుగుల్లో విజయమ్మకు ఎదురైన స్పందనను బట్టి.. వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మలి అడుగులను మరింత పటిష్టంగా ప్లాన్‌ చేసుకుంటారు. ఎవరు కాదనగలరు? మానుకోటలాగా రాళ్లు విసురుతాం అని.. పైనపల్లిలాగా కోడిగుడ్లు చెప్పులు విసురుతాం అని ఎన్నాళ్లు బెదరగొడతారు. ప్రజాస్వామిక ప్రపంచంలో ఇలాంటి చర్యలు ఎలా సాధ్యం?
మన వ్యాసంలో తొలినుంచి ప్రస్తావిస్తున్న తెలంగాణలోని ప్రత్యేక జాతికి ఇప్పుడు జగన్‌ ఒక్కడే ఆశాదీపం కనిపించడం నిస్సంశయం. ఇతర పార్టీలు రాజకీయంగా ప్రజలతో గేమ్‌ ఆడుతున్నాయని ప్రజలందరూ గుర్తించారు. వీరి ఆకాంక్ష వైపుగానే జగన్‌ నడుస్తున్నారు. అది తనకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుస్తుందని ఆయనకు తెలుసు. సరిగ్గా అక్కడే తె-పార్టీలకు కంగారు పుడుతోంది. జగన్‌ తెలంగాణలో తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటే  గనుక యావత్‌ తెలంగాణ వాదం పేరిట తాము చేస్తున్న ప్రచారం... నిర్మించిన అభూత కల్పనలన్నీ కుప్పకూలిపోతాయని వారు భయపడుతున్నారు. అందుకే జగన్‌ పర్యటనల పట్ల దాడులు ప్లాన్‌చేస్తున్నారు.
కానీ  ఇప్పుడే కోర్టు అనుమతులు పొందిన తరువాత.. పర్యటనలకు సిద్ధం అవుతున్న జగన్‌ యావత్‌ తెలంగాణ మీద కూడా తన దృష్టి సారించడం మాత్రం తథ్యం. ఎన్నికల లోగా చీల్చేసి.. ఓట్లు సీట్ల రాజకీయ యావ ముందు మరే ప్రజాకాంక్షలూ నిలవలేని కాంగ్రెసు నిస్సిగ్గుగా నిరూపించుకుంటే తప్ప.. ఎన్నికల బరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎవరు చెప్పగలరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా పడే ఓటును పార్టీలు పంచుకుంటాయి గానీ.. జగన్‌కు పడే ప్రతి ఒక్క ఓటు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నదే అవుతుంది.
తెలంగాణ ప్రాంతంలో జగన్‌.. 2014 ఎన్నికలు పూర్తయ్యే సరికి తానొక అనధికార ప్లెబిసైట్‌ ఫలితంలాగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు. 
దుర్భేద్యమైన రాతిదుర్గం తయారవుతోంది...
తెలంగాణప్రజల్లో వైఎస్‌ జగన్‌కు ఒక దుర్భేద్యమైన సానుకూలాంశం ఉంది. అది వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పట్ల సామాన్యుల్లో ఉన్న ప్రేమ. ఇవాళ రోడ్ల మీద వైఎస్‌ విగ్రహాల్ని కాలబెట్టి ఉండవచ్చు. కానీ పూర్తిగా వైఎస్‌ ఆనవాళ్లను తుడిచేయాలనుకుంటే.. కొన్ని లక్షల మంది హృదయాలను తగలబెట్టాల్సి ఉంటుందని అల్లరి మూకలుగుర్తించాలి. ఆ వైఎస్‌ అభిమానం..  ప్రాంతీయ వైషమ్యామలకు, దురభిమానాలకు అతీతమైనది. ఇవాళ ప్రతికూల వాతావరణంలోనూ జగన్‌ను స్వాగతిస్తున్నది కూడా అదే! 
స్వానుభవాల్లోని చేదును విస్మరించి, అవకాశవాద ఆత్మవంచనతో వెర్రెత్తిపోయే నేత కాదు జగన్‌. మానుకోటలో పడిన రాళ్లు ఆయనకు గుర్తుంటాయి. ఇప్పుడు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలి మీద పడిన కోడిగుడ్లు, చెప్పులు కూడా ఆయనకు గుర్తుంటాయి. 
తత్వరీత్యా జగన్‌ ఎలాంటి వారంటే.. అప్పుడు పడిన రాళ్లతో ఓ దుర్గం నిర్మించుకుంటారు. దుర్భేద్యమైన ఆ రాతి దుర్గంలో జనాభిమానాన్ని ఆయన పదిలం చేసుకుంటారు.  ఇప్పుడు పడిన చెప్పుల స్థానే పూలను కూడా కురిపించుకునే రోజుకోసం ఆయన పరిశ్రమిస్తారు. 
ఈ రాష్ట్రం చీలిపోబోతున్నదని మనం అనుకుంటున్నాం-
కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది-
చీలిక ఇప్పటికే జరిగిపోయింది-
ఆ చీలిక, నిజానికి తెలంగాణలోని జనంలోనే ఉంది-
ఒక వర్గం- రాళ్లు, గుడ్లు పోగేసుకుని అల్లరిచేస్తోంది-
ఒక వర్గం- ఓటును పదిలంగా పట్టుకుని నిరీక్షిస్తోంది-
అంతిమవిజయం- నిజాయతీగల జనకాంక్షనే వరిస్తుంది!
- కపిలముని
http://telugu.greatandhra.com/articles/kapilamuni/kapilamuni-oka-adugu-47798.html


Continue Reading | comments

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం

Sunday, October 20, 2013

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని.. దానిని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ప్రధాని కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజన విషయంలో కేంద్రం అక్టోబర్ 3న ప్రకటించిన నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు అనుగుణంగా లేదని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉందని.. అది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా కూడా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
 ఈ వ్యాజ్యంపై       సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. రఘురామకృష్ణరాజు తరఫున ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మ విభూషణ్ ఫాలీ ఎస్.నారీమన్ వాదనలు వినిపించనున్నారు.

 గవర్నర్, స్పీకర్‌లను కలిసినా ప్రయోజనం లేకపోయింది.. ‘అసెంబ్లీకి బిల్లు రావడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి, విజ్ఞప్తి చేశారు. కానీ అటు గవర్నర్, ఇటు స్పీకర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందనా లేదు.
 
 అధికరణ 3 కింద రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకు తెలుసుకోలేదు. అంతేగాక ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చిదంబరం చేసిన ‘డిసెంబర్ 9’ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. పార్లమెంట్‌లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి లేదు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ తగిన సలహాలు ఇవ్వొచ్చు. అయితే అవి ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగించే విధంగా ఉంది. రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర తెలుసుకోకుండా, ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు.
 
 ముందు అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి..
 
 ‘ప్రస్తుతమున్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై రాజ్యాంగంలోని 3వ అధికరణలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలి. అనంతరం పార్లమెంట్ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతుంది.  ఆ తరువాతే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఇంతకు మించి మరో విధానం లేదు. 3వ అధికరణ విషయంలో కేంద్రం తనకు అధికరణ 73 కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించాలంటే.. ముందు అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి.
 
 అలా చేయకుండా విభజనపై ముందుకెళితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్లడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని 1955లోనే రామ్ జయకపూర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్ర కేబినెట్ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమేగాక, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయం కూడా. అందువల్ల ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలి.
 
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందుకు సంబంధించి అసెంబ్లీలో తగిన తీర్మానం చేస్తారని 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. దాంతో తెలంగాణపై ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందని డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371 (డి), 371 (ఇ)లను రాజ్యాంగంలో చేర్చారు. అవి అమలులో ఉండగా, విభజనపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రఘురాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

sakshi
Continue Reading | comments

ఆర్టికిల్ 371 డి.విభజనకు ఆటంకం కాదు

Friday, October 18, 2013

జోనల్ వ్యవస్థకు కీలకంగా ఉన్న ఆర్టికల్ 371-డి ని సవరించకుండా రాష్ట్ర విభజన సాధ్యం కాదన్న సీమాంద్ర నేతల వాదనను టిఆర్ఎస్ నేత,మాజీ ఎమ్.పి వినోద్ తోసిపుచ్చారు.371డి వల్ల విబజనకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర విభజన చేయవచ్చని వినోద్ పేర్కొన్నారు. గతంలో పంజాబ్-హర్యానా విడిపోయినప్పుడు కూడా 371 రాజ్యాంగ సవరణ చేశారని వినోద్ తెలిపారు. ఆర్టికల్ 371-డి పై తోచిన విధంగా మాట్లాడుతున్నారని వినోద్ వ్యాఖ్యానించారు.రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఆర్టికిల్ 3 అత్యంత ముఖ్యమైనదని ఆయన చెప్పారు.
Continue Reading | comments

మాజీమంత్రి విశ్వరూప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్
హైదరాబాద్ : మాజీమంత్రి విశ్వరూప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ....విశ్వరూప్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ....మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ  సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాను సుశిక్షితుడైన సైనికుడిలా పోరాడతానని చెప్పారు.
Continue Reading | comments

వేగవంతమైన విభజన ప్రక్రియ

వేగవంతమైన విభజన ప్రక్రియ
రాష్ట్ర విభజన ప్రక్రియ  వేగవంతమైంది. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకునే పరిస్థితులలో కేంద్రం లేదు. తను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లన్నట్లు కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం  ఉన్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మెత్తబడిపోయారు. రాష్ట్ర విభజన ఆపడానికి ఇంకా చాలా దారులు ఉన్నాయని ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు చెబుతున్నారు. కొందరైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందని బహిరంగంగానే స్సష్టం చేస్తున్నారు. ఇంకా విభజన ఆపవచ్చని ప్రజలను మోసం చేయడం తనకు ఇష్టంలేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి తలవంచడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి బాలరాజు గతంలోనే  చెప్పారు. కేంద్ర మంత్రులు పలువురు రాజీపడిపోయారు. కొందరు ప్యాకేజీలు అడుగుదామన్న ఆలోచనలో ఉన్నారు. వీరంతా వెనక్కు తగ్గిన నేపథ్యంలో కేంద్ర హొం శాఖ విభజన ప్రక్రియ విషయంలో దూసుకుపోతోంది. దీనికి తోడు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి.

17 అంశాలకు సంబంధించి  24 గంటల్లో సమాచారం పంపాలని కేంద్ర హొం శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నెల 19న మంత్రుల బృందం(జిఓఎం) రెండవసారి సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం తెలంగాణలోని పది జిల్లాల సమాచారం మాత్రమే హొం శాఖ కోరింది.  విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచించింది.  రాష్ట్ర విభజనకు సంబంధిం కేంద్ర మంత్రిత్వ శాఖలు సంబంధిత సమాచారం పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఈ నెల 11న లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయవలసి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం 17వ తేదీలోపు సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రతి శాఖ  ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలను  ఆదేశించించారు.

 సంబంధిత రంగం ఏయే ప్రాంతాల్లో  ఎలా విస్తరించి ఉంది, ఇరు ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల వివరాలు, ఉద్యోగుల సమాచారంతో కూడిన స్పష్టమైన వివరాలను అందించాలని ఆదేశించారు. 19న జరిగే మంత్రుల బృందం సమావేశంలో సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి చర్చించే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

 రాష్ట్ర సచివాలయంలో కూడా ఈ ప్రక్రియ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని రాష్ట్ర పునర్విభజన (ఎస్‌ఆర్) విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. సచివాలయంలోని ‘బి’ బ్లాక్ ఆరో అంతస్తులో ఎస్‌ఆర్ విభాగం ఉంది. ఇందులో ప్రస్తుతం ఒక ఎస్‌ఓ, ఒక ఏఎస్‌ఓ మాత్రమే  ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ విభాగం ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఎస్‌ఆర్ విభాగం ద్వారానే రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సమాచారమంతా కేంద్రానికి చేరుతుంది. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఎస్‌ఆర్ విభాగం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తుంది. ఇందుకోసం ఎస్‌ఆర్ విభాగంలో సాగునీరు, ఆర్థిక, సర్వీసులు, విద్యుత్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రణాళికా విభాగం సహా రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అదనపు కార్యదర్శులు లేదా సంయుక్త కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఆ అధికారులు ‘విభజన’కు అవసరమైన సమాచారాన్ని సేకరించి  కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తారు.

 ఆ కమిటీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ విభాగంతోనే జరుపుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ జిల్లాల వారీగా ఆదాయ వివరాలు, ఆస్తులు, అప్పులు, వడ్డీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను  సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) జిల్లాల వారీగా సమకూర్చుకుంటుంది.  జిల్లాల వారీగా విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా, బొగ్గు, గ్యాస్ లభ్యత తదితర సమాచారాన్ని ఇంధన శాఖ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను కూడా అందజేస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల కేటాయింపు తదితర వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రణాళికా సంఘానికి పూర్తి సమాచారం ఉంది. మొత్తంగా ‘ఎస్‌ఆర్’ విభాగం నుంచి అందే సమాచారం ఆధారంగా కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర విభజన, ఆస్తులు, ఆదాయ వనరులు, ఉద్యోగులు, అప్పుల పంపిణీకి ఒక ప్రాతిపదికను రూపొందిస్తుంది.  ఆ ప్రాతిపదికను కేంద్రమే అమలు చేస్తుంది.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపధ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆపడం సాధ్యం కాదని అర్ధమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. యువనేత జగన్ ఒక్కరే సమైక్యతకు కట్టుబడి ఉద్యమిస్తున్నారు. సిపిఎం, ఎంఐఎం రెండు పార్టీలు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు నిజాయితీగా  జగన్ పిలుపుకు స్పందించి ముందుకు వస్తే విభజనను ఆపడం సాధ్యమవుతుంది
sakshi
Continue Reading | comments

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!

Wednesday, September 18, 2013

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కబళిస్తున్న హెచ్‌ఐవీ మహమ్మారి నిర్మూలనకు ఉపయోగపడే శక్తిమంతమైన అస్త్రాలు మరో రెండేళ్లలో సిద్ధం కానున్నాయి. అపార ఔషధగుణాలు గల ‘సమోవన్ మమాలా’ చెట్టు బెరడు, బ్రయోజోవా అనే సముద్రజీవుల నుంచి సేకరించిన రసాయనాలతో స్టాన్‌ఫర్డ్ వర్సిటీ  శాస్త్రవేత్తలు సమర్థమైన కొత్త మందులను తయారుచేశారు.

 సమోవన్ బెరడు నుంచి తయారుచేసిన ‘ప్రొస్ట్రాటిన్’ అనే ఔషధం.. మనిషి శరీర కణాల్లో దాక్కునే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ)ని బయటికి తరిమేస్తుందని వర్సిటీ శాస్త్రవేత్త పాల్ వెండర్ వెల్లడించారు. మంగళవారం ఇండియానాపొలిస్‌లో అమెరికన్ కెమికల్ సౌసైటీ 246వ సమావేశాల సందర్భంగా వెండర్ ఈ మేరకు ‘హెల్త్‌లైన్’తో మాట్లాడారు.

ప్రొస్ట్రాటిన్‌తో ఇప్పటిదాకా జంతువులు, ఎయిడ్స్ రోగుల రక్తంపై పరీక్షలు చేయగా, పూర్తి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మనుషుల్లో దీన్ని ఉపయోగించడం కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)’ అనుమతి కూడా లభించిందని, రెండేళ్లలోనే అందుబాటులోకి తేనున్నామన్నారు.

 కణాల లోపలి నుంచి గెంటేస్తుంది..!
 సమోవన్ బెరడు నుంచి ప్రొస్ట్రాటిన్, బ్రయోజోవన్ల నుంచి ‘బ్రయోస్టాటిన్’ రసాయనాలను సేకరించి వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. ఎయిడ్స్ చికిత్సకు ఇప్పటిదాకా తయారుచేసిన ఔషధాలు హెచ్‌ఐవీ వైరస్‌లు కణాల బయట ఉన్నప్పుడే వాటిని నాశనం చేయగలుగుతున్నాయి. ఈ ఔషధాల వినియోగం ఆపేయగానే కణాల్లో దాక్కున్న హెచ్‌ఐవీ వైరస్‌లు బయటికి వచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. అయితే కణాలలోపల దాగున్న వైరస్‌లను సైతం ప్రొస్ట్రాటిన్ బయటికి గెంటేయగలుగుతుందని వెండర్ వివరించారు.  

 పాతికేళ్ల క్రితమే గుర్తించినా...
 ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వంటి వైరస్‌లను నిర్మూలించే గుణం సమోవన్ చెట్టు బెరడుకు ఉందని 1987లోనే కాక్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీనిపై పరిశోధన చేపట్టిన పాల్ వెండర్ బృందం ఎట్టకేలకు ఔషధాన్ని తయారుచేయగలిగింది. అయితే ప్రకృతిసిద్ధమైన ప్రొస్ట్రాటిన్‌ను ప్రయోగశాలలో రకరకాల మార్పులకు గురిచేసిన తర్వాతే దానిని తాము వంద రెట్లు శక్తిమంతంగా మార్చగలిగామని వెండర్ పేర్కొన్నారు. బ్రయోజోవా నుంచి తీసిన బ్రయోస్టాటిన్‌ను కూడా వెయ్యిరెట్లు శక్తిమంతంగా తయారుచేశామని, హెచ్‌ఐవీని తరిమేయడంలో అది ప్రొస్ట్రాటిన్ కన్నా మేలైనదన్నారు.  

 కేన్సర్, అల్జీమర్స్ వ్యాధులకూ చికిత్స...
 మనిషి వేళ్ల మాదిరిగా ఉండే ‘బ్రయోజోవా’ నుంచి సేకరించిన బ్రయోస్టాటిన్ రసాయనం కేన్సర్, అల్జీమర్స్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడనుందని వెండర్ చెబుతున్నారు. బ్రయోస్టాటిన్‌తో కొన్ని జంతువులకు చికిత్స చేయగా.. అవి విషయాలను  ఎక్కువకాలం గుర్తుంచుకోగలిగాయట. దీంతో మతిమరుపు, ఇతర లక్షణాలుండే అల్జీమర్స్ చికిత్సకూ దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
 
 తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!
 తేనెటీగ విషంలోని మెలిటిన్ పదార్థంతో హెచ్‌ఐవీ నిర్మూలనకు ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు ‘వాషింగ్టన్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. హెచ్‌ఐవీ సోకకుండా నివారించే జెల్‌తోపాటు మందును కూడా మెలిటిన్‌తో తయారుచేయవచ్చట.

 ఎక్కువ మొత్తంలో ఉంటే శరీర కణాలకు హాని చేసే మెలిటిన్‌ను అత్యంత సూక్ష్మ పరిమాణంలోని నానోపార్టికల్స్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడితే.. హెచ్‌ఐవీ కణాలకు అతుక్కుని వాటి చుట్టూ ఉండే రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తుందట. ఇంకేం.. రక్షణ కవచాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేక హెచ్‌ఐవీ  అంతమైపోతుందన్నమాట.

sakshi
Continue Reading | comments

ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను

Sunday, September 8, 2013

ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను
sakshi :

హైదరాబాద్ :  ఇంతెత్తున ఉంటాడు.
 చక్కగా నవ్వుతాడు.
 వాయిస్ బాగుంటుంది.
 ఒక టైమ్‌లో...
 అమ్మాయిలకు బాగా నచ్చేసిన హీరో...
 జగపతిబాబు.
 బ్యాడ్ లక్.
 ఇప్పుడా హీరో లేడు. విలనైపోయాడు!
 ఫస్ట్ టైమ్, ఫుల్‌లెంగ్త్ నెగటివ్ రోల్‌లో...
 కనిపించబోతున్నాడు.
 నో ఇష్యూస్. అది క్యారెక్టర్.
 అసలైతే జగపతిబాబు ‘బ్యాడ్ బాయ్’ అనేవాళ్లున్నారు!
 అవునా?
 రిచ్‌గా ఉన్నాడు. డబ్బు పోయింది.
 అది బ్యాడా?!
 మనుషుల్ని నమ్మాడు. నమ్మకం పోయింది.
 అది బ్యాడా?
 ఇంకా ఏవేవో అంటారు ఆయన గురించి.
 అయితే ఎన్ని ‘బ్యాడ్స్’ ఉన్నా...
 వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసే గుడ్ ఒకటి...
 ఆయనలో ఉంది.
 అదే... ఇంటెగ్రిటీ! నిజాయితీ.
 జగపతిబాబు దాచుకున్నది లేదు.
 తన గురించి దాచిపెట్టిందీ లేదు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 ఆయన  మీకు ఇంకా బాగా నచ్చేస్తారు.


 వీబీ రాజేంద్రప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత కొడుకు మీరు... అంతా గోల్డెన్ స్పూన్ లైఫ్ అనుకుంటా...!
 జగపతిబాబు: అలా ఏం లేదండీ. పుట్టింది గోల్డ్‌స్పూన్‌తో అయినా, పెరిగిందంతా నార్మల్‌గానే! మా నాన్నగారిది పెద్ద సర్కిల్. మద్రాసులో అక్కినేని నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు, రామానాయుడుగారు, గుమ్మడిగారు, మేము పక్కపక్క ఇళ్లవాళ్లం. వాళ్ల పిల్లలు, మేము మంచి ఫ్రెండ్స్. సురేష్, వెంకటేష్, వెంకట్, నాగార్జున, గుమ్మడిగారబ్బాయి సత్తి, శివాజీగణేశన్‌గారబ్బాయిలు రామ్, ప్రభు, మొన్న చనిపోయిన జెమిని రవిశంకర్.. ఇలా అందరం కలిసి ఆడుకునేవాళ్లం. నేను ప్రపంచాన్ని చూసింది వీళ్లతోనే. లోకల్ బీచ్‌కెళ్లినా, ఫస్ట్ టైమ్ సింగపూర్ వెళ్లినా వీళ్లతోనే. సర్కిల్ పెద్దదే అయినా అమ్మ నిరాడంబరంగా పెంచింది. మేం ముగ్గురు అబ్బాయిలం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ నడుచుకుంటూ వెళ్లి, రెండు బస్సులు మారి స్కూల్‌కి, ఎలక్ట్రిక్ ట్రెన్‌లో కాలేజ్‌కీ వెళ్లేవాళ్లం. బస్ టికెట్‌కి పోగా మిగిలిన 60 పైసలతో ఒక పరోటా తినేవాణ్ణి.

 స్కూల్ డేస్ గురించి...

 జగపతిబాబు: నాకు చదవడం అంటే పెద్ద భారం. స్కూల్ అంటే అసహ్యం. ఒక గదికి పరిమితం చేస్తే నేనస్సలు ఉండలేను. అందుకే క్లాస్‌రూమ్‌ను తల్చుకుంటే స్కూల్‌కి వెళ్లబుద్ధయ్యేది కాదు. స్వేచ్ఛని ఇష్టపడే మనస్తత్వం నాది. ఇది చెయ్యి.. అలా చెయ్యి అంటే నావల్ల కాదు. చదువు ఇంపార్టెన్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. లక్కీగా ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను కాబట్టి ఇంగ్లిష్ వచ్చింది. అది అడ్వాంటేజ్ అయ్యింది.

 ఎంతవరకూ చదువుకున్నారు?
 జగపతిబాబు: బీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చదవడం ఇష్టం లేదు. దాంతో వైజాగ్‌లో మా నాన్నగారి ఫర్నీచర్ షోరూమ్‌లోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా చేరాను. అక్కడ లేబర్‌వర్క్ కూడా చేశాను. చెయ్యనంటే చదివిస్తారేమోనని భయం. అందుకే ఆ జాబ్ హ్యాపీ అనిపించింది.

 మరి.. హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది?
 జగపతిబాబు: మా షోరూమ్‌కొచ్చినవాళ్లు ‘హీరో’గా చేయొచ్చుగా అంటుండడంతో, మెల్లగా నాలో కూడా ఆ ఆలోచన మొలకెత్తడం మొదలైంది. అది నాలో బలంగా వేళ్లూనుకున్నాకనే ఇంట్లోవాళ్లకి నా అభిలాష గురించి చెప్పాను. పెద్ద నిర్మాత కొడుకుని కాబట్టి... ఆ పరపతిని ఉపయోగించి అవకాశాలు తెచ్చుకోవాలని మాత్రం అనుకోలేదు. నాన్నగారు కూడా అందుకు వ్యతిరేకం.

 మొదట్లో మీ గొంతు బాగాలేదని విమర్శలొచ్చాయి. మీ పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు కూడా. అప్పుడెలా అనిపించింది?
 జగపతిబాబు: నా వాయిస్ మీద నాకెప్పుడూ డౌట్ లేదు. ఇక్కడో ఉదాహరణ చెబుతా. సినిమాల్లోకొచ్చిన కొత్తలో అమితాబ్ బచ్చన్‌ని చాలామంది విమర్శించారు. హీరో మెటీరియల్ కాదన్నారు. ఇంత పొడవేంటి? అన్నారు. కానీ అమితాబ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. నేను ఆయనంతటివాణ్ణి కాదుకానీ, జస్ట్ ఉదాహరణగా చెప్పాను. నన్ను రిజెక్ట్ చేసినప్పుడు ఫీలవ్వలేదు. ఎవరైతే నా వాయిస్‌ని విమర్శించారో, వాళ్లే ఆ తర్వాత ప్లస్ అన్నారు. హీరోగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నా.

 మిమ్మల్ని హీరోని చేసే ప్రయత్నంలో మీ నాన్నగారు నష్టపోయారు కదా. ఆ సమయంలో ఏమనిపించింది? వెనక్కి వెళ్లిపోదామనుకున్నారా?
 జగపతిబాబు: నాకు జీవితాన్ని చదవడం ఇష్టం. ఆ చదివే క్రమంలో ఎదురుదెబ్బలు తట్టుకునే స్థయిర్యం ఏర్పడింది. ఏదో రెండు మూడు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన పారిపోయేంత పిరికివాణ్ణి కాదు నేను. నాన్నగారు నాతో ‘సింహస్వప్నం’, ‘అడవిలో అభిమన్యుడు..’ సినిమాలు తీశారు. కోటిన్నర పోయింది. అప్పులు కట్టడానికి మా ఇంటిని 45 లక్షలకు అమ్మేశారు. అప్పుడు మాత్రం బాధపడ్డాను.

 హీరోగా ఓ రేంజ్‌కొచ్చాక.. సడెన్‌గా డౌన్‌ఫాల్ అయ్యారు. కెరీర్ ప్లానింగ్‌లో లోపమా?

 జగపతిబాబు: మీరన్నది కరెక్టే. నా లైఫ్‌ని, కెరీర్‌ని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. ఇది ఫిలాసఫీ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. మొదటినుంచీ నా మైండ్‌లో ఉన్నది ఒక్కటే. మనం ఎప్పుడు పుడతామో తెలియదు.. ఏ క్షణాన చచ్చిపోతామో తెలియదు. మధ్యలోదంతా ఇంటర్వెల్. అంతా రాసి పెట్టి ఉంటుందని, మన చేతుల్లో ఏమీ ఉండదని, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందనీ నమ్ముతాను. అందుకే ప్లానింగ్ లేకుండా వెళ్లిపోతుంటా.

 ఎంత రాసి పెట్టి ఉన్నా, మానవ ప్రయత్నం ఉండాలిగా..!
 జగపతిబాబు: అది కూడా రాసి పెట్టే ఉంటుంది!

 అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
 జగపతిబాబు: కామన్‌సెన్స్‌తో చెబుతున్నా. నేను చాలా పీక్‌లో ఉన్నప్పుడు ‘మీరు గొప్ప నటుడు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ’ అని కొంతమంది అంటే, పొంగిపోలేదు. ‘ఇప్పుడు నా టైమ్ బాగుంది కాబట్టి అభినందిస్తున్నారు. ఒకవేళ నా టైమ్ బాగాలేదనుకోండి అప్పుడు నన్ను గొప్ప నటుడనరు. కానీ నేను అప్పుడూ అదే జగపతిబాబు.. ఇప్పుడూ అదే జగపతిబాబు.

 అంటే.. టైమ్‌ని నమ్ముతారా?
 జగపతిబాబు: వందశాతం నమ్ముతా. నా కెరీర్‌లో గుడ్, బ్యాడ్ రెండు టైమ్‌లూ ఉన్నాయి. ఈ మధ్య బ్యాడ్‌టైమ్‌లో ఉన్నా. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మంచి టైమ్ ఇప్పుడొచ్చింది. విలన్‌గా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాలో అవకాశం వచ్చింది. మంచి పారితోషికం. ఒకవేళ ఇదే కేరక్టర్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే కొన్ని చెత్త సినిమాలు చేసి ఉండేవాణ్ణి కాదు. అప్పుడు టైమ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి చేయకూడని సినిమాలు చేశానేమో. ఇప్పుడు టైమ్ బాగుంది కాబట్టి ఒకేరోజులో ఈ సినిమా ఓకే అయింది.

 సో... ఇప్పుడు విలన్‌గా చేయడం ఎలా అనిపిస్తోంది?
 జగపతిబాబు: ఎవరైనా హీరోగా చేయడానికే ఇష్టపడతారు. కానీ ఇంతకాలం విలన్లను నేను కొట్టాను... ఈసారి నన్ను కొట్టే అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు లొకేషన్లో బాలకృష్ణగారు వస్తుంటే, అందరూ ‘హీరోగారు వస్తున్నారు’ అంటారు. అప్పుడు కొంచెం కలుక్కుమంటుంది. ఎందుకంటే పాతికేళ్లుగా నా షూటింగ్ లొకేషన్లో హీరో అంటే నేనే! ఇప్పుడు విలన్ అంటారు. హీరో అనే ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ అవ్వడం నేర్చుకోవాలి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. అందుకని ఇలాంటి వాటినుంచి త్వరగా బయటపడగలుగుతున్నాను.

 ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మీరు పూర్ అని టాక్ ఉంది..?
 జగపతిబాబు: కరెక్టే! ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంవల్లే నా లైఫ్ గాడి తప్పింది. ఈ కారణంగా మానసికంగా చాలా నలిగిపోయిన మాట వాస్తవం. షూటింగ్ లేక ఇంటిపట్టున కూర్చున్నప్పుడు బాధపడ్డాను. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందనే రకం నేను. అలాగని ఏం చేయకుండా ఇంట్లో కూర్చోలేదు. నా ప్రయత్నాలు నేను చేశా. అయినా ఇప్పుడేమైంది? లక్కీగా నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇంకా బోల్డన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా. హీరోగా, విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా... ఏదైనా చేయగలను. నేను పోగొట్టుకున్న డబ్బు మళ్లీ సంపాదించుకుంటాను.

 దేవుణ్ణి నమ్ముతారా?
 జగపతిబాబు: ప్రస్తుతానికి నేను భక్తుణ్ణి కాదు. దేవుడు ఉన్నాడని అనను. లేడని కూడా చెప్పను. రేపు టైమ్ వేరే విధంగా ఉందనుకోండి భక్తుణ్ణి అవ్వొచ్చేమో. సో.. భక్తి కలగడం కూడా టైమ్‌ని బట్టే ఉంటుందనుకుంటా!

 ‘జగపతిబాబు’కి ఇగో ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. ఎందుకా ఇమేజ్ తెచ్చుకున్నారు?
 జగపతిబాబు: నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నేను విలన్‌గా చేస్తున్నానని నన్ను వేరే రకంగా ట్రీట్ చేయొద్దు. నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వాలని ముందే చెప్పా. అంతే తప్ప లొకేషన్‌కి వెళ్లి సరిగ్గా ట్రీట్ చేయలేదని గొడవపడను. ఇలా ఏదైనా ముందే ఓపెన్‌గా చెప్పేస్తా. అది ఇగో అంటే నేనేం చేయగలను? నేనెవరి దగ్గర్నుంచీ ఏమీ ఎదురు చూడను. నా లైఫ్ నేను బతుకుతున్నాను. ఎవర్నీ నమ్మను. ఇవాళ్టి ప్రపంచంలో దాదాపు దొంగలే ఉన్నారు. అయితే ఒక్కటి.. ఎవరో మోసం చేశారని నేను ఫీలవ్వడంలేదు. మోసపోవడానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చాం? అనుకుంటాను.

 మీ మాటల్ని బట్టి... చాలామందిని నమ్మి మోసపోయారనిపిస్తోంది...
 జగపతిబాబు: ఫైనాన్షియల్‌గానే మోసపోయాను. పేర్లు అనవసరం. మనుషులను నమ్మకపోతే ఎవర్ని నమ్మాలి? అనుకునేవాణ్ణి. కొన్ని చేదు అనుభవాల వల్ల ఆ అభిప్రాయం మారింది. బేసిక్‌గా హార్ట్‌ని నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు నోట్లని నమ్మాల్సి వస్తోంది. మన దగ్గరకు ఎంతోమంది వస్తారు. వీణ్ణి దోచేద్దామని స్కీమ్ వేసుకుని వచ్చేవాళ్లని కనిపెట్టలేం. ఆ పరంగా చాలా మోసాలు జరిగాయి. అప్పట్నుంచి నమ్మకం పోయింది. మనల్ని మనం కాపాడుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి కొంత టైమ్ పట్టింది. మళ్లీ టైమ్‌కే వస్తున్నా కదా! (నవ్వుతూ)

 మీ లైఫ్‌స్టయిల్ కూడా చాలా లగ్జరీగా ఉంటుందట?
 జగపతిబాబు: అవును. జనరల్‌గా లగ్జరియస్‌గా ఉంటాను. డబ్బుంటే బయటికెళ్లి ఖర్చుపెడతాను. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను.

 మోసపోవడంతో పాటు గోవాకెళ్లి కెసినోలు ఆడటం వల్ల కూడా మీ ఆర్థిక పరిస్థితి తారుమారయ్యిందని వినికిడి...
 జగపతిబాబు: గోవా మాత్రమే కాదు. లాస్‌వేగాస్ కూడా వెళ్లాను. అయితే అక్కడకు వెళ్లడంవల్లే ఆస్తులు పోయాయనడం కరెక్ట్ కాదు. నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెళ్తాను.  వాళ్లు పోగొట్టిన డబ్బులు కూడా నా అకౌంట్లో వేస్తే ఎలా? కెసినోల్లో మహా అయితే 30 లక్షలు పోగొట్టి ఉంటానేమో! దానివల్లే ఆస్తులు కరిగిపోవుగా!

 కెసినోలంటే ఎందుకంత క్రేజ్?
 జగపతిబాబు: ఆడటం అనేది ఒక పాయింట్ మాత్రమే. నాకు అక్కడి వాతావరణం చాలా ఇష్టం. చాలా రిచ్‌గా ఉంటుంది. లాస్‌వేగాస్‌లో అమ్మాయిలు చాలా బాగుంటారు. పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. లక్షలు తెచ్చి ఆడుతుంటారు. వాళ్ల గెలుపు, ఓటములు చూడటం కూడా నాకో ఇంట్రస్ట్. అలాగే అమ్మాయిలు ట్రేల్లో డ్రింక్స్ పెట్టుకుని, స్టయిల్‌గా నడుచుకుంటూ వచ్చి సర్వ్ చేస్తుంటే చూడటం ఇష్టం. అన్ని టేబుల్స్ తిరిగి చూసేవాణ్ణి. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి.

 పెళ్లయ్యి, ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మీరు.. ఇలా ఎంజాయ్‌మెంట్ కోసం గోవా, లాస్‌వేగాస్ వెళ్లడం కరెక్టేనా?
 జగపతిబాబు: ఓ రెండు మూడేళ్లు ఆలోచించలేదు... ఇప్పుడు ఆలోచిస్తున్నా! ఆర్థికంగా కూడబెట్టుకోలేదనే పశ్చాత్తాపం ఉన్నప్పటికీ లైఫ్‌ని ఎంజాయ్ చేశాననే సంతృప్తి ఉంది. నా సంపాదన నా కోసం కూడా. నా ఆనందాలను త్యాగం చేసేస్తే ఇంట్లోవాళ్ల మీద నిరాశా, నిస్పృహలు తప్ప ప్రేమ ఉండదు.

 ‘అమ్మాయిల మానస చోరుడ’నే బ్రాండ్ ఇమేజ్ మీపై బాగా ఉన్నట్టుంది?
 జగపతిబాబు: (నవ్వేస్తూ) ఎవరికి వాళ్లు అలా నాపై బ్రాండ్ వేసేశారు. నిజం చెప్పండి... అందమైన ఆడవాళ్లను ఏ మగాడు ఇష్టపడడు? నాకు ఆడవాళ్లంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. వాళ్ల సమక్షాన్ని ఆస్వాదిస్తాను. ఆడవాళ్ల సమక్షం అంటే ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరంలేదు. వాళ్లతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా కొంతమందితో క్లోజ్‌గా అసోసియేట్ కావడం వల్లనో ఏమో నాకు అలాంటి ఇమేజ్ వచ్చేసింది. అలాగని నేను అందరితోనూ క్లోజ్‌గా మూవ్ కాను. బేసిగ్గా ముందు నాకా మనిషి నచ్చాలి. నచ్చడమంటే అందం ఒక్కటే కాదు. వ్యక్తిత్వం కూడా. ఆత్మవిశ్వాసం కనబరిచే ఆడవాళ్లను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌ని బాగా లైక్ చేస్తాను.

 సౌందర్య కారణంగా మీ వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు వచ్చాయని అప్పట్లో ఓ వార్త వచ్చింది. సౌందర్యను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట?
 జగపతిబాబు: అది పచ్చి అబద్ధం! నాకూ సౌందర్యకు చాలాసార్లు ముహూర్తం పెట్టారు. నా భార్యకే ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను, మా ఆవిడ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరో ఫోన్ చేసి, ‘పన్నెండున్నరకి సౌందర్యతో మీ పెళ్లని విన్నాము’ అన్నారు. అప్పుడు టైమ్ పన్నెండు పదయ్యింది. ఎవరో ఏదో ఊహించేసుకుని ఏదేదో చెప్పేస్తుంటారు. అఫ్‌కోర్స్ సౌందర్య నాకు చాలా క్లోజ్. తనెంత క్లోజో తన అన్నయ్య అమర్ కూడా అంతే క్లోజ్. ఆ విషయం బయటికి రాదు కదా. ఒకసారి నేనెవర్నో రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కెళ్లాను. అదే సమయంలో సౌందర్య ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. దాంతో సౌందర్య కోసమే వచ్చానని ప్రచారం చేశారు. సౌందర్య, అమర్ నాకు మంచి ఫ్రెండ్స్. ఓసారి నాకు 20 లక్షలు అవసరమైతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమర్ ఇచ్చాడు. ఆ తర్వాత నేను వెనక్కి ఇచ్చేశాను. మా మధ్య నమ్మకంతో కూడిన మంచి స్నేహం మాత్రమే ఉండేది. ఏదో కవర్ చేయడానికి నేనిలా చెప్పడంలేదు. నిజం చెప్పాను. ఇక్కడ బోయ్, గాళ్ అని కాదు.. ఫ్రెండ్‌షిప్ అనేది ఒకటుంటుంది. కానీ దాన్ని దాటేసి ఆలోచిస్తారు. అదే ప్రాబ్లమ్!

 సౌందర్య మరణ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది?

 జగపతిబాబు: అప్పుడు మలేసియాలో ఉన్నాను. మా అన్నయ్య ఫోన్ చేసి, ‘బ్యాడ్ న్యూస్... సౌందర్య చనిపోయింది’ అన్నాడు. నేనేమీ అనలేదు. ‘అమర్ కూడా చనిపోయాడా? చనిపోయి ఉంటే ఫోన్ చేయొద్దు’ అన్నాను. నాకు తెలుసు... అమర్ కూడా చనిపోయి ఉంటాడని! ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధం అలాంటిది.

 మీ మీదున్న ఇమేజ్ కారణంగా, సౌందర్య విషయంలోనూ మీ భార్య ఎప్పుడూ అభద్రతాభావానికి గురవ్వలేదా?
 జగపతిబాబు: ఫీలయ్యిందో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. పెళ్లప్పుడు నేను తనతో ఒకటే చెప్పాను. ‘సినిమా ఇండస్ట్రీ అంటే ఎఫైర్లు ఉంటాయి. నువ్వు మెంటల్లీ ప్రిపేర్ అయితేనే ఇండస్ట్రీకి వెళతాను. లేకపోతే లేదు’ అని! ‘ఎక్కడికైనా వెళ్లండి.. కానీ ఇంటికి రండి’ అని కూల్‌గా చెప్పింది తను. అప్పుడప్పుడూ ఎవరైనా ఫీలవుతారు. నేను తనను బాగా చూసుకుంటాను. తను కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. అంత అర్థం చేసుకునే భార్య లభించడం ఏ హీరోకైనా అదృష్టం. ఫైనాన్షియల్‌గా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మా మధ్య ఏదైనా చిన్నపాటి డిస్కషన్స్ జరిగి ఉంటాయేమో కానీ.. పెద్ద పెద్ద డిస్కషన్లు జరగలేదు.

 మీది ఎరేంజ్డ్ మ్యారేజా? లవ్వా?
 జగపతిబాబు: లవ్ మ్యారేజే! అయితే పెద్దలను ఒప్పించే ప్రక్రియలో చిన్నపాటి చర్చలు కూడా జరిగాయి. సరిగ్గా అప్పుడు నేను వైజాగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఖాళీ దొరికితే పిట్టగోడమీద పడుకుని వాక్‌మాన్ పెట్టుకుని పాటలు వినేవాణ్ణి! కొండలు, చెట్లు.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దాంతో పాటలు వింటుంటే, నిద్ర పట్టేసింది. నిద్రలో మంచం మీద పక్కకు తిరిగినట్లుగా తిరిగా. అంతే.. 30 అడుగుల పైనుంచి కిందపడిపోయా. బాగా దెబ్బలు తగిలాయి. నేను అలా పడిపోవడాన్ని మా నాన్నగారు వేరేలా అర్థం చేసుకున్నారు. ప్రేమకోసం ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాననుకుని, పెళ్లికి ఒప్పుకున్నారు. భలే కనెక్ట్ అయ్యిందనుకుని, నేను కూడా సెలైంట్ అయిపోయా.

 ఫాదర్‌గా మీరెంతవరకు బెస్ట్?
 జగపతిబాబు: నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ. ఫాదర్‌లా ఉండను. ఫ్రెండ్‌లా ఉంటాను. వాళ్లేం అడిగినా కాదనను. కానీ, ఫైనాన్షియల్ వైజ్‌గా నేను గుడ్ ఫాదర్ కాదు.

 ఫైనాన్షియల్ స్టేటస్ గురించి పిల్లలు ఏం అంటుంటారు?
 జగపతిబాబు: పెద్దమ్మాయి ఎప్పుడూ అనలేదు. చిన్నమ్మాయికి ఇప్పుడు పదిహేనేళ్లు. ఏమో.. రేపు ఎప్పుడైనా అంటుందేమో! నా పిల్లలు అడిగినదానికన్నా ఓ రూపాయి ఎక్కువే ఇస్తాను. అమెరికాలో చదువుకుంటానంటే ఓకే అన్నాను. ఆర్థిక ఇబ్బందులేమైనా ఉంటే ఆ బాధేదో నేను పడతాను కానీ నా పిల్లలకు తెలియనివ్వను. ఒకవేళ నాకేమైనా అయ్యిందనుకోండి.. అప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో నా పిల్లలకు కావాల్సిన సేఫ్టీ క్రియేట్ చేశాను. వాళ్ల భవిష్యత్తు సెక్యూర్టీ కూడా చూసుకున్నాను. నేనేం మరీ బాధ్యతారాహిత్యమైన ఫాదర్‌ని కాను. కాకపోతే జీవితం నేర్పిన పాఠాలవల్ల ఇప్పుడు ఖర్చు తగ్గించేశాను. జాగ్రత్తపడుతున్నాను. అయినా నా పిల్లలు కరెన్సీ గురించి ఆలోచించరు. ‘మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ’ అనే నమ్మకం వాళ్లకుంది. మా నాన్నను నేనెప్పుడూ డబ్బు అడగలేదు. చాలామంది ‘మా బాబు ఏం ఇచ్చాడు.. ఏమీ ఇవ్వలేదు’ అని తిట్టడం మా బంధువులో కూడా చూశాను. వాళ్లని తెగ తిట్టేవాణ్ణి.

 మీరు సిగరెట్లు బాగా కాలుస్తారు కదా..!
 జగపతిబాబు: అవును. అది తప్పే. నాకా విషయం తెలుసు. నన్ను చూసి నా అభిమానులూ ఫాలో అవుతారనీ తెలుసు. ‘అంతఃపురం’ చూసి చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. అది గొప్పగా అనిపించలేదు... బ్యాడ్‌గా ఫీలయ్యాను.

 అసలెప్పుడు అలవాటయ్యింది?
 జగపతిబాబు: మా మామయ్య కాల్చేసిన చుట్టతో మొదలైంది. అది అలవాటుగా మారిపోయింది. నేనెప్పుడూ రాడికల్. ఎంత రాడికల్ అంటే.. ఎక్కడైనా టైస్టులు ఉన్నారని తెలిస్తే, వాళ్లని చూడ్డానికి వెళ్లేవాణ్ణి. పోలీసుల గన్ ఫైరింగ్‌ని స్వయంగా చూసినవాణ్ణి. అన్నీ చూడాలనుకుంటాను. అన్నీ ట్రై చేయాలనుకునే మనస్తత్వం. అన్ని ఆశ్రమాలకు వెళ్లాను. హిమాలయాలకు వెళ్లాను. ధ్యానం చేశాను. ఈ మొత్తం ఒక రౌండ్ చూసేశాను.. చేసేశాను. ఇక చాలని ఫిక్స్ అయ్యాను.

 ఎప్పుడైనా సిగరెట్ మానడానికి ట్రై చేశారా?
 జగపతిబాబు: చాలా ప్రయత్నం చేశాను. కొకైన్, హెరాయిన్ అన్నిటికన్నా సిగరెట్ చాలా వరస్ట్ డ్రగ్. అందుకే దానికి దూరంగా ఉండాలనుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో సిగరెట్ మాన్పించడానికి ఏదో రేడియాలజీ చేస్తున్నారని విని, వెళ్లాను. దాదాపు 20, 30 లక్షలు ఖర్చు పెట్టాను. అక్కడా మోసమే ఎదురైంది. డబ్బులు పోయాయి కానీ నా సిగరెట్ నాకు వెనక్కొచ్చేసింది (నవ్వుతూ).

 మిమ్మల్ని కొంతమంది నిర్మాతలు శాటిలైట్ రైట్స్ కోసం వాడుకుని, సినిమాలు చేశారు. అలా వాడుకుంటున్నారని మీరు గ్రహించలేదా? లేక డబ్బు కోసం చేశారా?
 జగపతిబాబు: నాకంత దూరపు ఆలోచన ఉండదు. ఎంత శాటిలైట్ హక్కులు వస్తాయో కూడా ఊహించేవాణ్ణి కాదు. ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు చేయొచ్చు కదా అనుకున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే డబ్బుల కోసమే చేశానని చెప్పొచ్చు.

 అడగనిదే అమ్మయినా పెట్టదంటారు కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరినైనా అవకాశాలు అడిగారా?

 జగపతిబాబు: నేను పరిశ్రమకు వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లయ్యింది. ఇప్పటివరకు ఏ సినిమా ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు అడగలేదు. నాతో సినిమా చేయాలనుకున్నవాళ్లు ఎలానూ చేస్తారు. చేయాలనుకోనివాళ్లు అడిగినా చెయ్యరు. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ దగ్గర ఇదే విషయం గురించి చర్చ వచ్చింది ‘‘నేను నీకు బాగా తెలుసు కదా.. నన్ను ఛాన్స్ అడగవు ఎందుకని?’’ అన్నాడు రాము. దానికి సమాధానంగా నేను ‘రామూ... నువ్వు మంచి డెరైక్టర్. ఒక మంచి డెరైక్టర్‌కి కళాకారుడు కనబడితే, ఏ మూల దాగున్నా తనే వచ్చి అడుగుతాడు. ఒకవేళ నేను అడిగి, నువ్వు అవకాశం ఇస్తే.. నీమీద నాకు మర్యాద పోతుంది. అదే ఓ కళాకారుడ్ని గుర్తించి నువ్వు సినిమా చేశావనుకో.. అప్పుడు నాకు గౌరవం ఉంటుంది’’ అన్నాను. ఫైనల్‌గా నేను ‘గాయం’ కి సూట్ అవుతానని తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతా... ఎలాగైనా అవకాశాలు కొట్టేయాలని మందు అలవాటున్న నిర్మాతలకు అది ఆఫర్ చేసి, వీక్ మూమెంట్‌లో అవకాశం అడగొచ్చు. నాకది ఇష్టం ఉండదు. షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత బిజినెస్ మాట్లాడను. మందు కొట్టిన తర్వాత అస్సలు మాట్లాడను. ఒకరి వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకునే మనస్తత్వం కాదు నాది. అలా చేస్తే అది ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క అని నా అభిప్రాయం.

 జగపతిబాబుకి అహం ఎక్కువన్నా ఫర్వాలేదు. నేను మాత్రం ఎవర్నీ అవకాశాలు అడగను. ముక్కుసూటిగానే మాట్లాడతాను. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. అబద్ధం ఆడాలంటే తెలివి ఉండాలని ఆ మధ్య ఏయన్నార్‌గారు అన్నారు. ఆ మాటలు నిజం. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకే అబద్ధం ఆడకపోవడమే బెటర్. నిజాయితీగా బతకడంలో ఓ ఆనందం ఉంది. జగపతిబాబు ఎప్పుడూ అలానే బతికాడు... బతుకుతాడు!

 - డి.జి. భవాని

 సుస్మితాసేన్ మా ఫ్యామిలీలో ఓ మెంబర్ అయ్యింది...
 మా ‘జగపతి’ బేనర్‌పై సినిమాలు తీసే ఆలోచనే లేదు. ఎందుకంటే నాన్నగారిలా నేను కూడా బ్యాడ్ బిజినెస్‌మేన్. హాయిగా నిర్మాతలు వచ్చి డబ్బులిస్తుంటే, యాక్ట్ చేయడం సుఖం.

 మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరికీ డబ్బు పిచ్చి లేదు. మా పెద్ద అన్నయ్య రామ్‌ప్రసాద్ మనీ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్. రెండో అన్నయ్య యోగేంద్రకుమార్ అచ్చం నాలానే ఉంటాడు. నా టైపే.

 మా పెద్దమ్మాయి మేఘన అమెరికాలో, చిన్నమ్మాయి లేఖ పుణెలో చదువుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్నకు బెంజ్ కారు ఉంది.. అంటూ పోటీలు పడటం, పనోళ్లను ఒరేయ్ అరేయ్ అనడం... ఇవన్నీ నాకు నచ్చదు. అందుకే అక్కడికి పంపించాను. మనుషులను ఎలా గౌరవించాలి? లాంటి ఎన్నో విలువలను నేర్పించే ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుతున్నారు.

 మా అన్నయ్య రామ్‌ప్రసాద్‌కి సుస్మితాసేన్ మంచి ఫ్రెండ్. నాగార్జున ద్వారా అన్నయ్యకు తనతో పరిచయం అయ్యిందనుకుంటా. అలా మా ఫ్యామిలీ అందరితో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బేసిక్‌గా తను చాలా నైస్ పర్సన్. సింపుల్‌గా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు తను మా ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా అయ్యింది.

 చిన్నప్పుడు గోలీ సోడా బాగా తాగేవాణ్ణి. ఒక్క సోడా ఖరీదు పది పైసలుండేది. గోలీ సోడా కొడుతుంటే ఆ సౌండ్ భలే ఉంటుంది.

 పెళ్లనేది ఓ మంచి అనుబంధం. నేను కట్నానికి వ్యతిరేకం. నేను తీసుకోలేదు. ఒకవేళ నాకు కొడుకులు ఉండి ఉంటే కట్నం తీసుకోనిచ్చేవాణ్ణి కాదు. దమ్మున్న మగాడైతే నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. తండ్రి ఇస్తాడని, భార్య తెస్తుందని ఎదురు చూడకూడదన్నది నా అభిప్రాయం.

 భూమిలో పాతిపెట్టి మర్చిపోయారు
 నాకు ధ్యానం చేయడం ఇష్టం. ‘జగపతి’ సినిమా అప్పుడు నన్ను కాపాడింది అదే. శవపేటికలో నన్ను పెట్టి, దానిపైన కళ్యాణమండపం సెట్‌తో షూటింగ్ ప్లాన్ చేశాం. భూమిలో నిజంగానే నన్ను పాతిపెట్టమన్నాను. ఆ సీన్ చేయడానికి నేనే ఒప్పుకున్నాను. మూడు టేక్స్‌కి కానీ సీన్ ఓకే అవలేదు. ఆ టేక్స్ తర్వాత, మండపం సెట్ తీసేశారు. కానీ, నన్నెక్కడ పాతిపెట్టారో మర్చిపోయారు. దాంతో టెన్షన్‌తో తవ్వడం మొదలుపెట్టారు. లోపల ఆక్సిజన్ లేదు. సిలిండర్ కొనమంటే, మా నిర్మాత కొనలేదు. నాకు ధ్యానం చేసే అలవాటుంది కాబట్టి, శ్వాసను ఓ పద్ధతిలో పీల్చి వదలడం మొదలుపెట్టాను. దానివల్ల ప్రాణాపాయం నుంచి బయటపట్టాను. నేను లోపల అలా శ్వాస తీసుకుంటుంటే, ఈలోపు నన్ను పాతిపెట్టిన ప్లేస్‌ని యూనిట్ సభ్యులు గుర్తుపట్టి, బయటకు తీశారు. నేను జాతకాలను పెద్దగా నమ్మను. కానీ ఆరోజు ఒకావిడ ఫోన్ చేసి, ‘మీరు బాగానే ఉన్నారా?’ అనడిగారు. బాగానే ఉన్నానని చెప్పాను. ‘మీకు మరణగండం ఉంది.. అందుకే అడిగా’ అన్నారావిడ.
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger