Showing posts with label articles. Show all posts
Showing posts with label articles. Show all posts

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు

Friday, January 31, 2014


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?

Tuesday, January 28, 2014

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ తీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యమాలను పట్టించుకోకుండానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టడానికి దేశ రాజధానిలో చకచకా పావులు కదుపుతోంది. ఫిబ్రవరి తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 
పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 తేదిన తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి జైరాం రమేశ్  ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
sakshi
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు అని సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది.
Continue Reading | comments

ఆఖరికి ఆ బాటలోకే!

ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో మొదట తీర్మానం చేసి, ఆ తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ ఆదినుంచీ వ్యతిరేకి ంచాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసివచ్చింది!

 ‘విభజించు-పాలించు రాజకీయాల వల్ల ఉపఖండం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. కలసి పని చేయలేకపోతే ఏదీ సాధించలేం. చర్చలూ, అంగీకారంతోనే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యం లక్షణం’
 - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

 ‘రిపబ్లిక్ డే’ (జనవరి 26, 2014) సందేశం
 ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ పేరుతో తెలుగుజాతిని చీల్చడానికి యూపీఏ నేడు ఆడుతున్న నాటకం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గణతంత్ర దినోత్సవంలో ఇచ్చిన సందేశంతో బట్ట బయలయిందని భావించాలి! అసలు రాష్ట్ర విభజన ‘బిల్లు’ అనేది ఉద్దేశిత ‘బిల్లా’ లేక ‘ముసాయిదా బిల్లా’ అన్నది శాసన సభలో తలెత్తిన తాజా వివాదం! కేంద్రంలో ఒకడు ఇది ‘ముసాయిదా’నే అంటాడు, మరొకడు ‘ఏబ్బే! అసలు బిల్లే’’ అంటాడు! ఈ మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులకి ‘ఇది బిల్లు కాదు, ముసాయిదా బిల్లు మాత్రమే’నన్న జ్ఞానోదయం కలిగింది.

 ఆలస్యంగా జ్ఞానోదయం
 విభజన బిల్లు అస్తవ్యస్తంగా ఉండటమే గాక, విభజనతో తలెత్తే సమస్యలకూ, ఆర్థిక వనరుల విభజనకూ సంబంధించిన ఏ ఒక్క అంశానికీ వివరణలూ, పరిష్కారాలూ చూపనందున తిప్పి పంపాలని ముఖ్యమంత్రి శాసన సభాపతికి లేఖ పంపి సంచలనం సృష్టించారు. కానీ ఈ పనిని ఆయన 40 రోజుల క్రితమే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ‘ముసాయిదా’గా కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ద్వారా పంపిన ఈ నిరర్థక బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలించకుండానే రాష్ట్రా నికి చేరడం పెద్ద విశేషం! విభజనను ముఖ్యమంత్రి నిజంగానే అడ్డుకొనదలచి ఉంటే ఇన్ని రోజులు కాలక్షేపం చేయకుండా ‘ముసాయిదా’కు సంబంధించి కేంద్రం చేసిన ఈ తీవ్ర తప్పిదాన్ని రాష్ట్రప్రజల దృష్టికీ, ఓ వ్యక్తిని ప్రధానిగా ప్రమోట్ చేయడం కోసం తెలుగు జాతిని విభజన హింసకు గురి చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికీ తెచ్చి ఉండాల్సింది.

 అసలు మోసం ఏదంటే -1950లో రాజ్యాంగం అవతరించినది లగాయతూ ఈ రోజు దాకా, ఎన్నడూ కీలకమైన ఒక బిల్లును చర్చ పేరిట ముసాయిదా రూపంలో ఏ రాష్ట్ర శాసనసభకూ పంపిన ఉదాహరణ లేదు. ఇది విభజనకు తొలి ఘట్టం. అయితే అదే లోక్‌సభ, రాజ్యసభల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉండటం మరో విశేషం. ఈ పరిస్థితీ, ఈ దుస్థితీ ఎందుకొచ్చాయి? వచ్చినది ఒరిజినల్ (అసలు) బిల్లు అయి ఉంటే దానిలో రాష్ట్ర విభజనను ఏ కారణాలపైన, ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో తలపెట్టారో సుస్పష్టమైన ప్రకటన ఉండాలి. ఏ బిల్లుైనైనా (అసలు ‘బిల్లే’ అయితే) పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లును అధికారికమైన ‘గెజిట్‌‘లో ప్రకటించాలని స్పీకర్ ఆదేశిస్తాడు. కానీ రాష్ట్ర విభజన కోసం వచ్చిన బిల్లు ‘ముసాయిదా’ (హోంశాఖ ప్రకటన ప్రకారం) మాత్రమే కాబట్టి, అదీ రాజ్యాడగ విరుద్ధంగా సవాలక్ష ‘లొట్ట’లతో మన శాసనసభకు వచ్చిన కాపీ కావడం వల్ల అది అసలు బిల్లు కాదని తేలిపోయింది!

 అంతేగాదు, ఈ బిల్లు లక్ష్య నిర్వచనం లేని పత్రం కావడం వల్ల, దానితో పాటు జత చేసి పంపించవల సిన శాసనాధికారాల బదలాయింపు, ద్రవ్య వ్యవహారాల మెమోరాండాలు కూడా లేవు! అందువల్ల ఈ ప్రత్యేక సంభారాలన్నింటినీ సమకూర్చుకున్న రూపంలో వచ్చిందే అసలు బిల్లు అవుతుంది. ముందు ‘ముసాయిదా’ అనీ, ఆ తరువాత తమకు తోచినట్టు ఏవేవో నిబంధనలూ, క్లాజులూ పరోక్షంగా చొప్పిం చవచ్చునని భావించి కేంద్రం పంపిన బిల్లు అసలు బిల్లు కాలేదు. ఇలాంటి ప్రయోగానికి తెలుగు జాతిని బలి చేయడం తగదని పాలకులు గ్రహించాలి.

 ముందే చెప్పిన వైఎస్సార్ సీపీ
 ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాల కన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొదట శాసనసభ తీర్మానం చేసిన తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను ముందు నుంచీ కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేకించాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసి వచ్చింది! ఇది బలాబలాలు చూసుకునే సమయం గానీ, ఎవరు ఎవరిని ‘సాధిం చా’లో లెక్కించుకునే వేళ కూడా కాదని దారితప్పిన రాజకీయ నాయకులూ, వారి పక్షాలూ గ్రహించాలి.

  పార్లమెంటులో ఈ అసమగ్ర బిల్లును ఆదరాబాదరా ప్రవేశపెట్టేసి చేతులు దులిపేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అది అంత తేలిక కాదు. రాజ్యాంగ ‘అధికరణ-3’ ప్రకారం నల్లేరు మీద బండిలాగా ‘విభజన’ ప్రక్రియను డొల్లించుకువెళ్లడం సాధ్యం కాదు. ఈ విష యాన్ని సుప్రీంకోర్టు (ఉత్తరాంచల్ వర్సెస్ శ్రీవాత్సవ కేసు-2003) ఒక తీర్పులో స్పష్టం చేసింది.  పార్లమెంటు అధికారం భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి మాత్రమే ఉండాలని సమున్నత న్యాయస్థానం చెప్పింది. చేసిన చట్టం రాజ్యాంగ పరిమితుల్ని అధిగమించి పోయినప్పుడు ఆ చట్టం సామంజ స్యాన్ని కోర్టులు ప్రశ్నించవచ్చని కూడా సుప్రీం చెప్పింది.

 పార్లమెంటు అధికారానికి సుప్రీంకోర్టు ఇన్ని పరిమితులు విధిస్తున్నా కేంద్ర ప్రభు త్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే కనీసం నెల రోజులు ముందుగానే నోటీసు ఇవ్వాలన్న నిబంధననూ ఉల్లంఘించిన సన్నివేశాలున్నాయి. ఆమాటకొస్తే, రాష్ట్రం సరిహద్దుల్నిగానీ, లేదా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంలో కలపవలసి వచ్చినప్పుడుగానీ లేదా భూభాగంలో ఏదైనా ముక్కను వేరు చేయాలనుకున్నాగానీ ఆ రాష్ర్ట శాసనసభ సంపూర్ణ ఆమోదాన్ని పొంది తీరాలన్న హక్కును, అధికారాన్ని 370 అధికరణతో ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించారు. మిగతా రాష్ట్రాల శాసన వేదికలకు ఆ హక్కూ, అధికారం లేకుండా చేశారు! కేంద్ర పాలక రాజకీయ పక్షాల రాజ్యాంగ ఉల్లంఘన జమ్మూ కాశ్మీర్‌తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎన్నో ఉల్లంఘనలు. పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర, రాష్ట్రాల పరిధిలోనూ, ఉమ్మడిగానూ రాజ్యాంగం విభజించిన అంశాల జాబితాలోని రాష్ట్రాల పరిధిని ‘249-అధికరణ’ చాటున కేంద్రం ఉల్లంఘిస్తూనే ఉంది!

 రాష్ట్రపతిని కూడా మోసగించగలరు
 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సాధికార సిఫారసులపైన ఏర్పడిన తొలి భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కూడా కృత్రిమంగా విభజించాలని కేంద్రం చూస్తున్నది. అలాగే 356-357 అధికరణల చాటున, కాంగ్రెస్ అధికారానికి అక్కడ మూడినప్పుడల్లా ‘రాష్ట్ర పాలన స్తంభించిపోయింది లేదా శాంతి భద్రతలు కొరవడ్డాయ’న్న మిషపైన రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. చివరికి ఈ ఉల్లంఘనకు (బొమ్మైకేసులో) 1994లో సుప్రీంకోర్టు ‘పిడి’ పడేదాకా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అందుకే కేంద్ర-రాష్ర్ట సంబంధాల పనితీరును సమీక్షించిన సర్కారియా కమిషన్ కూడా కాంగ్రెస్‌కు చెంపపెట్టు పెట్టవలసి వచ్చింది!

  చివరికి సుప్రీంకోర్టు అధికారాలను కుదించి కించపరచడానికి ఉద్దేశించిన 39-42వ అధికరణల ప్రవేశానికి కారకులు ఈ కాంగ్రెస్ పాలక శక్తులేననీ, వాటికి ‘ముగుదాడు’ వేసి నిర్వీర్యం చేసిన ఘనత సుప్రీంకోర్టుదేననీ మరచిపోరాదు! సప్త స్వాతంత్య్రాలను బంధించిన వ్యవస్థలో పత్రికా రంగం సహా అన్ని సంస్థలూ ఆనాడు ఎలా పతనమయ్యాయో మన ప్రత్యక్షానుభవం! చదవేస్తే ఉన్న మతి కూడా పోయిందన్నట్టుగా, 200 ఏళ్లలో అమెరికా రాజ్యాంగానికి 30 సవరణలు మాత్రమే రాగా, 1950లో భారత రాజ్యాంగం వచ్చింది మొదలు ఈ క్షణం దాకా 395 అధికరణలూ, 12 షెడ్యూళ్లు, 100కు మించిన సవరణలతో 64 ఏళ్లు గడిపేశాం. ప్రపంచంలో ఇంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన రాజ్యాంగం ప్రపంచంలో లేదు. అయినా రాజ్యాంగం పొడవైన కొద్దీ, పాలకుల బుద్ధి కురచైపోతోంది! ఇది, రాష్ట్రపతిని కూడా మోసగించగల రాజ్యవ్యవస్థ!  

sakshi
Continue Reading | comments

ఎన్‌టి‌ఆర్ పాత పత్రికా ఫోటోలతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై వై యస్ ఆర్ అభిమానుల ప్రచారం

Monday, January 27, 2014












 





































source: facebook

Continue Reading | comments

రాజకీయాల్లోకి రానున్న వారసురాలు

Sunday, January 26, 2014

రాజకీయాల్లోకి రానున్న వారసురాలుదీప
నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం ఈసారి వారసులతోనే నడిచేట్లుగా ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడు  గౌతంరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇక ఎన్నికలలో పోటీ చేయడమే ఆలస్యం.  మరో పక్క మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచనలతో పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇంకోపక్క బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె దీప కూడా 2014 ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ నిజమైతే నెల్లూరు జిల్లాలో ఈసారి వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతాయి.

వెంకయ్య నాయుడు -  జాతీయ స్థాయిలో ఓ పెద్ద నేత - నిత్యం జాతీయ నేతలో బిజీగా ఉంటారు - ఓ మాటల మాత్రికుడు - మీడియా ముందుకు వచ్చారంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏ భాషలోనైనా  ప్రాస తన్నుకొస్తుంది. ఆయన మాటల్లో విషయంతోపాటు ప్రాసకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన ఈ సారి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బిజెపి తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా నుంచి బిజెపి జాతీయ నేతగా ఎదిగిన  వెంకయ్యనాయుడు  1978లో, 1983లో రెండుసార్లు ఉదయగిరి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఆత్మకూరు నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి  ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అచ్చిరాలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా  ప్రజల ఆశీస్సులు  లభించలేదు. బాపట్ల, ఆ తరువాత హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.  వెంకయ్యకు బిజెపి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం.  జాతీయ నేతగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు. దాంతో అద్వానీని ప్రసన్నం చేసుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.  ప్రధాని వాజ్ పేయిని, ఉప ప్రధాని అద్వానీని, పాతిక మంది కేంద్ర  మంత్రులను జిల్లాకు తీసుకువచ్చారు. 2004లో  ఎన్నికలలో  తెలుగుదేశం పొత్తుతో బిజెపి  నెల్లూరు లోక్ సభ స్థానంలో,  అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది. రాజకీయ వారసులుగా  తన పిల్లలను తీసుకురానని  వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పేవారు. అయితే ఆయన మనసులో మాత్రం తన  కూతురును ప్రజా ప్రతినిధిగా చూడాలనే బలమైన కోరిక ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో తన కుమార్తె దీపను నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి  పోటీ చేయించాలని వెంకయ్య నాయుడు భావించారు. ఇందు కోసం సర్వే కూడా చేయించారు. టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తే  విజయం  సాధించే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో  చివరి దశలో  ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు.  అయితే ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తె దీపను తప్పనిసరిగా ఎన్నికల బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సారి కూడా  బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు  ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి తన  కూతురిని ఎన్నికల బరిలో దింపేందుకు వెంకయ్య నాయుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీప ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వివిధ  కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  అక్షర విద్యాలయ పేరుతో స్కూలు కూడా  నిర్వహిస్తున్నారు. ఎన్నికల  బరిలో దిగేందుకు ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

source:sakshi
Continue Reading | comments

జగన్ అపోజిట్ మీడియా అవాక్కయిందా!

Thursday, January 23, 2014

తెలుగు మీడియాకు ఒక జాడ్యం ఉంది. తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే సత్యం అని అనుకోవడమే ఆ జాడ్యం. బహుశా దశాబ్దాలుగా తెలుగులో ఒక వార్తా సంస్థదే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నందు వల్ల వచ్చిన జాడ్యమేమో అది. సామాన్యులను రాజకీయనాయకులుగా తయారు చేసేదీ మేమే, ప్రభుత్వాలను కూలగొట్టగలిదేదీ మేమే అని భావించే తెలుగు మీడియా వర్గాలు ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని భావిస్తున్నట్టుగా ఉన్నాయి. 
తమ కులదైవమైన వ్యక్తి దూసుకుపోతున్నాడని రాస్తే అతడు నిజంగానే దూసుకుపోతాడని, తమకు నచ్చని వ్యక్తి గురించి తాము గీస్తున్న గ్రాఫులన్నీ పడిపోతున్నాయని రాస్తే నిజంగానే పడిపోతాయని మన మీడియా భావిస్తోంది. అయితే ఇవన్నీ 80ల నాటి రాజకీయాలు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక రోజులోనే మీడియా అంచనాలు తలకిందుల అవుతున్నాయి. 
అందుకు తాజా వ్యవహారమే ఉదాహరణ.. జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గిపోతోందని, ఆయన ఆదరణ విషయంలో తాము లెక్కలేసి గ్రాఫులు గీస్తే అవన్నీ పాతాళం దిశగా పరిగెడుతున్నాయని ఒక వర్గం మీడియా వరస కథనాలు రాస్తూ వస్తోంది. అయితే ఆ సర్వేలు ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్లకముందే... జాతీయ మీడియా జోక్యం చేసుకొంది. కౌంటర్ సర్వేలు కాదు కానీ.. మన తెలుగు మీడియా వెలువరిచిన సర్వేలకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది జాతీయ మీడియా. 
రాష్ట్రంలో జగన్ పరిస్థితి అయిపోయిందని ఏపీ మీడియా అంటుంటే.. ఓవరాల్ గా పాతిక శాతం మంత్రి తెలుగు వాళ్లు జగన్ కే ఓటు వేసే పరిస్థితి ఉందని, సీమాంధ్రలో అయితే ఈ శాతం 48 గా ఉందని జాతీయ మీడియా లెక్కలేస్తోంది. ఫలితంగా జగన్ పార్టీ కి 19 ఎంపీసీట్లు లభించే అవకాశం ఉందని నేషనల్ మీడియా అభిప్రాయపడుతోంది. ఈ సర్వేలు చూసి తెలుగు మీడియా చాలా ఆశ్చర్యపోతోంది, అవాక్కవుతోంది. కచ్చితంగా తాము తమ మార్కు సర్వేలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే జాతీయ మీడియా తన పరిశీలనల గురించి వెల్లడించడంతో తమ అస్త్రాలు ఫెయిలయ్యాయని బాధపడుతోంది
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-opposite-media-shocks-49851.html#sthash.yCBUb3ZH.dpuf
Continue Reading | comments

గ్రేట్ ఆంధ్ర : జగన్‌... ఒక్క అడుగు!

Sunday, November 3, 2013

ఒక్క అడుగు కీలకం.. మడమ తిప్పకుండా ముందుకెళ్లి ఆయన ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాలి!
ఒక్క అడుగు కీలకం.. అదేదో ప్రజలనే అడిగి ఆయన తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి!!
ఒక్క అడుగు కీలకం.. ప్రస్థానం చెల్లిపోయిందని ప్రపంచం గేలిచేస్తున్న వేళ.. తెలంగాణ బరిలో తన విధానంలోని నిజాయితీని చాటుకోవడానికి వేసే ప్రతి ఒక్క అడుగూ కీలకం!!!
తొలి అడుగులు ఎలా పడతాయో అదే కీలకం అని అదే ముచ్చట అని అనుకుంటాం మనం. కానీ మలి అడుగులు కీలకం అవుతున్నాయిప్పుడు. ఇంతకాలం పార్టీని నడిపిన తర్వాత.. జగన్మోహనరెడ్డి ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ‘తెలంగాణ కూడా నాక్కావాలి..’ అని జగన్‌ అంటుండవచ్చు గాక కానీ తెలంగాణ వారు కూడా ‘జగన్‌ మాక్కావాలి’ అనుకోవాలి. అలాంటి వారు అనల్పంగా ఉన్నారని జగన్‌ నమ్మిక. తన తండ్రి వైఎస్సార్‌ వేసిన ప్రగతి పునాదులు ప్రజలప్రేమను పటిష్టంగా నిర్మించాయని ఆయన విశ్వాసం.
అయితే.. విజయమ్మ కారు మీదకు విసరబడిన కోడిగుడ్లు జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేవి కాదు! అల్లరిని ఉద్యమం అనుకుని జడిసే స్థితిలో జగన్‌ ఉండకపోతే గనుక.. ఆయన తాను కూడా తన సమైక్య సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో తాను స్వయంగా ఆయన పర్యటనకు పూనుకోవచ్చు. జగన్‌ తెలంగాణలో అడుగుపెట్టడానికి యాత్రకు సిద్ధమవుతున్నాడంటేనే.. జడుస్తున్న వారో.. పోరాడుతున్న వారో... ఆయనకు పదేపదే ‘మానుకోట’ను గుర్తుచేస్తుండవచ్చు! భయపెట్టగలమని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ వేచిచూడాలి... ఆయన రాళ్లకు వెరచి ఆగుతారో.. ఎదురు నిలిచి పోరుతారో.. ఒడుపుగా వాటిని పట్టుకుని.. తనకంటూ ఓ దుర్గం నిర్మించుకుంటారో...!!
==============================
తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలనే వాంఛ  ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైన అభివృద్ధి కలలు వారి కనుల ముందు సాక్షాత్కరిస్తాయనే విషయంలో ‘కోరుకుంటున్న ప్రజల్లో’ ఎందరికి స్పష్టమైన అవగాహన ఉన్నదనే సంగతి లెక్కవెయ్యలేం. ఏం జరుగుతుందో తెలియదు గానీ, అందరూ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని అంటున్నారు గనుక.. ఆ మాటలు నమ్ముతూ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారు అనేకులు. ‘అందరూ’ కొందరిని విలన్లుగా చిత్రీకరిస్తూ పదేపదే ప్రచారం చేస్తున్నారు గనుక.. తాము కూడా విలన్లుగా భావిస్తున్న వారు అనేకులు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, దోపిడీలు, కబ్జాలు ఇత్యాది విషయాలలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం అవుతుండవచ్చు గాక.. కానీ, పైన చెప్పుకున్న వీరందరిలోనూ నిజంగానే తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరిక ఉన్నది. కానీ యావత్తు తెలంగాణ ప్రాంతంలో ‘వీరు’ ఎందరున్నారు? అదే ఇప్పుడు పెద్ద చిక్కుముడి. తెలంగాణలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ‘వీరి’ వాటా ఎంత? మిగిలిన వాటా ఎంత? ఆ మిగిలిన వాటాలో ఎందరున్నారు? వారు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? తమ ఆశలను తీర్చగల చుక్కానిగా ఎవరిని ఎంచుకుంటున్నారు? వేరే ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? సమైక్యాంధ్ర ఉద్యమానికి, సమైక్యాంధ్ర భావజాలానికి బయటకు కనపడని మూలాలు అనేకం తెలంగాణలోనే ఉన్నాయనడానికి వారికి తమ అవ్యక్త ఆశలను నెరవేర్చగల రాజకీయ ఆశాదీపంగా సమైక్య శంఖారావం పూరించి.. సోనియాను హెచ్చరించిన జగన్మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారని వాస్తవమూలాల్ని వివరించేందుకు గ్రేట్‌ఆంధ్ర ప్రయత్నం.. ఈ వ్యాసం.
అవ్యక్త బాధాసర్పదష్టులు అనేకులు
‘తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వచ్చి ఒదిగిపోయారు. కానీ తెలుగువాళ్లు కలవడం లేదు. అందుకే ఇప్పుడీ విభజన తగాదాలు వస్తున్నాయి’ అని ఈ మధ్య కొందరు పెద్దలు వాక్రుచ్చారు. కానీ వారు అయితే మూలాలు తెలియకుండా మాట్లాడి ఉండాలి. లేదా, ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను ప్రచారంచేసేందుకు అలా మాట్లాడి ఉండాలి. తెలంగాణలో ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలైన వచ్చి కలిసిపోయి ఉండవచ్చు గాక.. కానీ వారి మాటల్లో ‘తెలుగువారు’ వాస్తవానికి సీమాంధ్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి జనజీవితంలో మిళితం అయినట్లుగా మరొకరు మనకు కనిపించరు. సోకాల్డ్‌ తె-వాదపు పెద్దలు  చెబుతున్న మాటల్లో ‘ఇక్కడ కలిసిపోయిన ఇతర రాష్ట్రాల వారు’ ప్రధానంగా హైదరాబాదు నగరంలో కేంద్రీకృతం అయిన వారు. అంటే వ్యాపార అవకాశాలు ఎక్కడ విస్తారంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వారు వచ్చి స్థిరపడ్డారు.. కలిశారు. కానీ సీమాంధ్రులు అలా కాదు. వారు తాము మరో ప్రాంతానికి వెళుతున్నాం అనే భావన లేకుండానే ఇది మనదే అనే ఉద్దేశంతోనే ఇక్కడి సామాన్య జనజీవితంలో తామూ ఒక భాగంగా కలిశారు. వీరు కేవలం హైదరాబాదు నగరం మీది మోజుతో వచ్చి స్థిరపడిన వారు కాదు. ఇరుగుపొరుగు భావనలతో యావత్తు తెలంగాణ ప్రాంతంలోని అనేక కుగ్రామాలలో సైతం సేద్యం పనులు చేసుకుంటూ సొంతానికి కొంత  వ్యవసాయం ఏర్పాటు చేసుకుని స్థిరపడిన వారు. వారికి సీమాంధ్ర తెలంగాణ పేరుకు రెండు ప్రాంతాలే తప్ప వేరువేరు అనే భావన ఉండదు. ఆ మాటకొస్తే సీమాంధ్ర ప్రాంతంనుంచి వచ్చి స్థిరపడిన రైతు, వృత్తిపనివాడు లేని పల్లె మనకు యావత్తు తెలంగాణలో దుర్భిణి వేసి వెతికినా దొరకదన్నది వాస్తవం. 
ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ బాగా కలిసిపోయారంటూ చిలకపలుకులు పలికే మేధావులు గమనించాల్సిన మరో వాస్తవం కూడా ఉంది. హైదరాబాదులో వారి దామాషా ఎంత? తెలంగాణ పల్లెపట్టుల్లో స్థిరపడిన సీమాంధ్రుల దామాషా ఎంత? చూస్తే తెలిసిపోతుంది. సీమాంధ్ర ప్రాంతీయులు కేవలం ఇక్కడి వ్యాపారపరమైన ఆకర్షణకు ఎగిరి వచ్చారో.. లేదా, తెలంగాణ ప్రాంతపు జనజీవన మూలాల్లో తాము కూడా ఒక భాగంగా బతకడానికి వచ్చారో తేలిపోతుంది. 
వారికి తమ జన్మమూలాలు ఎక్కడున్నాయో తెలుసు. సదరు సీమాంధ్ర ప్రాంతంతో తమ అనుబంధం ఏమిటో తెలుసు. శ్రీకాకుళంనుంచి వలస వచ్చిన కుటుంబ వారసుడు కేసీఆర్‌కు ఆ మూలాల మీది అనుబంధం లేదని అనలేం. ఆ అనుబంధాన్ని తోసిరాజని.. సీమాంధ్రులందరినీ దోపిడీ దొంగలుగా చిత్రించేయడానికి, కేసీఆర్‌కు కనిపించినట్లుగా కనులముందు ఈ ప్రజలందరికీ అధికార పీఠాలు కనిపిస్తూ ఉండకపోవచ్చు. అందుకే వారు తమ మూలాలున్న ప్రాంతంతో బంధం తెగిపోవడం అంటే.. మనస్సు ఎక్కడో చివుక్కు మంటున్నదని బాధపడుతున్నారు. తల్లిపేగు కత్తిరించినట్లుగా ఉన్నదని వేదన చెందుతున్నారు. 
అలాంటి జనం యావత్‌ తెలంగాణలో ఏ కులం కంటె, ఏ మతం కంటె, ఏ వర్గం కంటె కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్న మాట ఇవాళ కఠోరమైన వాస్తవం. పెద్దసమస్య తలెత్తినప్పుడు, ఉన్న సమస్య చిన్నదైపోయినట్లుగా.. విభజన అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా వారంతా ఇప్పుడు ఒక్కటే జాతి అనుకుంటున్నారు. మరి వారి వేదన పరిమార్చే ప్రత్యామ్నాయం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో స్థిరపడి బతుకుతున్నందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వాంఛను వ్యక్తం చేయలేని బతుకులు ఈ ప్రాంతంలో కొన్ని లక్షలున్నాయి. వారి చుక్కాని ఎవ్వరు? 
ఉద్యమవేళల్లో తమ కోరికను చెప్పలేకపోవచ్చు గానీ.. ఓటు పర్వం అంటూ వస్తే.. రహస్యబ్యాలెట్‌ రాజ్యం చేసే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సమైక్యవాదానికి దన్నుగా నిలవగలమని వారు భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రస్తుతానికి సమైక్య వాదాన్ని వినిపిస్తున్న ఏకైక నాయకుడిగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల పర్వం వరకు ఈ రాష్ట్రం ముక్కలైపోకుండా ఉంటే గనుక.. జగన్‌ దిశగా తామంతా కలసి కట్టుగా ఒక్క అడుగు వేయాలనే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న నిర్దిష్టమైన జనవాహిని ఉన్నది. సరిగ్గా వారి ఆశ ఆలోచినస్తున్న దిశగానే.. వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నం కూడా నడుస్తున్నది.
తెలంగాణలో అస్తిత్వం అవశ్యం...
వైఎస్‌ జగన్మోహనరెడ్డి తను సమైక్యవాదాన్ని స్పష్టంగా స్వీకరించిన రోజున దాని నిర్వచనాన్ని కూడా వివరించారు. అవకాశవాద మీడియాల విశృంఖల రూపాల్లో అది మరుగున పడిపోయి ఉండొచ్చు గానీ.. ‘సమైక్యాంధ్ర అంటే కేవలం రాయలసీమ, కోస్తాంధ్ర కాదు. తెలంగాణ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను రాష్ట్రం కలిసిఉండాలని కోరుతున్నాను’ అంటూ ఆయన స్పష్టీకరించారు. కానీ వైకాపా తన ధోరణిని నిర్ణయించుకున్న రోజున క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది నాయకులు కంగారు పడ్డారు. వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. కానీ జగన్మోహనరెడ్డి మాత్రం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు. తాము సంకల్పించిన విధానానికే కట్టుబడ్డారు. 
తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వం అవశ్యం ఉండాల్సిందేనంటూ ఆయన పట్టుపట్టారు. ఈ వ్యాసం తొలిభాగంలో చెప్పుకున్న లక్షలాది మంది జనానికి కనీసం తమలోని కోరికను ఓటు రూపంలో వ్యక్తం చేయాలనుకున్నా కూడా వారికి ఒక మార్గం లేకుండా పోతున్నదని జగన్‌ గుర్తించారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా.. ప్రజల్ని ఓట్లుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప.. వారిలోని అసలైన ఆకాంక్షలను గుర్తించి వాటికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేయడంలేదనే.. వైఖరిని కూడా జగన్‌ అర్థం చేసుకున్నారు.  ఆ శూన్యాన్ని తాను భర్తీ చేయాలని అనుకున్నారు. 
‘పోగా మిగిలింది ఆస్తి’ అనే సామెత తరహాలో.. పోయినవారు పోగా మిగిలిందే పార్టీ అనే సిద్ధాంతానికి కట్టుబడ్డారు జగన్‌. ఎవరు మిగిలారో వారే ఎన్నికల్లో తలపడతారు. ప్రజల ఆశలకు దన్నుగా నిలుస్తారు అనే వాదనతో ఆయన పార్టీ నిర్మాణానికి సిద్ధ పడ్డారు. ఇవాళ మళ్లీ తెలంగాణ ప్రాంతంలో కూడా వైకాపా రాజకీయ పునాదులు నేల పొరల్లోంచి పొడుచుకు వస్తున్నాయి. అవి తె-వాదులకు కంటినలుసులా తయారవుతున్నాయి. వాటిని వారు చూడలేకపోతున్నారు. ఎలా ‘డీల్‌’ చేయాలో బోధపడని కంగారులో తప్పుడు దారులు తొక్కుతున్నారు. 
అల్లరి అభాసుపాలు కావాల్సిందే.. 
వైఎస్‌ విజయమ్మ వరద బాధిత రైతుల పరామర్శకు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు జరిగిన అల్లరి ద్వారా ఏం సాధించామని తె-ఉద్యమకారులు సంతసిస్తూ ఉంటారో గానీ.. నిజానికి మనం తొలుత చెప్పుకున్న వర్గానికి చెందిన ప్రజల్లో ఈ అల్లరి ఐక్య భావనను హెచ్చించి ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి రైతుల కన్నీటిని తుడవడానికి ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాకను వ్యతిరేకించడాన్ని వారు ఎలా సమర్థించుకుంటారు. వైకాపా తెలంగాణ రాష్ట్రం కావాలనే రాజకీయ డిమాండును వ్యతిరేకిస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతాన్ని కాదు. ప్రజల్ని కాదు. తెలంగాణ ప్రజల్లో విజయమ్మ పట్ల వ్యతిరేకత ఉన్నదనడానికి వీల్లేదు. తె-నాయకులు టముకు  వేస్తున్నట్లుగా ‘మీ సమైక్యవాదుల సానుభూతి మాకు అక్కర్లేదు’ అంటోంది ఎవరు? రాజకీయ ముసుగులో పోరుతున్న వారు మాత్రమే. ప్రజల్లోనే నిజమైన భావన అదే అయితే గనుక.. విజయమ్మ యాత్ర కోడిగుడ్లు విసిరిన వారి అల్లరి వలన కాదు... జనస్పందన లేక అర్థంతరంగా వెనుతిరిగి ఉండాలి. ఆర్తిలో ఉన్న జనంలో నిజమైన వైకాపా వ్యతిరేకత ఉంటే.. విజయమ్మ తమ పల్లెకు వచ్చినప్పుడు.. ఆమె చెంతకు రావడానికి వారు విముఖత ప్రదర్శించి ఉండాలి. అలాంటిది ప్రజల్లో ఉండే భావనను చెబుతుంది. అలాకాకుండా.. మధ్యలో కార్లను అడ్డుకుని కొంత అల్లరి చేస్తే ఏం జరుగుతుంది. అంతా  ఉత్తిదే. 
ఐక్యంగా ఉండే జాతిలో సమైక్యవాదం ఆవశ్యకత మరింత స్పష్టంగా అర్థం కావడానికి ఇలాంటి అల్లరి ఉపకరిస్తుంది. 
మరింత జాగ్రత్తగా మలి అడుగులు
తెలంగాణ ప్రాంతంలో కూడా దూసుకెళ్లడానికి అక్కడి జనస్పందనను- ధిక్కార తిరస్కారాదులను బేరీజు వేయడానికి విజయమ్మ యాత్ర రూపంలో జగన్‌ చేసిన ట్రయల్‌ రన్‌ ఇది అని పలువురు విమర్శించవచ్చు గాక! దాన్ని కాదనడానికి వీల్లేదు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆమాత్రం అప్రమత్తత ఉండదనలేం. 
సమైక్యవాదానికి కట్టుబడిన తర్వాత.. తెలంగాణ ప్రాంతంలో తొలి అడుగుల్లో విజయమ్మకు ఎదురైన స్పందనను బట్టి.. వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మలి అడుగులను మరింత పటిష్టంగా ప్లాన్‌ చేసుకుంటారు. ఎవరు కాదనగలరు? మానుకోటలాగా రాళ్లు విసురుతాం అని.. పైనపల్లిలాగా కోడిగుడ్లు చెప్పులు విసురుతాం అని ఎన్నాళ్లు బెదరగొడతారు. ప్రజాస్వామిక ప్రపంచంలో ఇలాంటి చర్యలు ఎలా సాధ్యం?
మన వ్యాసంలో తొలినుంచి ప్రస్తావిస్తున్న తెలంగాణలోని ప్రత్యేక జాతికి ఇప్పుడు జగన్‌ ఒక్కడే ఆశాదీపం కనిపించడం నిస్సంశయం. ఇతర పార్టీలు రాజకీయంగా ప్రజలతో గేమ్‌ ఆడుతున్నాయని ప్రజలందరూ గుర్తించారు. వీరి ఆకాంక్ష వైపుగానే జగన్‌ నడుస్తున్నారు. అది తనకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుస్తుందని ఆయనకు తెలుసు. సరిగ్గా అక్కడే తె-పార్టీలకు కంగారు పుడుతోంది. జగన్‌ తెలంగాణలో తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటే  గనుక యావత్‌ తెలంగాణ వాదం పేరిట తాము చేస్తున్న ప్రచారం... నిర్మించిన అభూత కల్పనలన్నీ కుప్పకూలిపోతాయని వారు భయపడుతున్నారు. అందుకే జగన్‌ పర్యటనల పట్ల దాడులు ప్లాన్‌చేస్తున్నారు.
కానీ  ఇప్పుడే కోర్టు అనుమతులు పొందిన తరువాత.. పర్యటనలకు సిద్ధం అవుతున్న జగన్‌ యావత్‌ తెలంగాణ మీద కూడా తన దృష్టి సారించడం మాత్రం తథ్యం. ఎన్నికల లోగా చీల్చేసి.. ఓట్లు సీట్ల రాజకీయ యావ ముందు మరే ప్రజాకాంక్షలూ నిలవలేని కాంగ్రెసు నిస్సిగ్గుగా నిరూపించుకుంటే తప్ప.. ఎన్నికల బరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎవరు చెప్పగలరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా పడే ఓటును పార్టీలు పంచుకుంటాయి గానీ.. జగన్‌కు పడే ప్రతి ఒక్క ఓటు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నదే అవుతుంది.
తెలంగాణ ప్రాంతంలో జగన్‌.. 2014 ఎన్నికలు పూర్తయ్యే సరికి తానొక అనధికార ప్లెబిసైట్‌ ఫలితంలాగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు. 
దుర్భేద్యమైన రాతిదుర్గం తయారవుతోంది...
తెలంగాణప్రజల్లో వైఎస్‌ జగన్‌కు ఒక దుర్భేద్యమైన సానుకూలాంశం ఉంది. అది వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పట్ల సామాన్యుల్లో ఉన్న ప్రేమ. ఇవాళ రోడ్ల మీద వైఎస్‌ విగ్రహాల్ని కాలబెట్టి ఉండవచ్చు. కానీ పూర్తిగా వైఎస్‌ ఆనవాళ్లను తుడిచేయాలనుకుంటే.. కొన్ని లక్షల మంది హృదయాలను తగలబెట్టాల్సి ఉంటుందని అల్లరి మూకలుగుర్తించాలి. ఆ వైఎస్‌ అభిమానం..  ప్రాంతీయ వైషమ్యామలకు, దురభిమానాలకు అతీతమైనది. ఇవాళ ప్రతికూల వాతావరణంలోనూ జగన్‌ను స్వాగతిస్తున్నది కూడా అదే! 
స్వానుభవాల్లోని చేదును విస్మరించి, అవకాశవాద ఆత్మవంచనతో వెర్రెత్తిపోయే నేత కాదు జగన్‌. మానుకోటలో పడిన రాళ్లు ఆయనకు గుర్తుంటాయి. ఇప్పుడు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలి మీద పడిన కోడిగుడ్లు, చెప్పులు కూడా ఆయనకు గుర్తుంటాయి. 
తత్వరీత్యా జగన్‌ ఎలాంటి వారంటే.. అప్పుడు పడిన రాళ్లతో ఓ దుర్గం నిర్మించుకుంటారు. దుర్భేద్యమైన ఆ రాతి దుర్గంలో జనాభిమానాన్ని ఆయన పదిలం చేసుకుంటారు.  ఇప్పుడు పడిన చెప్పుల స్థానే పూలను కూడా కురిపించుకునే రోజుకోసం ఆయన పరిశ్రమిస్తారు. 
ఈ రాష్ట్రం చీలిపోబోతున్నదని మనం అనుకుంటున్నాం-
కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది-
చీలిక ఇప్పటికే జరిగిపోయింది-
ఆ చీలిక, నిజానికి తెలంగాణలోని జనంలోనే ఉంది-
ఒక వర్గం- రాళ్లు, గుడ్లు పోగేసుకుని అల్లరిచేస్తోంది-
ఒక వర్గం- ఓటును పదిలంగా పట్టుకుని నిరీక్షిస్తోంది-
అంతిమవిజయం- నిజాయతీగల జనకాంక్షనే వరిస్తుంది!
- కపిలముని
http://telugu.greatandhra.com/articles/kapilamuni/kapilamuni-oka-adugu-47798.html


Continue Reading | comments

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం

Sunday, October 20, 2013

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని.. దానిని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ప్రధాని కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజన విషయంలో కేంద్రం అక్టోబర్ 3న ప్రకటించిన నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు అనుగుణంగా లేదని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉందని.. అది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా కూడా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
 ఈ వ్యాజ్యంపై       సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. రఘురామకృష్ణరాజు తరఫున ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మ విభూషణ్ ఫాలీ ఎస్.నారీమన్ వాదనలు వినిపించనున్నారు.

 గవర్నర్, స్పీకర్‌లను కలిసినా ప్రయోజనం లేకపోయింది.. ‘అసెంబ్లీకి బిల్లు రావడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి, విజ్ఞప్తి చేశారు. కానీ అటు గవర్నర్, ఇటు స్పీకర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందనా లేదు.
 
 అధికరణ 3 కింద రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకు తెలుసుకోలేదు. అంతేగాక ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చిదంబరం చేసిన ‘డిసెంబర్ 9’ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. పార్లమెంట్‌లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి లేదు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ తగిన సలహాలు ఇవ్వొచ్చు. అయితే అవి ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగించే విధంగా ఉంది. రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర తెలుసుకోకుండా, ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు.
 
 ముందు అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి..
 
 ‘ప్రస్తుతమున్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై రాజ్యాంగంలోని 3వ అధికరణలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలి. అనంతరం పార్లమెంట్ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతుంది.  ఆ తరువాతే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఇంతకు మించి మరో విధానం లేదు. 3వ అధికరణ విషయంలో కేంద్రం తనకు అధికరణ 73 కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించాలంటే.. ముందు అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి.
 
 అలా చేయకుండా విభజనపై ముందుకెళితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్లడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని 1955లోనే రామ్ జయకపూర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్ర కేబినెట్ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమేగాక, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయం కూడా. అందువల్ల ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలి.
 
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందుకు సంబంధించి అసెంబ్లీలో తగిన తీర్మానం చేస్తారని 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. దాంతో తెలంగాణపై ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందని డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371 (డి), 371 (ఇ)లను రాజ్యాంగంలో చేర్చారు. అవి అమలులో ఉండగా, విభజనపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రఘురాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

sakshi
Continue Reading | comments

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని.. దానిని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ప్రధాని కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజన విషయంలో కేంద్రం అక్టోబర్ 3న ప్రకటించిన నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు అనుగుణంగా లేదని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉందని.. అది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా కూడా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
 ఈ వ్యాజ్యంపై       సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. రఘురామకృష్ణరాజు తరఫున ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మ విభూషణ్ ఫాలీ ఎస్.నారీమన్ వాదనలు వినిపించనున్నారు.

 గవర్నర్, స్పీకర్‌లను కలిసినా ప్రయోజనం లేకపోయింది.. ‘అసెంబ్లీకి బిల్లు రావడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి, విజ్ఞప్తి చేశారు. కానీ అటు గవర్నర్, ఇటు స్పీకర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందనా లేదు.
 
 అధికరణ 3 కింద రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకు తెలుసుకోలేదు. అంతేగాక ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చిదంబరం చేసిన ‘డిసెంబర్ 9’ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. పార్లమెంట్‌లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి లేదు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ తగిన సలహాలు ఇవ్వొచ్చు. అయితే అవి ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగించే విధంగా ఉంది. రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర తెలుసుకోకుండా, ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు.
 
 ముందు అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి..
 
 ‘ప్రస్తుతమున్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై రాజ్యాంగంలోని 3వ అధికరణలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలి. అనంతరం పార్లమెంట్ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతుంది.  ఆ తరువాతే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఇంతకు మించి మరో విధానం లేదు. 3వ అధికరణ విషయంలో కేంద్రం తనకు అధికరణ 73 కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించాలంటే.. ముందు అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి.
 
 అలా చేయకుండా విభజనపై ముందుకెళితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్లడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని 1955లోనే రామ్ జయకపూర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్ర కేబినెట్ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమేగాక, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయం కూడా. అందువల్ల ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలి.
 
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందుకు సంబంధించి అసెంబ్లీలో తగిన తీర్మానం చేస్తారని 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. దాంతో తెలంగాణపై ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందని డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371 (డి), 371 (ఇ)లను రాజ్యాంగంలో చేర్చారు. అవి అమలులో ఉండగా, విభజనపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రఘురాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

sakshi
Continue Reading | comments

వామపక్షాల మధ్య వై.కాంగ్రెస్ పొత్తు చిచ్చు

Saturday, October 19, 2013

వామపక్షాల మధ్య కొత్త చిచ్చు ఏర్పడింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో సిపిఐ ఎమ్. పొత్తుకోసం ప్రయత్నిస్తోందని సిపిఐ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న మతతత్వ వ్యతిరేక సదస్సుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను పిలవడంపై రాష్ట్ర సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. డిల్లీలో సిపిఐ, సిపిఎం , సమాజ్ వాది వంటి పార్టీలు ఒక సదస్సును నిర్వహిస్తున్నాయి మామూలుగా అయితే టిడిపిని పిలిచేవారు.కాని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మోడీ చెంతకు వెళ్లడంతో ఆయనను వదలిపెట్టారు. అదే సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఆహ్వానించారు.జాతీయ స్థాయిలో మూడో ప్రంట్ ఏర్పాటుకోసం సన్నాహకంగా ఈ సదస్సు జరుగుతోందని భావిస్తున్నారు. అంతేకాక జాతీయ స్థాయిలో సిపిఎం నేతలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో ఇప్పటికే అవగాహనకు వచ్చారని నమ్ముతున్నారు. అదే సమయంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మాత్రం వామపక్షాల పొత్తు గురించి మాట్లాడుతూ డ్రామా ఆడుతున్నారని సిపిఐ నాయకులు విమర్శిస్తున్నారు. సిపిఐ జాతీయ నాయకులతో సదస్సుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఎలా పిలుస్తారని అబ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ దీనిపై బహిరంగంగానే సిపిఎం ను విమర్శించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బహిరంగంగానే చెప్పాలని, లోపల ఒకటి, బయట ఒకటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సిపిఎం ఇంకా స్పందించలేదు. సిపిఐ విబజనకు అనుకూలంగా ఉండగా సిపిఎం , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు సమైక్యం కోరుతున్నాయి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా సిపిఐ విమర్శిస్తోంది.అంతేకాక సిపిఐకి ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. టిడిపి తో పొత్తు కుదిరే పరిస్థితి లేక, అలాగే టిఆర్ఎస్ వారు పట్టించుకోక ఒంటరి యానం చేయవలసి వస్తుందన్న సందేహం వారిలో ఉంది.దీంతో వామపక్షాలుగా సిపిఎం వైఖరిని బహిర్గతం చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.నిజంగానే సిపిఎం కనుక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అది వామపక్షాల మధ్య అగాధం మరింత పెరుగుతుందని వీరు అంటున్నారు.దీనిపై సిపిఎం నేత రాఘవులు కూడా మరింత ఘాటుగా ధ్వజమెత్తారు,నారాయణ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు.నిజంగా ఆ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందో,లేదో కాని ఇప్పటికైతే వామపక్షాల మధ్య తగాదాకు అది మూలం అవుతోంది.

kommineni
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger