Showing posts with label videos. Show all posts
Showing posts with label videos. Show all posts
YS Jagan Pays Tribute to Akkineni Nageswara Rao
Wednesday, January 22, 2014
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొంటున్న జగన్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బుధవారం రాత్రికి హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి నాగేశ్వరరావు పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న నాగేశ్వరరావు కుమారుడు అగ్రహీరో అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్య, ఇతర కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు.
అక్కినేని మరణవార్త తెలియగానే జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయమే విజయమ్మ వెళ్లి అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించారు. వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మహానటుడు అక్కినేని మరణం వల్ల సమైక్య శంఖారావం యాత్రను జగన్ తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు ఉదయం జగన్ మళ్లీ చిత్తూరు వెళ్లి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగిస్తారు.
అక్కినేని మరణవార్త తెలియగానే జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయమే విజయమ్మ వెళ్లి అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించారు. వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మహానటుడు అక్కినేని మరణం వల్ల సమైక్య శంఖారావం యాత్రను జగన్ తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు ఉదయం జగన్ మళ్లీ చిత్తూరు వెళ్లి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగిస్తారు.
breaking,
image,
images,
news,
ticker,
videos
ముంబై: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య(23) హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు.
ముంబైలో దిగగానే అంధేరికి అనూహ్య క్యాచ్ మాట్లాడుకుందని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ కారు దారి మళ్లించి మార్గమధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడని వెల్లడించారు. ఆమె ఫోన్ లాక్కుని ఓ ఇంట్లో బంధించించి, ఐదు రోజుల పాటు దుండగులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తర్వాత కుంజూర్మార్గ్ లో నిర్జన ప్రదేశంలో యాసిడ్ పోసి ఆమెను తగులబెట్టారని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే.
http://www.sakshi.com/news/top-news/esther-anuya-murder-case-five-held-in-mumbai-99127
'అనూహ్య' కేసులో నమ్మలేని నిజాలు
Tuesday, January 21, 2014

ముంబైలో దిగగానే అంధేరికి అనూహ్య క్యాచ్ మాట్లాడుకుందని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ కారు దారి మళ్లించి మార్గమధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడని వెల్లడించారు. ఆమె ఫోన్ లాక్కుని ఓ ఇంట్లో బంధించించి, ఐదు రోజుల పాటు దుండగులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తర్వాత కుంజూర్మార్గ్ లో నిర్జన ప్రదేశంలో యాసిడ్ పోసి ఆమెను తగులబెట్టారని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే.
http://www.sakshi.com/news/top-news/esther-anuya-murder-case-five-held-in-mumbai-99127
feature,
featured,
images,
latest,
news,
politics,
ticker,
videos
చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు
Monday, January 20, 2014
చిత్తూరు: కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రానే కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర అనే మాట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు మాత్రం వినపడటం లేదని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పరని జగన్ వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్రను సోమవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో చేపట్టారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో డ్రామాలాడుతున్నారని, 9 ఏళ్ల పాలనలో ఆయన తన హామీల్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత పెరగాలన్నారు. ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని చెప్పారు.
రాష్ట్రాన్నివిడగొట్టడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కిరణ్ కుమ్మక్కయ్యారని జగన్ విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు. సోనియా గాంధీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్నివిడగొట్టడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కిరణ్ కుమ్మక్కయ్యారని జగన్ విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు. సోనియా గాంధీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.
Autonagar Surya Audio Launch
Labels:
entertainment,
news,
slide,
ticker,
videos
Subscribe to:
Posts (Atom)
































.jpg)





































