Showing posts with label image. Show all posts
Showing posts with label image. Show all posts

వైసీపీ నుండి వెళ్లిపోవట్లేదు ...

Wednesday, January 29, 2014

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్‌, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
Continue Reading | comments

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?

Tuesday, January 28, 2014

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ తీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యమాలను పట్టించుకోకుండానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టడానికి దేశ రాజధానిలో చకచకా పావులు కదుపుతోంది. ఫిబ్రవరి తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 
పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 తేదిన తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి జైరాం రమేశ్  ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
sakshi
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు అని సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది.
Continue Reading | comments

రాధాకృష్ణ కు విద్యుత్ ప్లాంట్ పునరుద్దరణ

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కు చెందిన జల విద్యుత్ కేంద్రం పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.విజయవాడ వద్ద విటిపిఎస్ కెనాల్ పై ఉన్న ఈ ప్లాంటు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని విమర్శలు రావడంతో అప్పట్లో ప్రభుత్వం అనుమతిని రద్దు చేసింది. నిపుణుల కమిటీ కూడా ఈ మేరకు సిఫారస్ చేసింది. అయితే అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కక్షతో దీనిని రద్దు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.ఆ తర్వాత దీని పునరుద్దరణకు ప్రయత్నాలు జరిగినా రోశయ్య ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.తాజాగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో సాక్షి పత్రిక దీనిపై ఒక కదనాన్ని ఇస్తూ నాడు చంద్రబాబు, నేడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్లాంట్ విషయంలో రాదాకృష్ణపై ప్రేమ కనబరిచారని వ్యాఖ్యానించింది.
Continue Reading | comments

Heart attack Movie Latest Photos
















Continue Reading | comments

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా జెసి!

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా జెసిజెసి దివాకర రెడ్డి
 రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి  నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి సదారంకు  ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేయనున్నారు. కాంగ్రెస్ తరఫున ముగ్గురినీ ప్రస్తుత రాజ్యసభ సభ్యులనే ఎంపిక చేశారు. కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ పేర్లును అధిష్టానం ఖరారు చేసింది.

అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు జెసి మూడు రోజుల క్రితమే ప్రకటించారు.  తనకు సహకరించాలని మంత్రులు  గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్ లతో పాటు పలువురు ఇతర నేతలను కోరారు.  అధిష్టానాన్ని ధిక్కరించి జెసి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు  పోటీ చేసే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

sakshi
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger