వైసీపీకి గుడ్బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?
బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బిజేపి ఏంటి?
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?
"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు.
మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?
రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది. బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?
వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?
0 comments:
Post a Comment