Home » , , , , , , » నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger