వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
0 comments:
Post a Comment