తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మధ్య పుష్కర వేడుకలను పూర్తి చేసుకొంది. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే టైమ్ కాస్తంత కలిసి వస్తోంది. కాంగ్రెస్ రాజకీయాల పుణ్యామా అని తెలంగాణ రాష్ట్ర సమితి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ సమయంలో టీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని ఫాంటసీలు కూడా వాస్తవంలో నిజం అవుతున్నాయి.
అలాంటి ఫాంటసీల్లో ముఖ్యమైనది రాజ్యసభ సభ్యత్వం. ఇప్పుడు తొలిసారి రాజ్యసభలో టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వ్యక్తి తన్నుకుపోతున్నాడని గులాబీ కండువాలు ఫీలవుతున్నాయి. తెరాస తరపున కే కేశవరావు రాజ్యసభకు నామినేషన్ వేశాడు. ఈయన కు తెరాస సభ్యత్వం ఉంది కదా, ఈయన కాంగ్రెస్ వాడు ఎలా అవుతాడు? అని అంటే.. ఆయన నిన్నలా మొన్న టీఆర్ఎస్ లో చేరాడని, దశాబ్ధకాలంగా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ ను అనేక మాటలు అని ఇప్పుడు టీఆర్ఎస్ చేరిన ఆరు నెలల్లోనే రాజ్యసభకు వెళ్తున్నాడనేది గులాబీ దళ నాయకుల భావన.
అది కూడా ఇది ఊరికే లభిస్తున్న అవకాశం కాదు. 12 సంవత్సరాల కు దక్కుతున్న అవకాశం. ఇలాంటి అవకాశాన్ని పార్టీ సిద్ధాంత కర్తల్లో ఎవరో ఒకరికి ఇస్తే బావుంటుండేది కానీ, ఇలా నిన్నలా మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చేస్తే ఎలా? అని టీఆర్ఎస్ నాయకులు గొణుక్కొంటున్నారు. అయితే ఇది అధినేత స్థాయిలో జరిగిపోయిన నిర్ణయం కాబట్టి ఇక చేయగలిగిందేమీ లేదన్న నిరాసక్తత కూడా కనిపిస్తోంది వారిలో. అయితే వాస్తవానికి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకొనేది సొంత శక్తితో కాదు కదా... కాంగ్రెస్ సభ్యుల సహకారం అందిస్తేనే కేకే గెలవగలడు. ఈ లెక్కన సగం కాంగ్రెస్ బలం, సగం టీఆర్ ఎస్ బలం.. అభ్యర్థి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి న్యాయం జరుగుతున్నట్టే!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/12-samvatsaralaku-avakasam-vasthe-danni-50048.html#sthash.wL3f2IXs.dpuf
0 comments:
Post a Comment