Home » , , , » వేటు తప్పదా?

వేటు తప్పదా?

సబిత, ధర్మానపై వేటు వేయాలన్న అధిష్ఠానం 
శాఖ మారిస్తే సరిపోతుందన్న కిరణ్‌ 
అరుునా అంగీకరించని హైకమాండ్గ 
చివరకు సరేనన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు
మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చమని ఆదేశం
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వేటు? 
విపక్షాలకు అవకాశమివ్వకూడదన్న నిర్ణయం 
కోర్టు తీర్పును బట్టి మిగతా వారిపై నిర్ణయం 
జగన్‌ విషయంలో మరింత కఠినం
కిరణ్‌కు సోనియా, రాహుల్‌ దిశానిర్దేశం 


కళంకిత మంత్రులపై వేటు తప్పేలా లేదు. అధిష్ఠానం ఆ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై వేటు పడేందుకు రంగం సిద్ధమయింది. వారిద్దరిపై వేటు వేయకుండా కిరణ్‌ చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ, అవినీతి ఆరోపణల విషయంలో అధిష్ఠానం దేశమంతా ఒకే విధానం అనుసరిస్తున్నందున కిరణ్‌ ఒత్తిడి ఫలించ లేదు. సీబీఐ చార్జిషీట్‌లో పేరు నమోదయి, కోర్టుల చుట్టు తిరుగుతున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఆదేశించింది. ముఖ్యమంత్రి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీ, అహ్మద్‌పటేల్‌ ఈ మేరకు కిరణ్‌కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 
అయితే, ఆ ఫైళ్లపై సంతకాలు చేసినందుకు మంత్రు లెవరూ లబ్థి చెందలేదని, కేవలం వైఎస్‌ కుటుంబం మాత్రమే లబ్థి పొందిందని కిరణ్‌ వివరించారు.

అందువల్ల వారి శాఖలు మారిస్తే సరిపోతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రి కోడెల నివాసంలో బాంబు పేలుడు జరిగిన తర్వాత కూడా ఆయనను చంద్రబాబు కొనసాగించారని గుర్తు చేసే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై దేశవ్యాప్తంగా ఒకే విధానం అనుసరిస్తున్నందున, మీ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ఖరాఖండీగా చెప్పడంతో కిరణ్‌ నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. తాజాగా ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించిన విషయాన్ని అధిష్ఠానం గుర్తు చేసింది.వారిని తొలగించాల్సిందేనని, అయితే అది ఎప్పుడు? ఎలా? అనేది మీ అనుకూలత బట్టి నిర్ణయించుకోవాలనే చిన్న వెసులుబాటు కలిగించింది. అయితే, మిగిలిన మంత్రులపై ఆరోపణలున్నప్పటికీ, వారిపై కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చని నాయకత్వం సూచించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ఉన్నందున అంతకంటే ముందే వారిద్దరినీ తప్పించవచ్చంటున్నారు.

ప్రతిపక్షాల నుంచి ఇప్పటి నుంచే విమర్శలు ఎదురవుతూ, ఎల్లుండి రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతోంది.అదే సమయంలో రాష్ట్రంలో జగన్‌ పార్టీ దూకుడును నియంత్రించాలని ఆదేశించింది. చంచల్‌గూడ జైలు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంగా మారిందని, అడ్డగోలుగా ములాఖాత్‌లు ఇస్తున్నారని, జగన్‌ జైలు నుంచే పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నారంటూ వీహీచ్‌, మధు యాష్కీ వంటి నేతలు చేసిన ఫిర్యాదులను అధిష్ఠానం ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, మరికొద్ది నెలల తర్వాత జగన్‌ పార్టీ కుప్పకూలిపోతుందని, ఇప్పటికే ఆ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని కిరణ్‌ వివరించారు. నిబంధల మేరకే వ్యవహరిస్తున్నామని జైళ్ల శాఖ అథికారులు చెప్పిన విషయాన్ని సీఎం వివరించారు.

source:సూర్య 
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger